News January 28, 2025

POLITICAL: వైసీపీకి పెద్దన్న గుడివాడేనా?

image

ఉమ్మడి విశాఖ YCPలో ఇప్పటి వరకు వలస నేతలే ఆధిపత్యం చెలాయించేవారన్న విమర్శలున్నాయి. గతంలో రీజనల్ కో-ఆర్డినేటర్లుగా విజయసాయిరెడ్డి,సుబ్బారెడ్డి వంటి వారు ఉండటమే దీనికి కారణం. కాగా..విజయసాయిరెడ్డి,అవంతి,ఆడారి రాజీనామాతో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, చోడవరం ఇన్‌ఛార్జ్‌గా మాజీమంత్రి అమర్నాథ్‌‌కు బాధ్యతలు అప్పగించారు. గుడివాడ తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై దాడి చేస్తూ పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.

Similar News

News September 16, 2025

రేపటి నుంచి మహిళలకు ఆరోగ్య పరీక్షలు: కలెక్టర్

image

మహిళలకు మెరుగైన ఆరోగ్య సేవలకై స్వస్త్ నారీ, సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమం రేపటి నుంచి అక్టోబర్ 2వరకు నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో మొత్తం 65 హెల్త్ క్యాంపులు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఈ క్యాంపులలో మహిళలకు బీపీ, షుగర్, ఓరల్, బ్రెస్ట్, సర్వైకల్ క్యాన్సర్లు, రక్తహీనత స్క్రీనింగ్ చేయనున్నారు.

News September 16, 2025

నందిగామలో గుండెపోటుతో డిగ్రీ విద్యార్థిని మృతి

image

నందిగామలో విద్యార్థిని నాగలక్ష్మి(18) గుండెపోటుతో మృతిచెందింది. అనాసాగరం గ్రామానికి చెందిన నాగలక్ష్మి నందిగామలోని ఓ ప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతోంది. సోమవారం సాయంత్రం 4:30 గంటల సమయంలో కళాశాల నుంచి స్నేహితురాళ్లతో సదరు విద్యార్థిని బయటకు వచ్చింది. నడుస్తూనే ఒక్కసారిగా కళ్లు తిరిగి పడిపోయింది. ఆమెను ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లగా.. వైద్యులు పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించారు.

News September 16, 2025

MP బండి, వార్తా ఛానళ్లపై KTR పరువు నష్టం దావా..!

image

MP బండిపై MLA KTR పరువునష్టం దావా వేశారు. తనపై నిరాధార ఆరోపణలు చేశారని, ఇందుకు రూ.10కోట్ల పరిహారం చెల్లించాలని సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. MP చేసిన వ్యాఖ్యలను ప్రసారం చేసిన, ప్రచురించిన పలు వార్తాఛానళ్లు, డిజిటల్ సైట్లపైనా KTR దావావేశారు. కాగా, AUG 8న ఫోన్ ట్యాపింగ్, ఇతరవాటిపై బండి KTRపై ఆరోపణలు చేశారు. అయితే దీనిపై ముందుగా తనకు క్షమాపణ చెప్పాలని KTR కోరినా MP నో చెప్పడంతో కోర్టుకెళ్లారు.