News January 28, 2025
POLITICAL: వైసీపీకి పెద్దన్న గుడివాడేనా?

ఉమ్మడి విశాఖ YCPలో ఇప్పటి వరకు వలస నేతలే ఆధిపత్యం చెలాయించేవారన్న విమర్శలున్నాయి. గతంలో రీజనల్ కో-ఆర్డినేటర్లుగా విజయసాయిరెడ్డి,సుబ్బారెడ్డి వంటి వారు ఉండటమే దీనికి కారణం. కాగా..విజయసాయిరెడ్డి,అవంతి,ఆడారి రాజీనామాతో విశాఖ జిల్లా అధ్యక్షుడిగా, చోడవరం ఇన్ఛార్జ్గా మాజీమంత్రి అమర్నాథ్కు బాధ్యతలు అప్పగించారు. గుడివాడ తనదైన శైలిలో కూటమి ప్రభుత్వంపై దాడి చేస్తూ పార్టీలో పెద్దన్న పాత్ర పోషిస్తున్నారు.
Similar News
News November 20, 2025
జనగామ జిల్లా ఆదర్శంగా నిలవాలి: కలెక్టర్

జనగాం జిల్లాలో PMDDKY అమలును ఆదర్శంగా నిలపాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. జనగామ కలెక్టరేట్ వీసీ హాల్లో జరిగిన సమీక్ష సమావేశంలో వ్యవసాయ, ఉద్యాన, పశుసంవర్ధక, మత్స్య, మార్కెటింగ్, సహకార, నీటిపారుదల, పౌర సరఫరాలు, భూగర్భ జలాలు తదితర శాఖల అధికారులతో కలెక్టర్ యోజన పురోగతిపై క్షుణ్ణంగా సమీక్షించారు.
News November 20, 2025
NLG: రోడ్లపై ధాన్యం వద్దు.. ప్రమాదాలకు కారణం కావొద్దు: ఎస్పీ

నల్గొండ జిల్లాలో రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై ఆరబెట్టి రోడ్డు ప్రమాదాలకు కారణం కావొద్దని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ హెచ్చరించారు. గురువారం ఆయన మాట్లాడుతూ.. రోడ్లపై ధాన్యం రాశులు, రాళ్లు ఉంచడం వల్ల ముఖ్యంగా రాత్రి సమయాల్లో వాహనదారులకు అవి కనిపించక ప్రమాదాల బారిన పడుతున్నారని తెలిపారు. రైతులు ఈ విషయంలో జాగ్రత్త వహించాలని, ప్రాణ నష్టం జరగకుండా సహకరించాలని ఎస్పీ కోరారు.
News November 20, 2025
ములుగు: గ్రంథాలయ వారోత్సవాలు ముగింపు

58వ గ్రంథాలయ వారోత్సవాల ముగింపు కార్యక్రమానికి జిల్లా గ్రంధాలయ సంస్థ చైర్మన్ రవి చందర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈనెల 14న జాతీయ గ్రంథాలయ వారోత్సవాలు ప్రారంభమయ్యాయి. గురువారం గ్రంధాలయ వారోత్సవాల ముగింపు సందర్భంగా పలు పోటీలు నిర్వహించి గెలుపొందిన వారికి బహుమతులు అందించారు. అదేవిధంగా పలువురిని సన్మానించారు. గ్రంథాలయాలను మంత్రి సీతక్క చొరవతో అభివృద్ధి చేస్తామని ఆయన అన్నారు.


