News March 23, 2025
ప్రజలు కాదు.. పొలిటీషియన్లే కులతత్వవాదులు: గడ్కరీ

ప్రజలు కులతత్వవాదులు కాదని కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అన్నారు. కానీ రాజకీయ నాయకులు మాత్రం వారి స్వార్థ ప్రయోజనాల కోసం కులాల గురించి మాట్లాడతారని ఓ కార్యక్రమంలో వ్యాఖ్యానించారు. వెనుకబాటుతనం కూడా పొలిటికల్ ఇంట్రెస్ట్గా మారుతోందని, ఎవరు ఎక్కువ వెనుకబడి ఉన్నారనే దానిపైనా పోటీ ఉందని గడ్కరీ పేర్కొన్నారు. సామాజిక అసమానతలను నిర్మూలించాల్సిన అవసరం ఉందని, కుల వివక్ష అంతం కావాలని అన్నారు.
Similar News
News March 24, 2025
మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్న జెఫ్ బెజోస్

అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ మరోసారి పెళ్లి పీటలెక్కబోతున్నారు. తన ప్రియురాలు లారెన్ శాంచెజ్ను వివాహం చేసుకోనున్నారు. ఈ మేరకు ఆహ్వాన పత్రికల పంపిణీ మెుదలు పెట్టారు. ఇటలీ వెనిస్లో వీరి మ్యారేజ్ జరగనుంది. అయితే ఇప్పటి వరకూ వివాహ తేదీ అధికారికంగా ప్రకటించలేదు. 2023లో వీరి నిశ్చితార్థం జరిగింది. జెఫ్ బెజోస్ 2019తో తన మెుదటి భార్య మెకెంజీతో విడాకులు తీసుకున్నారు. వీరికి ఒక కుమారుడు ఉన్నారు.
News March 24, 2025
పదో తరగతి ప్రశ్నాపత్రం లీక్.. ఆరుగురు అరెస్ట్!

TG: ఈనెల 21న నల్గొండ జిల్లా నకిరేకల్ గురుకులంలో తెలుగు ప్రశ్నాపత్రం లీక్ కావడం కలకలం రేపింది. ఎగ్జామ్ మొదలైన కాసేపటికే క్వశ్చన్ పేపర్ సోషల్ మీడియాలో ప్రత్యక్షమైంది. దీంతో విచారణ చేపట్టిన ఉన్నతాధికారులు తాజాగా పరీక్ష కేంద్రం చీఫ్ సూపరింటెండెంట్ గోపాల్, డిపార్ట్మెంటల్ అధికారి రామ్మోహన్ను విధుల నుంచి తొలగించారు. ఇదే కేసులో ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది.
News March 24, 2025
జాగ్రత్తగా మాట్లాడితే మంచిది: రజినీకి MP లావు కౌంటర్

AP: MP లావు శ్రీకృష్ణ దేవరాయలు ఆదేశాలతోనే తనపై ACB కేసు పెట్టిందని విడదల రజినీ ఆరోపించడంపై MP స్పందించారు. ‘ఫోన్ డేటా, భూముల విషయాలపై జాగ్రత్తగా మాట్లాడితే మంచిది. ఒకరిని విమర్శించే ముందు వివరాలన్నీ తెలుసుకోవాలి. లక్ష్మీబాలాజీ స్టోన్ క్రషర్స్కు, నాకూ ఏ సంబంధం లేదని IPS అధికారి పి.జాషువా స్టేట్మెంట్లో చెప్పారు. స్టోన్ క్రషర్స్లో అక్రమాలు జరిగాయని మీరే ఫిర్యాదు చేశారు’ అని అన్నారు.