News December 22, 2024

పోలింగ్ బూత్ వీడియోలు ఇవ్వడం కుదరదు: ఈసీ

image

ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. అభ్యర్థులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే డాక్యుమెంట్ల పరిధిలోకి సీసీటీవీ ఫుటేజీ రాదని పేర్కొంది. నిబంధనల సవరణపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కారు, ఈసీ కలిసి ఎన్నికల్లో పారదర్శకతను తొలగిస్తున్నారని విమర్శించింది.

Similar News

News January 10, 2026

విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి కలిసిపోతాయి: సీఎం

image

AP: ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యుత్తమ యూనివర్సిటీలను అమరావతికి తీసుకొస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. రాబోయే 6 నెలల్లోనే క్వాంటం కంప్యూటర్ అమరావతి నుంచి పనిచేయటం ప్రారంభిస్తుందన్నారు. కొందరు అమరావతి నిర్మాణ వేగాన్ని చూసి అసూయ చెందుతున్నారని విమర్శించారు. విజయవాడ, గుంటూరు, మంగళగిరి, అమరావతి.. అన్నీ కలిసిపోయి ఒక బెస్ట్ లివబుల్ సిటీగా తయారవుతుందని ఓ కాలేజీ వార్షికోత్సవ సభలో వివరించారు.

News January 10, 2026

రేపే మ్యాచ్.. రిషభ్ పంత్‌కు గాయం!

image

రేపు న్యూజిలాండ్‌తో తొలి వన్డేకు ముందు భారత స్టార్ ప్లేయర్ రిషభ్ పంత్ గాయపడ్డారు. బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న సమయంలో బంతి నడుము పైభాగంలో తాకినట్లు క్రీడా వర్గాలు పేర్కొన్నాయి. వెంటనే ఆయన మైదానాన్ని వీడగా సపోర్ట్ టీమ్ చికిత్స అందించినట్లు తెలిపాయి. అయితే గాయం తీవ్రత తెలియాల్సి ఉంది. దీనిపై బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయలేదు. గాయం తీవ్రత ఎక్కువైతే రేపు వడోదరలో జరిగే తొలి వన్డేలో పంత్ ఆడేది అనుమానమే.

News January 10, 2026

ఇరాన్ విప్లవం గురించి తెలుసా?

image

ఇరాన్ చివరి రాజు మహ్మద్ రెజా షా పహ్లావి 1941 నుంచి 1979 వరకు పాలించారు. ఆయిల్ నిల్వలను అమెరికా కంపెనీలకు కట్టబెట్టడం, పాశ్చాత్య సంస్కృతి పెరిగిపోవడంతో మత పెద్దలు, ప్రజల్లో అసంతృప్తి పెరిగింది. అయతుల్లా రుహొల్లా ఖమేనీ నాయకత్వంలో(1979) ఇస్లామిక్ విప్లవంతో రెజా దేశం విడిచి పారిపోయారు. ఖమేనీ US కంపెనీలను బహిష్కరించారు. మహిళలపై ఎన్నో ఆంక్షలు పెట్టారు. ఇప్పుడు మళ్లీ ఖమేనీల పాలనపై <<18808619>>వ్యతిరేకత<<>> మొదలైంది.