News December 22, 2024
పోలింగ్ బూత్ వీడియోలు ఇవ్వడం కుదరదు: ఈసీ

ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. పోలింగ్ బూత్లలోని సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. అభ్యర్థులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే డాక్యుమెంట్ల పరిధిలోకి సీసీటీవీ ఫుటేజీ రాదని పేర్కొంది. నిబంధనల సవరణపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కారు, ఈసీ కలిసి ఎన్నికల్లో పారదర్శకతను తొలగిస్తున్నారని విమర్శించింది.
Similar News
News January 7, 2026
ఈశ్వరప్ప హత్య కేసులో నలుగురి అరెస్ట్

తనకల్లు పోలీస్ స్టేషన్ సమీపంలో జరిగిన ఈశ్వరప్ప హత్య కేసులో నలుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కదిరి డీఎస్పీ శివ నారాయణ స్వామి వెల్లడించారు. రాగినేపల్లికి చెందిన హరి, చిన్నప్ప, గంగులప్ప, శంకరప్పను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నిందితుల నుంచి హత్యకు వాడిన స్కార్పియో వాహనం, రెండు కొడవళ్లు, నాలుగు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. కేసును వేగంగా ఛేదించిన పోలీసు సిబ్బందిని డీఎస్పీ అభినందించారు.
News January 7, 2026
ఒకే బెడ్రూమ్లో రెండు బెడ్లు ఉండవచ్చా?

ఒకే బెడ్రూమ్లో రెండు బెడ్లు ఉండడం వాస్తు ప్రకారం సరికాదని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు చెబుతున్నారు. ఇది భార్యాభర్తల మధ్య గొడవలు తేవొచ్చని అంటున్నారు. విరిగిపోయిన ఫర్నిచర్, పనికిరాని పాత వస్తువులు ఇంట్లో ఉంచితే ప్రతికూల శక్తి పెరుగుతుందని అంటున్నారు. ‘గురువుల చిత్రపటాలు చదువుకునే గదిలో ఉంచితే వారి ఆశీస్సులు అందుతాయి. ఇంటి శ్రేయస్సు, అభివృద్ధి కోసం ఈ నియమాలు పాటించాలి’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 7, 2026
మీ పిల్లలు అబద్ధాలు చెబుతున్నారా?

తల్లిదండ్రులతో టీనేజర్స్ ఎక్కువగా అబద్ధాలు చెబుతుంటారు. అయితే ఇది కౌమారదశలో ఓ భాగమని నిపుణులు చెబుతున్నారు. పేరెంట్స్ ఏమంటారోనని భయంతో, ‘మేం మంచి పిల్లలం’ అనిపించుకోడానికి అబద్ధాలు చెబుతారని అంటున్నారు. తమ హద్దులు, అమ్మానాన్నల రియాక్షన్స్ తెలుసుకోవడానికి నిజాలు దాస్తారని పేర్కొంటున్నారు. వాళ్లు మరింత స్వేచ్ఛను కోరుకుంటున్నారని అర్థమని, అతిగా నిర్బంధించవద్దని సూచిస్తున్నారు.


