News December 22, 2024

పోలింగ్ బూత్ వీడియోలు ఇవ్వడం కుదరదు: ఈసీ

image

ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. పోలింగ్ బూత్‌లలోని సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. అభ్యర్థులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే డాక్యుమెంట్ల పరిధిలోకి సీసీటీవీ ఫుటేజీ రాదని పేర్కొంది. నిబంధనల సవరణపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కారు, ఈసీ కలిసి ఎన్నికల్లో పారదర్శకతను తొలగిస్తున్నారని విమర్శించింది.

Similar News

News January 4, 2026

ఇలా చేస్తే ఐదు నిమిషాల్లోనే నిద్ర పోతారు

image

పని ఒత్తిడి, మానసిక ఆందోళనలతో చాలామంది నిద్రలేమితో ఇబ్బంది పడుతున్నారు. అయితే రాత్రి పడుకునే ముందు నిశ్శబ్దంగా కూర్చొని శ్వాసపై దృష్టి పెట్టి ధ్యానం చేయడం వలన మెదడు ప్రశాంతమవుతుంది. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ నియంత్రణలోకి వస్తుంది. నిద్రలో మేల్కొనే సమస్య ఉన్నవారికి సైతం ఈ టెక్నిక్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. రోజూ పడుకునే ముందు 5 నిమిషాల పాటు ధ్యానం చేస్తే మంచిదని నిపుణులు అంటున్నారు.

News January 4, 2026

రేపు బీఆర్ఎస్ PPT

image

TG: కృష్ణా జలాలపై ప్రభుత్వం ఇవాళ అసెంబ్లీలో నిర్వహించిన చర్చకు కౌంటర్‌గా బీఆర్ఎస్ కూడా పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌కు సిద్ధమైంది. రేపు ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్‌లో ‘నదీ జలాలు-కాంగ్రెస్ ద్రోహాలు’ పేరిట PPT ఇవ్వనున్నట్లు మాజీ మంత్రి హరీశ్ రావు ప్రకటించారు. కాగా రాష్ట్ర ఏర్పాటు సమయంలో నీటి కేటాయింపుల్లో కేసీఆర్, హరీశ్ రావు రాష్ట్రానికి అన్యాయం చేశారని సీఎం రేవంత్ ఆరోపించారు.

News January 3, 2026

వెనిజులాపై అమెరికా ఎందుకు దాడి చేసింది?

image

వెనిజులాపై అమెరికా దాడి చేసి ఆ దేశాధ్యక్షుడిని <<18751661>>అదుపులోకి<<>> తీసుకున్న విషయం తెలిసిందే. అయితే ఆ దేశంపై దాడికి కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. మదురో పాలనతో ఆర్థిక సంక్షోభం ఏర్పడి భారీగా USకు వలసలు పెరిగాయి. అదే విధంగా వెనిజులా చమురు నిల్వలపై అమెరికా ఆసక్తి చూపిస్తోంది. దీంతో పాటు డ్రగ్స్ అక్రమ రవాణా అంశం కూడా ట్రంప్‌ కఠిన చర్యలకు దారి తీశాయని విశ్లేషకుల అభిప్రాయం.