News December 22, 2024
పోలింగ్ బూత్ వీడియోలు ఇవ్వడం కుదరదు: ఈసీ

ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. పోలింగ్ బూత్లలోని సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. అభ్యర్థులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే డాక్యుమెంట్ల పరిధిలోకి సీసీటీవీ ఫుటేజీ రాదని పేర్కొంది. నిబంధనల సవరణపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కారు, ఈసీ కలిసి ఎన్నికల్లో పారదర్శకతను తొలగిస్తున్నారని విమర్శించింది.
Similar News
News December 27, 2025
పాల ఉత్పత్తి పెరగడానికి ఎలాంటి దాణా ఇవ్వాలి?

శీతాకాలంలో పశువుల శరీర ఉష్ణోగ్రత సరిగా ఉండటానికి అదనపు శక్తి అవసరం. దీని కోసం సాధారణ మేతతో పాటు, శక్తినిచ్చే దాణా, సప్లిమెంట్లు ఇవ్వాలి. బెర్సీమ్ గడ్డి, వివిధ రకాల మాంసకృత్తులు కలిగిన చెక్క (వేరుశనగ చెక్క, పత్తి చెక్క, సోయా బీన్ చెక్కలో ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి) దినుసులను దాణాలో కలిపి పశువులకు ఇవ్వాలి. పశువులకు పెట్టే ఆహారంలో 17% ఫైబర్ ఉంటే వాటి పాల ఉత్పత్తి, కొవ్వు పరిమాణం పెంచవచ్చు.
News December 27, 2025
ఆస్తుల వెల్లడి తప్పనిసరి.. IASలకు కేంద్రం హెచ్చరిక

IAS అధికారులకు కేంద్ర ప్రభుత్వం గట్టి హెచ్చరిక జారీ చేసింది. నిర్దేశిత గడువులోగా తమ ఆస్తుల వివరాలను వెల్లడించకపోతే క్రమశిక్షణ చర్యలు తప్పవని స్పష్టం చేసింది. అవసరమైతే పదోన్నతులను కూడా నిలిపివేస్తామని పేర్కొంది. IAS అధికారులు తమ వార్షిక స్థిరాస్తి వివరాలను 2026 జనవరి 31లోగా తప్పనిసరిగా దాఖలు చేయాలని ఆదేశించింది. గడువు దాటితే ప్రమోషన్లపై ప్రభావం ఉంటుందని తెలిపింది.
News December 27, 2025
శీతాకాలం.. పశువుల్లో పాల ఉత్పత్తి పెరగాలంటే?

శీతాకాలంలో పాడిపశువుల్లో ప్రధానంగా ఎదురయ్యే సమస్య పాల ఉత్పత్తి తగ్గడం. తీవ్రమైన చలి వల్ల పశువుల్లో ఒత్తిడి పెరిగి జీర్ణప్రక్రియ మందగించి తిన్న ఆహారం త్వరగా జీర్ణంకాదు. దీని వల్ల అవి సరిగా మేత తీసుకోక, అవసరమైన పోషకాలు అందక పశువుల్లో పాల ఉత్పత్తి తగ్గుతుంది. చలికాలంలో పశువుల్లో పాల ఉత్పత్తి పెరగడానికి ఎలాంటి గడ్డి, దాణా అందించాలి? ఏ జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకోవడానికి <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.


