News December 22, 2024
పోలింగ్ బూత్ వీడియోలు ఇవ్వడం కుదరదు: ఈసీ

ఎన్నికల నిబంధనల్లో కేంద్ర ఎన్నికల సంఘం కీలక మార్పుల్ని తీసుకొచ్చింది. పోలింగ్ బూత్లలోని సీసీ టీవీ ఫుటేజీ ఇవ్వడం ఇకపై కుదరదని స్పష్టం చేసింది. అభ్యర్థులకు, ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చే డాక్యుమెంట్ల పరిధిలోకి సీసీటీవీ ఫుటేజీ రాదని పేర్కొంది. నిబంధనల సవరణపై కాంగ్రెస్ మండిపడింది. మోదీ సర్కారు, ఈసీ కలిసి ఎన్నికల్లో పారదర్శకతను తొలగిస్తున్నారని విమర్శించింది.
Similar News
News December 24, 2025
బాధలు సరే.. బాధ్యత ఎవరిది?

ఢిల్లీలో మూడ్రోజులు ఉంటే అలర్జీ వచ్చిందన్న కేంద్రమంత్రి నితిన్ గడ్కరీ వ్యాఖ్యలు ఢిల్లీ ప్రజల బాధకు ఉదాహరణ. కానీ కబళిస్తున్న ఈ కాలుష్యానికి బాధ్యులు ఎవరు? కట్టడి బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలు రాజకీయ అజెండాతో పనిచేస్తూ తప్పు తమది కాదన్నట్లు కౌంటర్ ఇస్తున్నాయి తప్ప కచ్చిత పరిష్కారాలు చూపడం లేదు. ఇదో సీజనల్ ఇష్యూగా చూస్తున్నాయి తప్ప యుద్ధంలా సీరియస్గా తీసుకోవట్లేదు. అదే జరిగితే తీవ్రత తప్పక తగ్గేది.
News December 24, 2025
ప్యాకెట్ పాలను మళ్లీ మరిగిస్తున్నారా? జరిగేది ఇదే

పాశ్చరైజ్డ్ పాలను 72-75 డిగ్రీల వద్ద 15-20సెకన్లు, UHT మిల్క్ను 135-150 డిగ్రీల వద్ద 2-5సెకన్లు కాచి చల్లార్చి ప్యాక్ చేస్తారు. దీంతో ప్రమాదకర బ్యాక్టీరియాలైన E.coli, సాల్మొనెల్లా, లిస్టీరియా నాశనమవుతాయి. ఈ ప్యాకెట్లు ఫ్రిజ్లో పెట్టకున్నా పాలు ఫ్రెష్గా ఉంటాయి. మళ్లీ మరిగిస్తే బీ1, 2, 6, 12, సీ విటమిన్లు 20-30% తగ్గుతాయి. లాక్టోజ్, ప్రొటీన్లు రియాక్టై రుచి మారి, క్రీమ్ లేయర్గా ఏర్పడుతుంది.
News December 24, 2025
ఇతిహాసాలు క్విజ్ – 106 సమాధానం

ప్రశ్న: వజ్రాయుధాన్ని ఎవరి వెన్నుముకతో ఎందుకు తయారుచేశారు?
జవాబు: దధీచి వెన్నుముకతో వజ్రాయుధం తయారుచేశారు. వృతాసుర రాక్షసుడిని వధించడానికి తపఃశక్తితో పవిత్రమైన ఎముకలే కావాలని విష్ణువు సూచిస్తారు. లోక కల్యాణంకై దధీచి యోగాగ్నిలో తన ప్రాణాలు వీడి శరీరాన్ని త్యాగం చేశారు. అలా ఆయన వెన్నుముక అత్యంత శక్తివంతమైనది కాబట్టి, దాంతో ఇంద్రుని ఆయుధమైన వజ్రాయుధాన్ని తయారుచేశారు. <<-se>>#Ithihasaluquiz<<>>


