News October 16, 2024

మహారాష్ట్రలో బుధవారమే పోలింగ్.. ఎందుకంటే?

image

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు ఈసీ షెడ్యూల్ ప్రకటించింది. నవంబర్ 20న బుధవారం పోలింగ్ జరగనుంది. కాగా బుధవారమే పోలింగ్ జరపడం వెనుక పెద్ద కారణమే ఉందని సీఈసీ రాజీవ్ కుమార్ వెల్లడించారు. ‘పోలింగ్ కోసం మేం కావాలనే ఆ రోజును ఎంచుకున్నాం. వారం మధ్యలో బుధవారం పోలింగ్ పెడితే పట్టణ ఓటర్లు అధిక సంఖ్యలో ఓటు హక్కు వినియోగించుకుంటారు. అదే వీకెండ్‌లో పెడితే ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు’ అని ఆయన చెప్పారు.

Similar News

News December 28, 2025

గ్లిజరిన్‌తో చర్మానికి ఆరోగ్యం

image

గ్లిజరిన్ ఒక హ్యుమెక్టెంట్ అంటే ఇది చర్మం నుంచి తేమను లాగకుండా నిరోధిస్తుంది. లోపలి నుంచి తేమను నిలుపుకుంటుంది. పొడి చర్మతత్వం ఉన్నవారికి ఇది బాగా ఉపయోగపడుతుందంటున్నారు నిపుణులు. చర్మ ఎలాస్టిసిటీని పెంచి ముడతలు రాకుండా చూస్తుంది. గ్లిజరిన్‌లో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి మొటిమలకు కారణమయ్యే బ్యాక్టీరియాను చంపడంలో సహాయపడతాయి. దీన్ని నేరుగానూ లేదా ఇతర ఉత్పత్తుల్లో కలిపీ వాడొచ్చంటున్నారు.

News December 28, 2025

ఎల్లుండే ముక్కోటి ఏకాదశి! ఉత్తర ద్వార దర్శనానికి వెళ్తున్నారా?

image

డిసెంబర్ 30న వైకుంఠ ఏకాదశి. ఆ రోజు వైష్ణవాలయాలు వైకుంఠ ధామాలుగా మారుతాయి. అదే రోజున మహావిష్ణువు ముక్కోటి దేవతలతో భూలోకానికి వస్తారని ప్రతీతి. ఈ సందర్భంగా ఉదయం నుంచే ఆలయాల్లో ఉత్తర ద్వారాలు తెరుస్తారు. ఈ ద్వారం గుండా వెళ్లి స్వామిని దర్శిస్తే మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఈ పవిత్ర దినాన మీరు ఏ ఆలయానికి వెళ్తున్నారు? COMMENT! మరింత సమాచారం కోసం క్లిక్ <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 28, 2025

‘ముక్కోటి ఏకాదశి’ ఎందుకు స్పెషల్?

image

ఏడాదిలో 24 ఏకాదశులు ఉంటాయి. అందులో ముక్కోటి ఏకాదశి విశిష్టమైనది. ఈరోజే వైకుంఠ ద్వారాలు తెరుచుకుంటాయి. ముక్కోటి దేవతలు విష్ణుమూర్తిని దర్శించుకోవడానికి వైకుంఠం చేరుకుంటారు. అందుకే దీనిని ‘ముక్కోటి ఏకాదశి’ అంటారు. ఈ ఒక్క ఏకాదశి నాడు చేసే ఉపవాసం మిగిలిన 23 ఏకాదశుల ఫలితాన్ని ఇస్తుందని నమ్ముతారు. అందుకే సామాన్య భక్తుల నుంచి మునుల వరకు అందరూ ఈ రోజును మోక్షాన్ని ప్రసాదించే గొప్ప పర్వదినంగా భావిస్తారు.