News May 25, 2024

ముగిసిన పోలింగ్

image

దేశంలో ఆరో విడత పోలింగ్ ముగిసింది. 58 స్థానాల్లో 889మంది అభ్యర్థుల భవితవ్యాన్ని ఓటర్లు EVMలలో నిక్షిప్తం చేశారు. 6 గంటలకు ముందు క్యూలో నిల్చున్న వారికి ఓటేసేందుకు అధికారులు అవకాశం ఇస్తున్నారు. యూపీలో 14, ప.బెంగాల్‌లో 8, హరియాణాలో 10, ఢిల్లీలో 7, బిహార్‌లో 8, ఒడిశాలో 6, ఝార్ఖండ్‌లో 4, జమ్మూలో ఒక లోక్‌సభ స్థానానికి, ఒడిశాలోని 42 అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోలింగ్ జరిగింది. జూన్ 4న ఫలితాలు వెలువడతాయి.

Similar News

News December 3, 2025

నేపియర్ కంటే 4G బుల్లెట్ సూపర్ నేపియర్ ఎందుకు ప్రత్యేకం?

image

నేపియర్ గడ్డి ముదిరితే కాండం కాస్త గట్టిగా ఉంటుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్ కాండం ముదిరినా లోపల డొల్లగా ఉండి, పాడి పశువు తినడానికి సులువుగా ఉంటుంది. నేపియర్‌తో పోలిస్తే దీనిలో తీపిదనం కాస్త ఎక్కువగా ఉంటుంది. ఈ గడ్డి చాలా గుబురుగా పెరుగుతుంది. 4G బుల్లెట్ సూపర్ నేపియర్‌లో ప్రొటీన్ కంటెంట్, దిగుబడి, మొక్కలు పెరిగే ఎత్తు, మొక్క ఆకుల్లోని మృదుత్వం.. సాధారణ నేపియర్ గడ్డి కంటే ఎక్కువగా ఉంటుంది.

News December 3, 2025

సత్యనారాయణ వ్రతం ఎప్పుడు చేయాలి?

image

సత్యనారాయణ వ్రతాన్ని ఆచరించడానికి ఏకాదశి, పౌర్ణమి తిథులు అత్యంత శుభప్రదమైనవిగా పండితులు సూచిస్తారు. కొత్తగా ఉద్యోగం, వ్యాపారం ప్రారంభించే ముందు ఈ వ్రతం చేస్తే మంచి జరుగుతుందని నమ్ముతారు. ఇంట్లో సుఖశాంతులు, సానుకూల శక్తి కోసం, గృహ దోషాలు తొలగిపోవడానికి ఈ వ్రతం చేస్తారు. పుట్టినరోజు, పెళ్లిరోజు వంటి శుభ దినాలలో చేస్తే విశేష ఫలితాలుంటాయని నమ్మకం. ఈ వ్రతం గురించి మరింత సమాచారం కోసం <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News December 3, 2025

సత్యనారాయణస్వామి వ్రతం: ఏయే పూజలుంటాయి?

image

సత్యనారాయణస్వామి వ్రతంలో మొదటగా విఘ్నాలను తొలగించే వినాయకుడికి తొలి పూజలు చేస్తారు. ఆ తర్వాత కలశారాధన, పంచలోక పాలక పూజ, నవగ్రహ పూజ, అష్టదిక్పాలక పూజలు నిర్వహిస్తారు. అనంతరం ప్రధాన దైవమైన సత్యనారాయణ స్వామికి షోడశోపచార పూజలు, పంచామృత స్నానాలు, అష్టోత్తర శతనామ పూజలు సమర్పిస్తారు. చివరగా వ్రత కథను చదివి, హారతి ఇచ్చి, ప్రసాదం పంపిణీ చేయడంతో వ్రతం పూర్తవుతుంది.