News November 20, 2024
మహారాష్ట్రలో ముగిసిన పోలింగ్.. కాసేపట్లో WAY2NEWSలో ఎగ్జిట్ పోల్స్

మహారాష్ట్రలో పోలింగ్ ముగిసింది. మొత్తం 288 అసెంబ్లీ స్థానాలకు ఇవాళ పోలింగ్ జరిగింది. సినీ, క్రీడా, రాజకీయ ప్రముఖులు, ప్రజలు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 58శాతం ఓటింగ్ నమోదైంది. ఇవాళ సాయంత్రం 6 గంటల తర్వాత ఎగ్జిట్ పోల్స్, ఈనెల 23న ఫలితాలు వెలువడతాయి. ఎగ్జిట్ పోల్స్ను ఎక్స్క్లూజివ్గా WAY2NEWS యాప్లో చూడండి.
Similar News
News December 3, 2025
పశువుల్లో పాల ఉత్పత్తిని మరింత పెంచే గడ్డి ఇది

పశువుల్లో పాల ఉత్పత్తి పెరిగేందుకు చాలా మంది పాడి రైతులు సూపర్ నేపియర్ పశుగ్రాసం వాడుతున్నారు. ఇప్పుడు దీన్ని మించి అధిక ప్రొటీన్ శాతం కలిగి, పశువుల్లో పాల దిగుబడిని మరింత పెంచే ‘4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం’ అందుబాటులోకి వచ్చింది. నేపియర్తో పోలిస్తే చాలా మృదువుగా, 10-13 అడుగుల ఎత్తు పెరిగి, ఎకరాకు 200 టన్నుల దిగుబడినిస్తుంది. ఈ పశుగ్రాసం సాగు, ప్రత్యేకతల కోసం <<-se_10015>>పాడిపంట<<>> క్లిక్ చేయండి.
News December 3, 2025
APPLY NOW: IIIT వడోదరలో ఉద్యోగాలు

IIIT వడోదర 7 ఉద్యోగాలకు దరఖాస్తులు కోరుతోంది. వీటిలో ట్రైనింగ్& ప్లేస్మెంట్ ఆఫీసర్, అసిస్టెంట్ రిజిస్ట్రార్ పోస్టులు ఉన్నాయి. అర్హతగల వారు DEC 22 వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టును బట్టి PG(మేనేజ్మెంట్/ ఇంజినీరింగ్/LAW), CA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. రాత పరీక్ష/స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.56,100- రూ.1,77,500 చెల్లిస్తారు. వెబ్సైట్: iiitvadodara.ac.in
News December 3, 2025
ఈ నెల 6 నుంచి లోకేశ్ విదేశీ పర్యటన

AP: పెట్టుబడులను ఆకర్షించే లక్ష్యంతో మంత్రి నారా లోకేశ్ అమెరికా, కెనడా పర్యటనలకు సిద్ధమయ్యారు. ఈ నెల 6 నుంచి 9వ తేదీ వరకు అమెరికాలో, 11-12 తేదీల్లో కెనడాలో పర్యటిస్తారు. తొలి రోజు డల్లాస్లో ప్రవాసులతో భేటీ అవుతారు. ఆ తర్వాత శాన్ఫ్రాన్సిస్కో, న్యూయార్క్లో ప్రముఖ సంస్థల CEOలతో ‘బిజినెస్ టు బిజినెస్’ సమావేశాలు నిర్వహిస్తారు. కెనడాలో మాన్యుఫాక్చరింగ్ సంస్థలతో చర్చలు జరపనున్నారు.


