News April 27, 2024

పోలింగ్ స్టేషన్ ధ్వంసం.. ఈ నెల 29న రీపోలింగ్‌

image

కర్ణాటకలోని హనూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఓ పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇండిగనత్త గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో కనీస సౌకర్యాలు లేవని గ్రామస్థులు అధికారులను నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ స్టేషన్‌లోని ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో ఈ నెల 29న ఆ గ్రామంలో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు EC ప్రకటించింది.

Similar News

News September 16, 2025

దసరా అంటే విజయవాడకు వెళ్లాలనిపించేలా ఉత్సవాలు: సత్యకుమార్

image

AP: దసరా అంటే ప్రజలకు విజయవాడ వెళ్లాలనిపించేలా ‘విజయవాడ ఉత్సవ్’ నిర్వహిస్తామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ప్రజాప్రతినిధులతో VJAలో నిర్వహించిన ఉత్సవాల సన్నాహక సమావేశంలో మాట్లాడారు. ‘22వ తేదీ నుంచి 11రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తాం. అంతరించిపోతున్న కళలను పరిరక్షించేలా వేడుకలుంటాయి. VJAను పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ఇవి దోహదపడతాయి. మైసూర్ తరహాలో విజయవాడ ఫెస్ట్ నిర్వహిస్తాం’ అని తెలిపారు.

News September 16, 2025

రేవంత్.. ఇంతకన్నా చేతకానితనం ఉంటుందా: కేటీఆర్

image

TG: సీఎం రేవంత్, కాంగ్రెస్ సర్కారు ఘోరతప్పిదంతో SLBC టన్నెల్ కూలిందని, ఈ ఘటనలో ఆరుగురి మృతదేహాలను బయటకు తీయలేక చేతులెత్తేశారని KTR మండిపడ్డారు. ‘హైదరాబాద్ నాలాలో కొట్టుకుపోయిన ముగ్గురి డెడ్ బాడీలను మూడు రోజులైనా గుర్తించలేరా? ఇంతకన్నా చేతకానితనం, పరిపాలనా వైఫల్యం ఇంకోటి ఉంటుందా? తమ ఆప్తులను చివరి చూపు చూసుకోలేని బాధిత కుటుంబాల ఆవేదన ప్రభుత్వానికి వినిపించడం లేదా?’ అని ప్రశ్నలు సంధించారు.

News September 16, 2025

JAN నుంచి ఎక్కడా చెత్త కనిపించకూడదు: CBN

image

AP: రాష్ట్రంలో రేపటి నుంచి OCT 2 వరకు ‘స్వచ్ఛతా హీ సేవ’ చేపట్టాలని CM చంద్రబాబు ఆదేశించారు. ‘ఇంట్లో చెత్తను రోడ్డుపై వేయటం కొందరికి అలవాటు. కాలువల్లో చెత్త వేస్తే ప్రవాహానికి అడ్డుపడుతుంది. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో CC రోడ్లున్నా డ్రెయిన్లు సరిగ్గా లేవు. మ్యాజిక్ డ్రెయిన్లు నిర్మించాలి. గ్రామాలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయాలి. జనవరి నుంచి ఎక్కడా చెత్త కనిపించకూడదు’ అని కలెక్టర్లకు సూచించారు.