News April 27, 2024

పోలింగ్ స్టేషన్ ధ్వంసం.. ఈ నెల 29న రీపోలింగ్‌

image

కర్ణాటకలోని హనూర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఉన్న ఓ పోలింగ్ స్టేషన్‌లో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇండిగనత్త గ్రామంలో ఏర్పాటు చేసిన పోలింగ్ స్టేషన్‌లో కనీస సౌకర్యాలు లేవని గ్రామస్థులు అధికారులను నిలదీయడంతో ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ నేపథ్యంలోనే పోలింగ్ స్టేషన్‌లోని ఈవీఎంలను ధ్వంసం చేశారు. దీంతో ఈ నెల 29న ఆ గ్రామంలో రీపోలింగ్ నిర్వహించనున్నట్లు EC ప్రకటించింది.

Similar News

News January 9, 2026

నవ గ్రహాలు – అధి దేవతలు

image

1. ఆదిత్యుడు – అగ్ని
2. చంద్రుడు – నీరు
3. అంగారకుడు – భూదేవి
4. బుధుడు – విష్ణు
5. గురు – బ్రహ్మ
6. శుక్రుడు – ఇంద్రుడు
7. శని – యముడు
8. రాహువు – దుర్గ
9. కేతువు – చిత్ర గుప్తుడు

News January 9, 2026

ధనుర్మాసం: ఇరవై ఐదో రోజు కీర్తన

image

కృష్ణుడి అనుగ్రహం కోసం గోపికలు నిద్రిస్తున్న గోపికను నిద్రలేపే సన్నివేశం ఇది. బయట ఉన్నవారు ఆమెను ‘చిలుక’ అని పిలుస్తూ త్వరగా రమ్మనగా ఆమె చమత్కారంగా బదులిస్తుంది. చివరకు కంసుని గజమైన కువలయాపీడాన్ని, శత్రువులను సంహరించిన ఆ కృష్ణుని గుణగానం చేస్తేనే వ్రతం ఫలిస్తుందని, అందరం కలిసి భగవంతుడిని కీర్తిద్దామని వారు ఆమెను సాదరంగా ఆహ్వానిస్తారు. ఇలా అందరూ కలిసి భక్తితో కృష్ణుని వైపు పయనిస్తారు. <<-se>>#DHANURMASAM<<>>

News January 9, 2026

ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు

image

TG: వచ్చే విద్యాసంవత్సరం నుంచి ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు బూట్లు, బెల్టులు ప్రభుత్వం అందజేయనుంది. విద్యాశాఖ ప్రతిపాదనలను CM రేవంత్ రెడ్డి ఆమోదించారు. తద్వారా దాదాపు 20 లక్షలకు పైగా విద్యార్థులు లబ్ధి పొందనున్నారు. అదే సమయంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లలో ఆడబిడ్డలకు ప్రాధాన్యం ఇవ్వాలని CM సూచించారు. దీంతో మొదటి విడత పాఠశాలలు బాలికలకు కేటాయించనున్నారు.