News April 28, 2024

పోలింగ్ సమయం పొడిగించాలి: కాంగ్రెస్ నేత

image

TG: వేసవి తీవ్రత దృష్ట్యా లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సమయాన్ని రాష్ట్రంలో పొడిగించాలని సీఈవో వికాస్ రాజ్‌ను పీసీసీ సీనియర్ ఉపాధ్యక్షుడు నిరంజన్ కోరారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటలకు బదులుగా 6 గంటల వరకు పెంచాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. వడగాలుల భయంతో ప్రజలు బయటకొచ్చేందుకు భయపడుతున్నారని తెలిపారు. మరోవైపు కొన్ని సెగ్మెంట్లలో సాయంత్రం 4గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని ఈసీ నిర్ణయించింది.

Similar News

News January 19, 2026

మళ్లీ నేల చూపులే.. భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు

image

భారత స్టాక్ మార్కెట్లు ఇవాళ భారీ నష్టాల్లో మొదలయ్యాయి. సెన్సెక్స్ 615 పాయింట్లు కోల్పోయి 82,955 వద్ద, నిఫ్టీ 182 పాయింట్లు నష్టపోయి 25,512 వద్ద కొనసాగుతున్నాయి. ICICI బ్యాంక్(3.45%), రిలయన్స్(2.3%), ఇన్ఫోసిస్(1.18%) నష్టపోగా, ఇంటర్ గ్లోబ్ ఏవియేషన్(3.73%), TECHM(3.66%), మారుతీ సుజుకీ(1.3%) లాభాల్లో ట్రేడవుతున్నాయి. యూరప్ దేశాలపై ట్రంప్ టారిఫ్స్ ప్రభావం మార్కెట్లపై పడిందని ఎక్స్‌పర్టులు అంటున్నారు.

News January 19, 2026

50 వేల మంది ఉద్యోగులను తీసుకుంటాం: డెలాయిట్

image

గ్లోబల్ సంస్థ డెలాయిట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియాలో 50 వేల మంది ఉద్యోగులను నియమించుకోవాలని ప్లాన్ చేస్తున్నట్లు ప్రకటించింది. ‘ఇండియాలో 1.4 లక్షల మంది ఉద్యోగులు ఉన్నారు. ప్రపంచంలోని ప్రతి నలుగురు డెలాయిట్ ఉద్యోగుల్లో ఒకరు ఇండియన్. మరో 50 వేల మందికిపైగా తీసుకుంటాం. సంస్థ విస్తరణ కోసం మంగళూరు(KA)లో బ్రాంచ్ ఏర్పాటు చేస్తాం’ అని కంపెనీ సౌత్ ఆసియా సీఈవో రోమల్ శెట్టి ఓ కార్యక్రమంలో తెలిపారు.

News January 19, 2026

ట్రంప్‌కు ఈయూ షాక్ ఇవ్వనుందా..!

image

గ్రీన్‌లాండ్ డీల్‌ను వ్యతిరేకించిన దేశాలపై ట్రంప్ టారిఫ్స్ <<18885220>>విధించడాన్ని<<>> యూరోపియన్ యూనియన్ (EU) తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రతీకార సుంకాలు విధించాలని భావిస్తోంది. ఈయూ చరిత్రలో తొలిసారిగా ‘ట్రేడ్ బజూకా’ను ప్రయోగించాలని ప్లాన్ చేస్తోంది. దీనికి అదనంగా 93 బిలియన్ యూరోల(రూ.9.8 లక్షల కోట్లు) ప్రతీకార టారిఫ్స్ విధించడాన్ని ఈయూ పరిశీలిస్తోందని రాయిటర్స్ ఏజెన్సీ తెలిపింది.