News February 4, 2025

రేపే పోలింగ్.. అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు

image

రేపు ఢిల్లీ ఎన్నికల పోలింగ్ వేళ ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్‌పై కేసు నమోదైంది. యమునా నదిని హరియాణా విషపూరితంగా మారుస్తోందంటూ ఆయన చేసిన వ్యాఖ్యలపై ఆ రాష్ట్ర పోలీసులు కేసు నమోదు చేశారు. పౌరుల మనోభావాలు దెబ్బతీశారని, ద్వేషాన్ని రెచ్చగొట్టేందుకు ప్రయత్నం చేశారని FIRలో పేర్కొన్నారు.

Similar News

News February 5, 2025

ఫిబ్రవరి 5: చరిత్రలో ఈరోజు

image

✒ 1884: హైదరాబాద్ 6వ నిజాం మహబూబ్ అలీ ఖాన్ పట్టాభిషేకం
✒ 1915: ఆంధ్ర ప్రజా నాట్యమండలి వ్యవస్థాపకుడు గరికపాటి రాజారావు జననం
✒ 1920: బుర్రకథ పితామహుడు షేక్ నాజర్ జననం
✒ 1976: బాలీవుడ్ నటుడు అభిషేక్ బచ్చన్ జననం
✒ 1988: ప్రముఖ కవి బెళ్లూరి శ్రీనివాసమూర్తి మరణం
✒ 2008: వన్డేల్లో సచిన్ 16,000 పరుగులు పూర్తి చేశారు

News February 5, 2025

పుట్టిన రోజు శుభాకాంక్షలు

image

ఈ రోజు పుట్టినరోజు జరుపుకొంటున్న అందరికీ శుభాకాంక్షలు. పరిమితుల దృష్ట్యా ఫొటో ఎంపిక కాని వారు మన్నించగలరు. > ఫొటో, పేరు, ఊరు, పుట్టిన తేదీ వివరాలతో.. teluguteam@way2news.comకు SUBJECT: BIRTHDAYతో ముందురోజు (ex: MAY 1న పుట్టినరోజు అయితే APR 30న) ఉదయం గం.8:00-08:05 లోపు మెయిల్ చేయండి. పుట్టినరోజున మీ సన్నిహితులను ఆశ్చర్యపరచండి.

News February 5, 2025

భారత్‌తో వివాదం.. మాల్దీవుల టూరిజానికి భారీ దెబ్బ

image

INDతో దౌత్యపరమైన వివాదానికి దిగిన మాల్దీవులకు పర్యాటక రంగంలో భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆ దేశానికి 2023లో 2.09 లక్షలుగా ఉన్న ఇండియా టూరిస్టుల సంఖ్య 2024లో 1.30 లక్షలకు పడిపోయింది. మాల్దీవులకు వెళ్లే పర్యాటకుల్లో IND గతంలో టాప్‌లో ఉండగా ఇప్పుడు ఆరో స్థానానికి చేరింది. దీంతో ఈ ఏడాది ఇండియా నుంచి 3 లక్షల మంది టూరిస్టులను రప్పించేందుకు పెద్ద ఎత్తున ప్రచారం చేయనున్నట్లు మాల్దీవుల అధికారులు తెలిపారు.

error: Content is protected !!