News January 19, 2025
ఢిల్లీలో కాలుష్యం.. బ్యాడ్మింటన్ స్టార్ అసహనం!

ఇండియా ఓపెన్ టోర్నీలో పాల్గొన్న డెన్మార్క్ ప్లేయర్ బ్లిచ్ఫెల్ట్ ఢిల్లీలో పరిస్థితులు సరిగా లేవని అన్నారు. వాయు కాలుష్యం, పక్షుల రెట్టల మధ్య ప్రాక్టీస్ చేయలేకపోయానని చెప్పారు. వరుసగా రెండో ఏడాది అనారోగ్యానికి గురయ్యానని ఇన్స్టాలో పోస్ట్ పెట్టారు. దీనిపై స్పందించిన BAI టోర్నీ నిర్వహణకు ప్రత్యామ్నాయ వేదికలను చూస్తామని తెలిపింది. కాగా బ్లిచ్ఫెల్ట్ రెండో రౌండ్లోనే ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించారు.
Similar News
News November 19, 2025
కన్నె స్వాములు తప్పక చూడాల్సిన స్థానం

శబరిమల యాత్రలో పేరూర్తోడు నుంచి 12KM దూరంలో కాళైకట్టి అనే కారడవి ఉంటుంది. నేడు ఇది పచ్చని తోటగా మారింది. ఈ స్థలానికి 2 ప్రాముఖ్యతలున్నాయి. ఓనాడు అయ్యప్ప స్వామి తన సైన్య వృషభాలను ఇక్కడే కట్టేశాడట. మరోనాడు మహిషీ మర్దనం చూడడానికి వచ్చిన పరమేశ్వరుడు తన వృషభ వాహనాన్ని ఇక్కడ బంధించాడట. తొలిసారి యాత్ర చేసే కన్నె స్వాములు ఇక్కడ కొబ్బరికాయలు కొడితే ఈశ్వరుడి అనుగ్రహం కలుగుతుందని నమ్ముతారు. <<-se>>#AyyappaMala<<>>
News November 19, 2025
భారీ జీతంతో NTPCలో ఉద్యోగాలు

ఎన్టీపీసీ లిమిటెడ్ 4 ఎగ్జిక్యూటివ్(<
News November 19, 2025
లొంగిపోయేందుకు సిద్ధమైన హిడ్మా!

ఎన్కౌంటర్లో చనిపోయిన హిడ్మా నవంబర్ 10న రాసిన ఓ లేఖ వైరల్ అవుతోంది. ఛత్తీస్గఢ్లోని ఓ లోకల్ జర్నలిస్టుకు ఈ లెటర్ రాసినట్లు టైమ్స్ ఆఫ్ ఇండియా తెలిపింది. ‘జోహార్.. మొత్తం పార్టీ లొంగిపోయేందుకు సిద్ధంగా లేదు. సెక్యూరిటీ రిస్కులతో పాటు చాలా సమస్యలు ఉన్నాయి. మా భద్రతకు హామీ ఇస్తే ఎవరినైనా (లొంగిపోయేందుకు) కలిసేందుకు సిద్ధంగా ఉన్నాం. ప్రభుత్వం లొకేషన్ నిర్ణయించాలి’ అని లేఖలో ఉన్నట్లు పేర్కొంది.


