News August 20, 2024

CM కుర్చీపై పొంగులేటి కన్ను: మహేశ్వర్‌రెడ్డి

image

TG: CM కుర్చీపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి కన్ను పడిందని BJLP నేత మహేశ్వర్‌రెడ్డి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కొంతమంది MLAలను వెంటబెట్టుకొని ఆయన CMను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని ఆరోపించారు. కర్ణాటకలో DK శివకుమార్‌లా ఇక్కడ పొంగులేటి కీలకపాత్ర పోషిస్తున్నారని అన్నారు. ఢిల్లీలో కదిపే పావులు చూస్తుంటే పొంగులేటి ఇంకేదో పదవి ఆశిస్తున్నారని అనిపిస్తోందని మహేశ్వర్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు.

Similar News

News December 29, 2025

ఆ ఎమ్మెల్యేలకు డోర్స్ క్లోజ్: కేటీఆర్

image

TG: ఫిరాయింపు ఎమ్మెల్యేలు రాకుండా తమ పార్టీ తలుపులు మూసుకున్నాయని BRS వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. వారి స్థానంలో కొత్తవారికి అవకాశం ఇస్తామని చిట్ చాట్‌లో తెలిపారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలకు తాము ఏ పార్టీలో ఉన్నామో చెప్పుకోలేని గతి పట్టిందని దుయ్యబట్టారు. సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఎదురు దెబ్బ తగిలిందని, ఆ భయంతోనే మున్సిపల్ ఎన్నికలు పెట్టట్లేదని ఎద్దేవా చేశారు.

News December 29, 2025

వెండి మరో రికార్డ్.. రెండో అత్యంత విలువైన అసెట్

image

కొన్ని రోజులుగా వరుసగా పెరుగుతున్న వెండి ధరలు మరో రికార్డ్ నమోదు చేశాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఔన్సు వెండి ధర 84 డాలర్లకు చేరింది. దీంతో $4.65 ట్రిలియన్ల వాల్యూతో ప్రపంచంలోనే రెండో అత్యంత విలువైన అసెట్‌(గోల్డ్ తర్వాత)గా నిలిచింది. ప్రముఖ టెక్ సంస్థ ఎన్విడియాను ($4.63 ట్రిలియన్లు) కూడా వెండి వెనక్కి నెట్టడం విశేషం. భౌగోళిక ఉద్రిక్తతలు, డాలర్ విలువ తగ్గటంతో వెండికి ఈ మధ్య డిమాండ్ పెరిగింది.

News December 29, 2025

రేపు తిరుమలకు సీఎం రేవంత్ రెడ్డి

image

TG: సీఎం రేవంత్ రెడ్డి రేపు తిరుమలకు వెళ్లనున్నారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా కుటుంబసభ్యులతో కలిసి శ్రీవారిని దర్శించుకోనున్నారు. కాగా ఈ అర్ధరాత్రి నుంచి తిరుమలలో ఉత్తరద్వార దర్శనాలు ప్రారంభం కానున్నాయి. లక్షలాది మంది భక్తులు రానుండటంతో టీటీడీ విస్తృత ఏర్పాట్లు చేసింది.