News March 18, 2024
పొంగులేటి ప్రసాద్ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు..!

ఖమ్మం కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి ఖరారు అయినట్లు జిల్లాలో ప్రచారం జరుగుతుంది. కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి రేసులో డిప్యూటీ CM సతీమణి నందిని, మంత్రి తుమ్మల తనయుడు యుగంధర్, మంత్రి పొంగులేటి సోదరుడు ప్రసాద్ రెడ్డి ఉన్నారు. వీరిలో ప్రసాద్ రెడ్డి వైపే అధిష్ఠానం మొగ్గు చూపినట్లు తెలుస్తుంది. రేపు లేదా ఎల్లుండి ఖమ్మం ఎంపీ అభ్యర్థిగా పొంగులేటి ప్రసాద్ రెడ్డి పేరును అధిష్ఠానం ప్రకటించే అవకాశం ఉందని సమాచారం.
Similar News
News March 28, 2026
ఖమ్మం: ఈ ఒక్క రోజే అవకాశం!

ఖమ్మం జిల్లావ్యాప్తంగా ఉన్న అన్నీ కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నారు. రాజీ పడదగ్గ సివిల్, క్రిమినల్ కేసులు, చెక్ బౌన్స్, మోటారు వాహన ప్రమాద బీమా, బ్యాంకు రికవరీ కేసులను ఇరువర్గాల అంగీకారంతో త్వరితగతిన పరిష్కరించుకోవచ్చని న్యాయమూర్తులు తెలిపారు. ఈ అవకాశాన్ని కక్షిదారులు సద్వినియోగం చేసుకొని కోర్టుల చుట్టూ తిరిగే శ్రమను, ఖర్చులు తగ్గించుకోవాలని కోరారు.
News March 27, 2026
ఖమ్మం జిల్లాలో పలువురు తహశీల్దార్ల బదిలీ

జిల్లాలో పాలనా యంత్రాంగాన్ని మరింత పటిష్టం చేసే దిశగా కలెక్టర్ అనుదీప్ పలువురు MROలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ కార్యక్రమాల సమర్థ నిర్వహణే లక్ష్యంగా ఈ మార్పులు చేపట్టారు. దీనిలో భాగంగా ఖమ్మం అర్బన్ MROగా జయచందర్ డిప్యుటేషన్పై నియమితులయ్యారు. అలాగే కల్లూరుకు బ్రహ్మేశ్వరరావు, ఖమ్మం రూరల్కు వినయేందర్ రెడ్డి, నేలకొండపల్లికి రామ్ ప్రసాద్, సింగరేణికి వెంకటేశ్వర్లును బదిలీ చేశారు.
News March 26, 2026
ఇందిరమ్మ ఇళ్లు వేగవంతం చేయాలి: కలెక్టర్ అనుదీప్

తిరుమలాయపాలెం మండలం ఇస్లావత్ తండాలో కొనసాగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులను కలెక్టర్ అనుదీప్ గురువారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రభుత్వం అందిస్తున్న ఆర్థిక సహాయాన్ని లబ్ధిదారులు సద్వినియోగం చేసుకుని త్వరగా గృహాలను పూర్తి చేసుకోవాలని సూచించారు. మండలంలో మంజూరైన 802 ఇళ్లలో ప్రస్తుతం 736 గృహాలు వివిధ దశల్లో ఉన్నాయని వెల్లడించారు.


