News July 19, 2024
పూజా ఖేడ్కర్పై యూపీఎస్సీ చర్యలు

మహారాష్ట్రకు చెందిన ట్రైనీ ఐఏఎస్ పూజా ఖేడ్కర్పై యూపీఎస్సీ చర్యలు తీసుకుంది. ఐఏఎస్ అభ్యర్థిత్వాన్ని ఎందుకు రద్దు చేయవద్దో వివరణ ఇవ్వాలంటూ ఆమెకు షోకాజ్ నోటీసులు పంపింది. యూపీఎస్సీకి నకిలీ ఐడెంటిటీ సమర్పించి ఉద్యోగం సాధించడంతో ఈ నిర్ణయం తీసుకుంది. మళ్లీ ఆమె యూపీఎస్సీ పరీక్షలు రాయకుండా ఆంక్షలు విధించింది. ఆమెపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News December 27, 2025
CBN ప్రభుత్వమని గుర్తుంచుకోండి: అనిత

AP: శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎవరినీ వదిలిపెట్టేది లేదని హోం మంత్రి అనిత హెచ్చరించారు. జంతుబలులు చేసి ఉన్మాదుల్లా ప్రవర్తిస్తామంటే కుదరదని చెప్పారు. రాష్ట్రంలో ఉన్నది CBN ప్రభుత్వం అని గుర్తుంచుకోవాలన్నారు. పార్టీ నేతలు చేసేది తప్పని చెప్పలేరా అని మండిపడ్డారు. ఆస్తి కోసం తల్లి, చెల్లెలిపై కేసులు పెట్టించిన వ్యక్తి మీ పిల్లల్ని రక్షిస్తారని అనుకుంటున్నారా అని ప్రశ్నించారు.
News December 27, 2025
రైతు రామారావు ఫ్యామిలీకి అండగా ఉంటాం: CBN

AP: తన సమస్యను చెప్పుకొని గుండెపోటుతో మరణించిన అమరావతి రైతు రామారావు కుటుంబ సభ్యులను CM CBN ఫోన్లో పరామర్శించారు. ఆ కుటుంబానికి ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా సహకారం అందించి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాగా నిన్న మంత్రి నారాయణ నిర్వహించిన సమావేశంలో రైతు <<18679475>>రామారావు<<>> ఒక్కసారిగా కుప్పకూలిపోవడం తెలిసిందే. ఆసుపత్రికి తీసుకెళ్లే లోపే ఆయన మరణించారు.
News December 27, 2025
మండలాలు పక్క జిల్లాల్లోకి!

AP: <<18685889>>పునర్విభజనలో<<>> గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు నియోజకవర్గంలోని 5 మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని CM చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. దొనకొండ, కురిచేడు మండలాలను మార్కాపురంలో, రైల్వే కోడూరును తిరుపతిలో, పొదిలిని ప్రకాశంలో, రాజంపేటను కడపలో, రాయచోటి(అన్నమయ్య)ని మదనపల్లెలో విలీనం చేయాలన్న అంశంపైనా చర్చ జరిగింది. అటు ఆదోనిని రెండు మండలాలుగా విభజించాలని అభిప్రాయపడ్డారు.


