News April 11, 2024
జగన్ డబ్బు పిచ్చికి పేదలు బలి: కూటమి నేతలు

AP: మద్యంపై సీఎం జగన్ రూ.లక్ష కోట్లు సంపాదించారని కూటమి నేతలు ఆరోపించారు. మద్యాన్ని పూర్తిగా నిషేధిస్తానని చెప్పిన జగన్.. దానినే ప్రధాన ఆదాయ వనరుగా మార్చుకున్నారని టీడీపీ నేత బోండా ఉమా మండిపడ్డారు. జగన్ డబ్బు పిచ్చికి పేదలు బలైపోయారని ఘాటుగా విమర్శించారు. మద్య నియంత్రణను తమ కూటమి సాధ్యం చేస్తుందని బీజేపీ నేత లంకా దినకర్, జనసేన నేత గాదె వెంకటేశ్వరరావు చెప్పారు.
Similar News
News November 25, 2025
సూర్యాపేట: సర్పంచ్ ఎన్నికలు.. మన గ్రామానికి ఎప్పుడంటే..

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూరు మండలాల్లో, రెండో విడత మోతె, చివ్వెంల, పెన్ పహాడ్. చిలుకూరు, కోదాడ, మునగాల, అనంతగిరి, నడిగూడెం మండలాల్లో జరగనున్నాయి. HNR నియోజకవర్గంలోని గ్రామాలకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.
News November 25, 2025
వాంకిడి: కాబోయే భర్త సూసైడ్.. తట్టుకోలేక ఉరేసుకుంది

వాంకిడి(M) బంబారాకి చెందిన నీలం శ్రీలత (31) ఇంట్లో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ మహేందర్ కథనం మేరకు.. శ్రీలతకు జైపూర్(M) కిష్టాపూర్కి చెందిన రంజిత్తో పెళ్లి కుదిరింది. రంజిత్ విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. కాబోయే భర్త మరణాన్ని జీర్ణించుకోలేక శ్రీలత జీవితంపై విరక్తి చెంది సోమవారం రాత్రి ఇంట్లో ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈ మేరకు కేసు నమోదైంది.
News November 25, 2025
సూర్యాపేట: సర్పంచ్ ఎన్నికలు.. మన గ్రామానికి ఎప్పుడంటే..

సూర్యాపేట జిల్లాలో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలు తుంగతుర్తి, నాగారం, నూతనకల్, తిరుమలగిరి, జాజిరెడ్డిగూడెం, మద్దిరాల, సూర్యాపేట, ఆత్మకూరు మండలాల్లో, రెండో విడత మోతె, చివ్వెంల, పెన్ పహాడ్. చిలుకూరు, కోదాడ, మునగాల, అనంతగిరి, నడిగూడెం మండలాల్లో జరగనున్నాయి. HNR నియోజకవర్గంలోని గ్రామాలకు మూడో విడతలో ఎన్నికలు జరుగుతాయని అధికారులు ప్రకటించారు.


