News April 5, 2024

ప్రముఖ తెలుగు యాంకర్ మృతి

image

ప్రముఖ తెలుగు న్యూస్ యాంకర్ శాంతి స్వరూప్ కన్నుమూశారు. గుండెపోటుతో చికిత్స పొందుతూ HYD యశోద ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. DDలో వార్తలు చదివిన తొలి తెలుగు యాంకర్. ఇప్పటి న్యూస్ రీడర్లు ఎందరికో గురువు. 1978లో న్యూస్ చదవడానికి JOBలో చేరిన ఆయనకు వార్తలు చదివేందుకు 1983 వరకు వేచి చూడాల్సి వచ్చింది. ప్రాంప్టర్ లేని సమయంలో తప్పులు లేకుండా జాగ్రత్తగా ఆయన వార్తలు చదివేవారు. 2011లో పదవీ విరమణ చేశారు.

Similar News

News December 2, 2025

3,058 పోస్టులు.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

రైల్వేలో 3,058 NTPC (UG) పోస్టులకు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. వీటిలో కమర్షియల్ కమ్ టికెట్ క్లర్క్, Jr క్లర్క్ కమ్ టైపిస్ట్, ట్రైన్స్ క్లర్క్ తదితర పోస్టులు ఉన్నాయి. ఇంటర్ ఉత్తీర్ణులైన, 18- 30 ఏళ్ల మధ్య గలవారు అప్లై చేసుకోవచ్చు. రిజర్వేషన్ గలవారికి ఏజ్‌లో సడలింపు ఉంది. CBT, స్కిల్, మెడికల్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు. *మరిన్ని ఉద్యోగ నోటిఫికేషన్ల కోసం <<-se_10012>>జాబ్స్ <<>>కేటగిరీకి వెళ్లండి.

News December 2, 2025

NSICలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

image

నేషనల్ స్మాల్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్(NSIC)లో 5 పోస్టులకు అప్లై చేయడానికి రేపే ఆఖరు తేదీ. బీఈ/బీటెక్, CA/CMA ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గల అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఎలక్ట్రికల్ ఇంజినీర్, సివిల్ ఇంజినీర్, MSME రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులు ఉన్నాయి. షార్ట్ లిస్టింగ్, ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. జీతం నెలకు రూ.50వేలు చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.nsic.co.in

News December 2, 2025

గొర్రెలకు సంపూర్ణాహారం అందకపోతే జరిగేది ఇదే

image

గొర్రెలకు సరైన పోషకాహారం అందకుంటే పెరుగుదల లోపించి త్వరగా బరువు పెరగవు. వ్యాధి నిరోధక శక్తి తగ్గి సులభంగా వ్యాధుల బారిన పడతాయి. అంతర, బాహ్య పరాన్న జీవుల కారణంగా గొర్రెలకు వ్యాధుల ముప్పు పెరుగుతుంది. గొర్రెల ఉన్ని రాలిపోతుంది. పునరుత్పత్తి సామర్థ్యం తగ్గిపోతుంది. గర్భస్రావాలు, పిల్లలు తక్కువ బరువుతో, బలహీనంగా జన్మించడం, సకాలంలో ఎదకు రాకపోవడం, ఈతల మధ్య వ్యవధి పెరగడం వంటి సమస్యలు ఉత్పన్నమవుతాయి.