News March 8, 2025
OTTల రూపంలో అశ్లీలత ఇళ్లలోకి వచ్చేసింది: MLC కవిత

TG: OTTల రూపంలో అశ్లీలత ఇళ్లలోకి వచ్చేసిందని MLC కవిత అన్నారు. TVలు, OTT సిరీస్లలో మహిళల్ని తక్కువ చేసి చూపిస్తున్నారని, అవి చూసి మగ పిల్లల్లో మహిళలపై చులకన భావం ఏర్పడుతోందని తెలిపారు. దీనిపై మహిళలు ఎందుకు ప్రశ్నించడం లేదని అన్నారు. మహిళలపై అఘాయిత్యాలకు OTT, సోషల్ మీడియా కంటెంట్ కూడా కారణమని పేర్కొన్నారు. సీరియళ్లలోనూ అత్తాకోడళ్ల గొడవలు చూపించి నెగటివిటీని పెంచుతున్నారని విమర్శించారు.
Similar News
News March 11, 2026
గ్యాస్ కొరత.. కాంగ్రెస్ Vs బీజేపీ

గ్యాస్ కొరతపై కాంగ్రెస్, BJP మధ్య ట్వీట్ల వార్ సాగుతోంది. ATMల ముందు(నోట్ల రద్దు), ఆక్సిజన్(కరోనా) కోసం, ఇప్పుడు గ్యాస్ కోసం జనం క్యూలో ఉన్నారని ఫొటోను INC షేర్ చేసింది. దీంతో ప్రపంచ సంక్షోభాన్ని మోదీకి ముడిపెట్టినా కాంగ్రెస్కు ఎవరూ ఓటేయరని BJP సపోర్టర్లు కౌంటరిస్తున్నారు. మోదీ అభివృద్ధిని ప్రస్తావిస్తున్నారు. 8PM తర్వాత పెట్రోల్ పంపులు మూసేయాలని కాంగ్రెస్ గతంలో చెప్పిందని గుర్తుచేస్తున్నారు.
News March 11, 2026
అయోధ్యను తాకిన వంట గ్యాస్ కొరత

దేశంలో నెలకొన్న వంట గ్యాస్ కొరత అయోధ్యనూ తాకింది. రామమందిరం సమీపాన ఉండే అమావా ఆలయంలోని ప్రముఖ నిత్యాన్నదాన ప్రాంగణం రామ్ రసోయ్లో తాత్కాలికంగా అన్నదానం నిలిపివేశారు. అయోధ్యకు వచ్చే యాత్రికుల్లో వేలాది మందికి ఈ రామ్ రసోయ్ ప్రసాదాన్ని అందిస్తుంది. కాగా LPGకి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను చేసుకుంటున్నట్లు నిర్వాహకులు తెలిపారు. మరోవైపు తిరుమలకు గ్యాస్ సరఫరా ఆపొద్దని <<19316913>>TTD<<>> ఇప్పటికే IOCLను కోరింది.
News March 11, 2026
బ్రెస్ట్ క్యాన్సర్ను ఎలా గుర్తించాలంటే?

బ్రెస్ట్ క్యాన్సర్ను గుర్తించడానికి మామోగ్రామ్ పరీక్ష చేయించుకోవాలని నిపుణులు సూచిస్తారు. అయితే భారతీయ మహిళల్లో రొమ్ములు చాలా దట్టంగా ఉండటం వల్ల.. ఈ పరీక్ష సమయంలో క్యాన్సర్ ప్రారంభ లక్షణాలు మిస్ అవుతాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి అల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయించుకోవడం ఉత్తమమని చెబుతున్నారు పరిశోధకులు. అలాగే మహిళలు కూడా తమ రొమ్ములను ఎప్పటికప్పుడు స్వీయ పరీక్ష చేసుకోవాలని సూచిస్తున్నారు.


