News March 18, 2024

పోరుమామిళ్ల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక పోరుమామిళ్ల మండలం బాలరెడ్డిపల్లికు చెందిన బాలకృష్ణ(35) అనే రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బాలకృష్ణ నాలుగు ఎకరాలు మొక్కజొన్న పంట సాగు చేశారు. ఆశించిన మేర దిగుబడి రాకపోగా, తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రైతు భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

Similar News

News September 3, 2025

AUTO MATE యాప్‌ను రూపొందించిన ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు

image

విద్యార్థులు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరిస్తూ ప్రయాణ సులభతరం, భద్రత, తదితర అంశాలపై ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు AUTO MATE యాప్‌ను రూపొందించారు. E- CELL ఆధ్వర్యంలో R21 బ్యాచ్ విద్యార్థులు (శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్) యాప్ రూపకల్పన చేశారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా యాప్ పరీక్షించి అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని వారిని అభినందించారు.

News September 3, 2025

AUTO MATE యాప్‌ను రూపొందించిన ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు

image

విద్యార్థులు ఎదుర్కొనే ఆటో సమస్యలను పరిష్కరిస్తూ ప్రయాణ సులభతరం, భద్రత, తదితర అంశాలపై ఆర్కేవ్యాలీ IIIT విద్యార్థులు AUTO MATE యాప్‌ను రూపొందించారు. E- CELL ఆధ్వర్యంలో R21 బ్యాచ్ విద్యార్థులు (శివశంకర్, సాయినాథ్, రవితేజ, అంకిత్ కుమార్, సాయికుమార్, మణికుమార్) యాప్ రూపకల్పన చేశారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా యాప్ పరీక్షించి అధికారికంగా ఆవిష్కరించారు. యాప్ చాలా ఉపయోగకరంగా ఉందని వారిని అభినందించారు.

News September 3, 2025

బెంగుళూరుకు పయనమైన వైఎస్ జగన్

image

మాజీ సీఎం, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన ముగించుకుని బెంగళూరుకు పయనమయ్యారు. బుధవారం పులివెందుల పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలిప్యాడ్ వద్దకు ఆయన చేరుకుని ప్రత్యేక హెలికాప్టర్‌లో బెంగళూరుకు బయలుదేరి వెళ్లారు. ఈ సందర్భంగా ఆయనకు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, వైసీపీ జిల్లా నాయకులు వీడ్కోలు పలికారు.