News March 18, 2024
పోరుమామిళ్ల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_32024/1710694902762-normal-WIFI.webp)
అప్పుల బాధ తాళలేక పోరుమామిళ్ల మండలం బాలరెడ్డిపల్లికు చెందిన బాలకృష్ణ(35) అనే రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బాలకృష్ణ నాలుగు ఎకరాలు మొక్కజొన్న పంట సాగు చేశారు. ఆశించిన మేర దిగుబడి రాకపోగా, తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రైతు భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.
Similar News
News July 3, 2024
కడప: 5 నుంచి తిరుమల ఎక్స్ప్రెస్ రద్దు
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719960023151-normal-WIFI.webp)
కడప-విశాఖపట్నం-కడప మధ్య నడుస్తున్న తిరుమల ఎక్స్ప్రెస్ రైలును ఈనెల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు రద్దు చేసినట్లు కడప రైల్వే సీనియర్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. విజయవాడ రైల్వే స్టేషన్ సమీపంలోని మూడో ప్లాట్ఫారం నాన్ ఇంటర్ లాకింగ్ పనులు జరుగుతున్న కారణంగా రైల్వే శాఖ ఈ నిర్ణయం తీసుకుందన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గమనించాలని సూచించారు.
News July 3, 2024
ఖాజీపేట హైస్కూల్ ఇన్ఛార్జ్ హెచ్ఎం సస్పెండ్
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719960808774-normal-WIFI.webp)
ఖాజీపేటలోని బాలికల ఉన్నత పాఠశాలలో కలుషిత నీరు తాగి 30 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఈ విషయానికి సంబంధించి పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయురాలు ఉమాదేవిని సస్పెండ్ చేసినట్లు డీఈవో అనురాధ తెలిపారు. దీంతోపాటు ఖాజీపేట ఎంఈఓ-1 నాగ స్వర్ణలత, ఎంఈఓ-2 నాగరాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశామన్నారు. నీటి ట్యాంకుల శుభ్రతలో ఇన్ఛార్జ్ హెచ్ఎం నిర్లక్ష్యం వల్లే నీరు కలుషితమైందన్నారు.
News July 3, 2024
కడప: ఎమ్మెస్సీకి దరఖాస్తుల స్వీకరణ
![image](https://d1uy1wopdv0whp.cloudfront.net/newsimages/news_72024/1719922556346-normal-WIFI.webp)
కడప: వైవీయూ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు శాఖాధిపతి ఆచార్య తుమ్మలకుంట శివప్రతాప్ తెలిపారు. ఈ కోర్సుతో మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయన్నారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. సందేహాలకు ఎం.శశికుమార్
(898559792)ను సంప్రదించాలన్నారు.