News March 18, 2024

పోరుమామిళ్ల: అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

image

అప్పుల బాధ తాళలేక పోరుమామిళ్ల మండలం బాలరెడ్డిపల్లికు చెందిన బాలకృష్ణ(35) అనే రైతు ఆదివారం ఆత్మహత్య చేసుకున్నాడని ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బాలకృష్ణ నాలుగు ఎకరాలు మొక్కజొన్న పంట సాగు చేశారు. ఆశించిన మేర దిగుబడి రాకపోగా, తెచ్చిన అప్పులు తీర్చలేక మనోవేదనతో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. రైతు భార్య రాజేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని చెప్పారు.

Similar News

News December 4, 2025

ముద్దనూరు: వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్

image

వైసీపీ ఎన్నారై విభాగం ప్రధాన కార్యదర్శిగా డాక్టర్ చింత ప్రదీప్ ఎంపికయ్యారు. ఈయన ముద్దనూరు మండల పరిధిలోని రాజు గురువాయిపల్లికి చెందిన వ్యక్తి. బుధవారం సాయంత్రం పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ ఆదేశాల మేరకు ప్రదీప్‌ను నియమించినట్లు తెలిపారు. పార్టీ కోసం నిరంతరం కృషి చేస్తానని ప్రదీప్ పేర్కొన్నారు.

News December 3, 2025

కడప: రైలులో లైంగిక దాడి.. నిందితుడికి జీవిత ఖైదు

image

రైలులో చిన్నారిపై లైంగిక దాడి కేసులో బుధవారం కడప పోక్సో కోర్టు చారిత్రక తీర్పునిచ్చింది. నిందితుడు రామ్ ప్రసాద్ రెడ్డికి జీవిత ఖైదు, రూ.10 వేల జరిమానా విధిస్తూ జడ్జి ప్రవీణ్ కుమార్ ఆదేశించారు. బాధితురాలికి రూ.10.50 లక్షల పరిహారం చెల్లించాలని గుంతకల్ డీఆర్ఎంను ఆదేశించారు. విధుల్లో ఉన్న టీటీఐలపై చర్యలకు సిఫార్సు చేశారు. శిక్ష పడేలా కృషి చేసిన రైల్వే హెడ్ కానిస్టేబుల్ నాగరాజును, పీపీలను ప్రశంసించారు.

News December 3, 2025

శనగ పంటలో పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలి: JDA

image

శనగ పంటలో పచ్చ పురుగు నివారణకు పక్షి స్థావరాలు ఏర్పాటు చేసుకోవాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారి(JDA) చంద్ర నాయక్ రైతులకు సూచించారు. ప్రొద్దుటూరు మండలంలో సాగుచేసిన పప్పు శనగ పంటను బుధవారం ఆయన పరిశీలించారు. పచ్చ పురుగులను పక్షులు ఏరుకొని తింటాయన్నారు. ఖర్చు తగ్గుతుందన్నారు. వేప నూనె, ట్రైకోడెర్మా విరిడి పిచికారీ చేయాలన్నారు. ఆయన వెంట ADA అనిత, MAO వరహరికుమార్, టెక్నికల్ AO సుస్మిత పాల్గొన్నారు.