News February 28, 2025
పోసాని బెయిల్ పిటిషన్.. సోమవారం విచారణ

APFDC మాజీ ఛైర్మన్ పోసాని కృష్ణమురళికి మరో షాక్ తగిలింది. ఆయన తరఫు న్యాయవాది రైల్వేకోడూరు కోర్టులో బెయిల్ పిటిషన్ దాఖలు చేయగా జడ్జి విచారణకు స్వీకరించలేదు. రేపటి నుంచి ట్రైనింగ్కు వెళ్తున్నందున ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారు. శని, ఆదివారం సెలవు కావడంతో సోమవారమే విచారణ జరిగే అవకాశం ఉంది. కోర్టు పోసానికి 14 రోజుల రిమాండ్ విధించిన విషయం తెలిసిందే. దీంతో పోలీసులు ఆయనను రాజంపేట సబ్జైలుకు తరలించారు.
Similar News
News February 28, 2025
స్కూళ్లకు శుభవార్త: మంత్రి లోకేశ్

APలోని అన్ని ప్రభుత్వ స్కూళ్లకు ఉచిత విద్యుత్ అందిస్తామని మంత్రి లోకేశ్ ప్రకటించారు. ఇది చాలా విప్లవాత్మకమైన నిర్ణయమని చెప్పారు. దీని ద్వారా స్థానిక సంస్థలపై ఆర్థిక భారం తగ్గుతుందన్నారు. టీచర్లు, విద్యార్థులపై ఒత్తిడిని తగ్గిస్తుందని అంచనా వేశారు. బడ్జెట్లో పాఠశాల విద్యకు ₹31,805 కోట్లు, ఉన్నత విద్యకు ₹3506 కోట్లు కేటాయించామని, దీని ద్వారా విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని లోకేశ్ వెల్లడించారు.
News February 28, 2025
టన్నెల్ ఘటన.. BIG UPDATE

TG: SLBC టన్నెల్ ప్రమాద ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. రెస్క్యూ సిబ్బంది గ్రౌండ్ పెనిట్రేటింగ్ రాడార్ టెక్నాలజీ ద్వారా సొరంగం మొత్తం స్కానింగ్ చేశారు. ఐదు చోట్ల మెత్తని భాగాలు ఉన్నట్లు స్కానింగ్లో గుర్తించారు. చిక్కుకుపోయిన ఎనిమిది మంది కార్మికులు అక్కడే ఉన్నట్లు అనుమానిస్తున్నారు. ఆయా ప్రాంతాల్లో డ్రిల్లింగ్ చేపట్టారు. కాగా ఆ ఎనిమిది మంది చనిపోయి ఉండొచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.
News February 28, 2025
సెల్ఫోన్ల రికవరీలో అనంతపురం టాప్

AP: సెల్ఫోన్ల రికవరీలో అనంతపురం జిల్లా దేశంలోనే అగ్రస్థానంలో నిలిచినట్లు ఎస్పీ జగదీశ్ తెలిపారు. జిల్లా పోలీసు పరేడ్ మైదానంలో రికవరీ చేసిన 1183 ఫోన్లను బాధితులకు అప్పగించారు. 2022 నుంచి మొత్తం 11,378 మొబైల్స్ రికవరీ చేసినట్లు పేర్కొన్నారు. వీటి విలువ రూ.21.08 కోట్లు ఉంటుందని వెల్లడించారు. మొబైల్ చోరీకి గురైనా/పోయినా <<10494424>>CEIR పోర్టల్లో<<>> రిజిస్టర్ చేసుకోవాలని పోలీసులు సూచిస్తున్నారు.