News February 19, 2025

అలాంటి వారికే పదవులు: మంత్రి లోకేశ్

image

AP: మంచి చేస్తున్న ప్రభుత్వంపై YCP దుష్ప్రచారాన్ని తిప్పి కొట్టాలని TDP శ్రేణులకు మంత్రి లోకేశ్ సూచించారు. తిరుపతి నియోజకవర్గ నేతలు, కార్యకర్తలతో సమావేశమైన ఆయన, పార్టీని బలోపేతం చేసేందుకు ఐకమత్యంగా కృషి చేయాలని కోరారు. సాంకేతిక పరిజ్ఞానం సాయంతో ఎవరు అంకితభావంతో పనిచేశారో తెలుసుకుని వారికే పదవులు ఇస్తామన్నారు. ‘ఎన్నికల్లో గెలిచాం.. తిరుగులేదనే ధోరణి సరికాదు. నిత్యం ప్రజల్లో ఉండాలి’ అని సూచించారు.

Similar News

News January 18, 2026

నితీశ్ కుమార్ రెడ్డికి మంచి ఛాన్స్..

image

వరుస ఫెయిల్యూర్స్‌తో విమర్శలు ఎదుర్కొంటున్న నితీశ్ రెడ్డికి మంచి ఛాన్స్ దొరికింది. న్యూజిలాండ్‌తో జరుగుతున్న మూడో వన్డేలో భారత్ కీలక వికెట్లు కోల్పోగా.. విరాట్, నితీశ్ క్రీజులో ఉన్నారు. భారత్ మ్యాచ్ గెలవాలంటే వీరిద్దరి మధ్య కీలక భాగస్వామ్యం తప్పనిసరి. మరి నితీశ్ అనుభవజ్ఞుడైన కోహ్లీతో కలిసి రాణిస్తారా? కామెంట్ చేయండి.

News January 18, 2026

చేతబడి వల్లే నా భార్య మృతి: నటి భర్త

image

నటి, మోడల్ షెఫాలీ జరీవాలా మృతిపై ఆమె భర్త పరాగ్ త్యాగి సంచలన వ్యాఖ్యలు చేశారు. ‘షెఫాలీపై ఎవరో రెండుసార్లు చేతబడి చేశారు. తొలిసారి తప్పించుకున్నాం. కానీ రెండోసారి మరింత ఎక్కువగా చేశారు. ఎవరు, ఎందుకు, ఎలా చేశారనేది నాకు తెలియదు. కానీ ఏదో తప్పుగా జరిగిందని మాత్రం చెప్పగలను’ అని అన్నారు. గతేడాది జూన్ 27న షెఫాలీ చనిపోయారు. అజ్ఞాతవాసి, సర్కారు వారి పాట, వెంకీ మామ చిత్రాల్లో పరాగ్ త్యాగి నటించారు.

News January 18, 2026

టాపార్డర్ ఫెయిల్.. భారత్ గెలుస్తుందా?

image

న్యూజిలాండ్‌తో 338 పరుగుల భారీ లక్ష్యఛేదనలో భారత్ తడబడుతోంది. 71 రన్స్‌కే 4 వికెట్లు కోల్పోయింది. రోహిత్ (11), గిల్ (23), శ్రేయస్ అయ్యర్ (3), కేఎల్ రాహుల్ (1) నిరాశపరిచారు. ప్రస్తుతం విరాట్ (31*), నితీశ్ కుమార్ రెడ్డి (0*) క్రీజులో ఉన్నారు. భారత్ స్కోర్ 13 ఓవర్లలో 71/4గా ఉంది. టీమ్ ఇండియా విజయానికి 222 బంతుల్లో 267 రన్స్ అవసరం. మరి ఈ మ్యాచులో ఏ టీమ్ గెలుస్తుందో కామెంట్ చేయండి.