News March 29, 2025
LRS రాయితీ గడువు పెంచే అవకాశం?

TG: లే అవుట్ క్రమబద్ధీకరణ పథకం (LRS) రుసుములో ప్రభుత్వం ఇచ్చిన 25% రాయితీ గడువు ఈనెల 31తో ముగియనుంది. అయితే ఈ గడువును పొడిగించాలని దరఖాస్తుదారులు కోరుతున్నారు. ఇటీవల అసెంబ్లీ సమావేశాల్లోనూ పలువురు ఎమ్మెల్యేలు రాయితీ గడువును పొడిగించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ నెలాఖరు వరకు గడువును పొడిగించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. దీనిపై సర్కార్ నుంచి స్పష్టత రావాల్సి ఉంది.
Similar News
News November 18, 2025
ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.
News November 18, 2025
ENCOUNTER: హిడ్మా సతీమణి రాజే సైతం మృతి

AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా, అతని భార్య రాజే అలియాస్ రాజక్క సహా ఆరుగురు మావోలు హతమయ్యారు. మృతి చెందిన వారిలో స్టేట్ జోనల్ కమిటీ మెంబర్ చెల్లూరి నారాయణ అలియాస్ సురేశ్, టెక్ శంకర్, మల్లా, దేవే ఉన్నారు. కూంబింగ్ ఆపరేషన్ జరుగుతోందని AP DGP హరీశ్ కుమార్ గుప్తా వెల్లడించారు. డివిజన్ కమిటీ మెంబర్గా ఉన్న రాజేపై రూ.50 లక్షల రివార్డు ఉంది.
News November 18, 2025
భారత్కు ప్రతి టెస్టు కీలకమే

WTC 2025-27 సీజన్లో భారత్ 8 మ్యాచులు ఆడి నాలుగింట్లో మాత్రమే గెలిచింది. విజయాల శాతం 54.17గా ఉంది. WTC ఫైనల్కు అర్హత సాధించాలంటే 64-68% ఉండాలి. IND మరో 10 మ్యాచ్లు(SAతో 1, SLతో 2, NZతో 2, AUSతో 5) ఆడాల్సి ఉండగా ప్రతి టెస్టూ కీలకమే. అన్నిట్లో గెలిస్తే 79.63%, 9 గెలిస్తే 74.07, 8 గెలిస్తే 68.52, 7 గెలిస్తే 62.96% సొంతం చేసుకుంటుంది. దీన్నిబట్టి కనీసం 8 గెలిస్తేనే WTC ఫైనల్ ఆశలు సజీవంగా ఉంటాయి.


