News September 18, 2024
వరద బాధితుల రుణాల రీషెడ్యూలింగ్కు అవకాశం

AP: విజయవాడ వరద ప్రభావిత ప్రాంతాల్లోని ప్రజల రుణాలకు సంబంధించి బ్యాంకులు ఏడాది పాటు మారిటోరియం కల్పించాయని అడిషనల్ ఫైనాన్స్ సెక్రటరీ జే.నివాస్ తెలిపారు. అలాగే గ్రౌండ్ ఫ్లోర్ కుటుంబాలు రూ.50 వేలు, మొదటి, ఆపై అంతస్తుల్లో ఉండేవారు రూ.25వేలు వినియోగ రుణాలు పొందొచ్చన్నారు. పంట రుణాలు, ఆటో, బైక్స్, కిరాణా షాపులు, హోటళ్లు, చిన్న పరిశ్రమలకూ రుణాల మారిటోరియంతో పాటు అవసరం మేరకు కొత్త రుణాలు పొందొచ్చన్నారు.
Similar News
News December 5, 2025
స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు చర్యలెక్కడ?: ఎంపీ

స్వదేశీ రక్షణ పరికరాల ఉత్పత్తిని పెంచేందుకు ఎలాంటి కార్యాచరణను ఆచరిస్తోందని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాం రెడ్డి లోక్ సభలో కేంద్రాన్ని ప్రశ్నించారు. దేశీయ తయారీదారులకు సబ్సిడీ, ప్రోత్సాహకాల గురించి, రక్షణ సముపార్జన ప్రక్రియకు కేంద్రం ఏమైనా సవరణలు చేసిందా? అడిగారు. దీనిపై కేంద్ర మంత్రి సంజయ్ సేథ్ స్పందిస్తూ.. స్వదేశీ ఉత్పత్తిని పెంచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు సమాధానం ఇచ్చారు.
News December 5, 2025
TG టెట్ పరీక్షలు వాయిదా పడతాయా?

TG: ఇన్సర్వీస్ టీచర్లూ టెట్ పాస్ కావాల్సిందేనన్న సుప్రీంకోర్టు తీర్పు ఉపాధ్యాయుల్లో గుబులు పుట్టిస్తోంది. జనవరి 3 నుంచి 31 వరకు <<18427476>>టెట్<<>> జరగనుండగా ప్రిపరేషన్కు సమయంలేక ఇబ్బందులు పడుతున్నారు. పంచాయతీ ఎన్నికల విధులు, సిలబస్ను పూర్తి చేయడం, వీక్లీ టెస్టుల నిర్వహణలో వారు బిజీగా ఉన్నారు. ఎన్నికలు ముగిశాక పరీక్షలకు 15 రోజులే గడువు ఉంటుంది. దీంతో టెట్ను వాయిదా వేయాలని ఆయా సంఘాలు కోరుతున్నాయి.
News December 5, 2025
ESIC ఫరీదాబాద్లో ఉద్యోగాలు

ఫరీదాబాద్లోని <


