News April 6, 2024

సాధ్యం కానీ హామీలిచ్చి ప్రజల్ని మోసం చేశారు: డీకే అరుణ

image

AP: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి వంద రోజులు అయినప్పటికీ ఆరు గ్యారంటీలను అమలు చేయలేదని బీజేపీ నేత డీకే అరుణ మండిపడ్డారు. రైతులకు ఇచ్చిన హామీలను సీఎం రేవంత్ ఎప్పుడు నెరవేరుస్తారని ప్రశ్నించారు. ‘రూ.2లక్షల రుణమాఫీ, రైతు భరోసా కింద రూ.15వేలు, అన్ని పంటలకు రూ.500 బోనస్ హామీలు ఏమయ్యాయి. సాధ్యం కాని హామీలిచ్చి ప్రజల్ని కాంగ్రెస్ మోసం చేసింది’ అని దుయ్యబట్టారు.

Similar News

News October 8, 2024

విశాఖ స్టీల్ ప్లాంట్‌కు శాశ్వత పరిష్కారం చూపాలని కోరా: CM

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ఉన్న మార్గాలన్నీ ఆలోచిస్తున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. స్టీల్ ప్లాంట్ సమస్యను శాశ్వతంగా పరిష్కరించాలని కేంద్రాన్ని కోరానని చెప్పారు. అమరావతికి వరల్డ్ బ్యాంకు నిధులు వచ్చేలా చూడాలని విజ్ఞప్తి చేశానన్నారు. విశాఖ రైల్వే జోన్ పనులకు త్వరలోనే శంకుస్థాపన చేస్తామని పేర్కొన్నారు. గిరిజన వర్సిటీ సాలూరులోనే ఉంటుందని, మార్చే ఉద్దేశం లేదని స్పష్టం చేశారు.

News October 8, 2024

హరియాణా విజయం ప్రజాస్వామ్య విజయం: మోదీ

image

నవరాత్రి సమయంలో హరియాణాలో గెలవడం శుభసూచకమని PM నరేంద్ర మోదీ అన్నారు. బీజేపీ కేంద్ర కార్యాలయంలో జరిగిన విజయోత్సవ సభలో PM మాట్లాడారు. ‘హరియాణా విజయం ప్రజాస్వామ్య విజయం. కార్యకర్తల కృషితోనే ఇది సాధ్యమైంది. కాంగ్రెస్ తప్పుడు ప్రచారాన్ని ప్రజలు తిరస్కరించారు. జమ్మూ కశ్మీర్‌లో గెలిచిన కాంగ్రెస్-ఎన్సీ కూటమికి నా అభినందనలు. JKలో మా ఓటింగ్ శాతం పెరగడంతో గర్వంగా ఉంది’ అని ఆయన పేర్కొన్నారు.

News October 8, 2024

ఫ్రీగా గ్యాస్ సిలిండర్ కావాలంటే..

image

ప్రధానమంత్రి ఉజ్వల యోజన స్కీం ద్వారా కేంద్రం మహిళలకు ఉచితంగా గ్యాస్ కనెక్షన్, ఒక సిలిండర్ అందిస్తోంది. ఇందుకోసం గ్యాస్ డిస్ట్రిబ్యూటర్ దగ్గరకు వెళ్లి ఫామ్ నింపి, రేషన్, ఆధార్, అడ్రస్, ఫొటోలు సమర్పించాలి. లేదంటే https://pmuy.gov.in/లోకి వెళ్లి Apply for New Ujjwala 2.0 Connectionపై క్లిక్ చేసి అప్లై చేసుకోవచ్చు. సదరు మహిళ బీపీఎల్ కుటుంబానికి చెందినవారై ఉండాలి. ఇప్పటికే ఎల్పీజీ కనెక్షన్ ఉండొద్దు.