News May 11, 2024
Postal Ballot: 2019తో పోలిస్తే డబుల్

AP: 2019 ఎన్నికలతో పోలిస్తే ఈసారి రాష్ట్రంలో రెట్టింపు సంఖ్యలో పోస్టల్ బ్యాలెట్ ఓట్లు పోలయ్యాయి. గురువారం వరకు దాదాపు 5 లక్షల ఓట్లు పోల్ కాగా, 2019 సార్వత్రిక ఎన్నికల్లో 2.38 లక్షల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు నమోదయ్యాయి. 6 రోజుల పాటు అన్ని జిల్లాల్లో ఉద్యోగులు, టీచర్లు ఎండలను సైతం లెక్క చేయకుండా ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ పెరిగిన ఓటింగ్ దేనికి సంకేతమనే చర్చ నడుస్తోంది.
Similar News
News February 10, 2026
US ప్రతినిధుల సభలో H-1B వీసాల రద్దు బిల్లు

H-1B వీసా ప్రోగ్రామ్ రద్దు చేసే బిల్లును రిపబ్లికన్ ఎంపీ గ్రెగ్ స్టూబ్ ప్రతినిధుల సభలో ప్రవేశపెట్టారు. విదేశీయులకు ప్రాధాన్యం ఇవ్వడంతో అమెరికాలో యువతకు ఉద్యోగాలు రావడం లేదన్నారు. అమెరికన్ల కంటే విదేశీ కార్మికులకు కార్పొరేట్లు ప్రాధాన్యం ఇస్తుండటం జాతీయ ప్రయోజనాలను దెబ్బతీస్తోందని వాపోయారు. కాగా H1B వీసా పొందుతున్నవారిలో 80 శాతం మంది భారత్, చైనాకు చెందిన వారే ఉండటం గమనార్హం.
News February 10, 2026
దీనస్థితిలో ఉన్నానంటూ సీనియర్ నటుడి ఆవేదన

తాను దీనస్థితిలో ఉన్నానని బాలీవుడ్ సీనియర్ నటుడు రాజ్పాల్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. చెక్ బౌన్స్ కేసులో ఢిల్లీ HC గతవారం తీహార్ జైలు అధికారి ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. దీంతో జైలుకెళ్లే ముందు ఓ ఇంటర్వ్యూలో ‘కష్టాల్లో ఆదుకునేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ఇండస్ట్రీలో ఎవరి లైఫ్ వారిదే’ అని వాపోయారు. ‘అతా పతా లాపతా’ మూవీతో డైరెక్టర్గా మారేందుకు ఆయన ఓ వ్యాపారి వద్ద ₹5Cr అప్పుచేసి తిరిగివ్వలేదు.
News February 10, 2026
బంగ్లాదేశ్లో హిందూ వ్యాపారి హత్య

బంగ్లాదేశ్లో మైనార్టీల హత్యలు కొనసాగుతున్నాయి. మిమెన్సింగ్ జిల్లాలో హిందూ వ్యాపారి సుసేన్ చంద్ర సర్కార్ను దుండగులు కత్తితో పొడిచి హత్య చేశారు. దక్షిణకందా గ్రామానికి చెందిన సర్కార్ దగ్గరలోని బోగర్ బజార్లో బియ్యం వ్యాపారం చేస్తున్నారు. హత్య తర్వాత షాపులో నుంచి లక్షల రూపాయలను దొంగిలించినట్టు పోలీసులు తెలిపారు. రెండు రోజుల్లో జాతీయ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో తాజా హత్య కలకలం రేపుతోంది.


