News March 30, 2024

డీఎస్సీ వాయిదా.. నిరుద్యోగుల ఆవేదన

image

AP: డీఎస్సీ వాయిదా పడటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 23వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మెగా డీఎస్సీ వేస్తామని ఐదేళ్ల క్రితం సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ వేయలేదని ఫైరవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ఫిబ్రవరిలో 6,100 పోస్టులకే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని, ఆ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ఆగిపోయిందంటున్నారు.

Similar News

News April 3, 2026

మెగా మేనల్లుడి కొత్త సినిమా.. పోస్టర్ అదుర్స్

image

సుప్రీమ్ హీరో సాయి దుర్గతేజ్ తన కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించారు. ‘సీక్రెట్స్ ఆఫ్ ది ఏజెస్.. పవర్ బియాండ్ ఇమాజినేషన్’ అంటూ తన 19వ సినిమా పోస్టర్‌ను విడుదల చేయగా ఆకట్టుకుంటోంది. కిరణ్ అబ్బవరం ‘క’ మూవీ డైరెక్టర్లు సుజిత్, సందీప్ సంయుక్తంగా తెరకెక్కించనున్న ఈ చిత్రాన్ని సాహు గారపాటి నిర్మించనున్నట్లు తెలిపారు. ప్రస్తుతం సాయి తేజ్ ‘సంబరాల ఏటిగట్టు’ సినిమా చిత్రీకరణలో బిజీగా ఉన్నారు.

News April 3, 2026

నిహారిక ‘రాకాస’ రివ్యూ&రేటింగ్

image

కోటలోని బ్రహ్మరాక్షసుడి బలికి చిక్కిన హీరో బయటపడటానికి ఏం చేశాడనేదే ‘రాకాస’ స్టోరీ. ఎప్పటిలాగే సంగీత్ కామెడీ టైమింగ్‌తో అదరగొట్టారు. ఫస్టాఫ్‌ స్లోగా సాగుతుంది. సెకండాఫ్‌లో కొన్ని ట్విస్టులు ఆకట్టుకుంటాయి. నిహారిక ప్రొడక్షన్ వ్యాల్యూస్, అనుదీప్ దేవ్ BGM ఫర్వాలేదు. లాజిక్‌లు మిస్సవ్వడం, రొటీన్ హారర్ కామెడీ ఫీల్ కలుగుతుంది. క్లైమాక్స్‌లో డైరెక్టర్ మానస శర్మ తడబడ్డారు.
రేటింగ్: 2.25/5

News April 3, 2026

మరో వివాదంలో IAS రోహిణి సింధూరి!

image

IPS రూపాపై <<10034506>>ఆరోపణలతో<<>> వార్తల్లో నిలిచిన IAS రోహిణి సింధూరి మరో వివాదంలో చిక్కుకున్నారు. ఆమెపై FIR నమోదు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కర్ణాటక హైకోర్టు ఆదేశించింది. 2021లో మైసూర్ డిప్యూటీ కమిషనర్‌గా ఉండగా ₹13 కాటన్ బ్యాగులను ₹52కు కొనడంతో ₹7.65 కోట్ల నష్టం వచ్చిందనే ఆరోపణలున్నాయి. ఆమెపై కేసు పెట్టాలని రవిచంద్రే గౌడ అనే వ్యక్తి ఫిర్యాదు చేయగా ప్రభుత్వం నిరాకరించింది. దీంతో ఆయన HCని ఆశ్రయించారు.