News March 30, 2024
డీఎస్సీ వాయిదా.. నిరుద్యోగుల ఆవేదన

AP: డీఎస్సీ వాయిదా పడటంతో నిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో 23వేల టీచర్ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, మెగా డీఎస్సీ వేస్తామని ఐదేళ్ల క్రితం సీఎం జగన్ హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్నారు. కానీ ఇప్పటివరకు ఒక్క డీఎస్సీ వేయలేదని ఫైరవుతున్నారు. ఎన్నికలు సమీపిస్తున్నాయనగా ఫిబ్రవరిలో 6,100 పోస్టులకే డీఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చారని, ఆ నోటిఫికేషన్ కూడా ఇప్పుడు ఆగిపోయిందంటున్నారు.
Similar News
News January 21, 2026
ఆర్గానిక్ పంటల సర్టిఫికేషన్కు యాప్: తుమ్మల

TG: ఐదు జిల్లాల్లో అమలు చేసిన యూరియా యాప్ను వచ్చే ఖరీఫ్ సీజన్ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తామని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. కేంద్రం ఈ విధానాన్ని మెచ్చుకుందన్నారు. నకిలీ ఆర్గానిక్ లేబుళ్లతో చలామణి అవుతున్న ఫేక్ ప్రొడక్ట్స్కు అడ్డుకట్ట వేసేందుకు ఆర్గానిక్ ఉత్పత్తులకు సర్టిఫికేషన్ ఇచ్చేలా ఓ యాప్ తీసుకొస్తామని చెప్పారు. దీంతో పంటను ఎక్కడ, ఎలా పండించారనే వివరాలు తెలుసుకోవచ్చన్నారు.
News January 21, 2026
పురుగు మందుల తయారీదారులకు కఠిన నిబంధనలు

కేంద్రం తీసుకురానున్న నూతన చట్టం ప్రకారం ప్రతి డబ్బాపై పురుగు మందు పేరు, బ్యాచ్ నంబరు, గడువు తేదీతో పాటు తయారీ సంస్థ చిరునామా, అందులో వాడిన రసాయనాల వివరాలను తప్పనిసరిగా ముద్రించాలి. ప్యాకేజింగ్ ప్రమాణాలను పాటించడంతో పాటు, QR కోడ్ ముద్రించి రైతులకు ఆ మందుల వివరాలు ఈజీగా తెలుసుకునేలా చేయాలి. లైసెన్స్ ఉన్న ప్రాంగణాల్లో మాత్రమే ఉత్పత్తి జరగాలి. భద్రతా ప్రమాణాల విషయంలో ఎలాంటి రాజీ పడకూడదు.
News January 21, 2026
హైదరాబాద్లోని IIMRలో ఉద్యోగాలు

<


