News August 21, 2024
లోకేశ్ టీ, బిస్కెట్ల ఖర్చులపై పోస్టులు.. ఖండించిన ఫ్యాక్ట్ చెక్

AP: మంత్రి నారా లోకేశ్ టీ, బిస్కెట్ల ఖర్చులపై జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇదంతా పూర్తి అసత్యమని, ప్రజలు నమ్మొద్దని కోరింది. ఇటువంటి ఫేక్ పోస్టులు పెట్టేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా అత్యంత ఖరీదైన టీ కోసం నారా లోకేశ్ నెలకు రూ.60 లక్షలు, బిస్కెట్లకు నెలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Similar News
News January 31, 2026
కోళ్లలో కొరైజా రోగ లక్షణాలు- జాగ్రత్తలు

కొరైజా రోగం సోకిన కోళ్లు సరిగా నీటిని, మేతను తీసికోక బరువు తగ్గుతాయి. కోడి ముక్కు, కళ్ల నుంచి నీరు కారుతుంది. కళ్లలో ఉబ్బి తెల్లని చీము గడ్డలు ఏర్పడతాయి. ఒకసారి ఈ వ్యాధి క్రిములు షెడ్డులోనికి ప్రవేశిస్తే అన్ని బ్యాచ్లకు ఈ రోగం వచ్చే ఛాన్సుంది. ఒక బ్యాచ్కు ఈ వ్యాధి వస్తే ఆ షెడ్డును కొన్ని రోజులు ఖాళీగా ఉంచాలి. సున్నం, గమాక్సిన్, బ్లీచింగ్ పౌడర్ కలిపి సున్నం వేయాలి. లిట్టరు పొడిగా ఉండేలా చూడాలి.
News January 31, 2026
IOCLలో 405 పోస్టులు.. అప్లైకి ఇవాళే లాస్ట్ డేట్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (<
News January 31, 2026
నేడు ఈ పనులు చేయకండి: పండితులు

శని దోష నివారణకు నేడు అనుకూలమైన రోజు. అందుకే నేడు ఎవరినీ నిందించకూడదు. అస్సలు అవమానించకూడదు. ముఖ్యంగా పనివారు, వృద్ధులు, పేదలను వేధించకూడదు. అలాగే ఇనుప వస్తువులు కొనడం నిషేధం. నల్ల నువ్వులు, నూనె వంటివి కూడా కొనుగోలు చేయకూడదట. ఆలయాలకు వెళ్తే బయటకు వచ్చేటప్పుడు వెనక్కి తిరిగి చూడకూడదని పండితులు హెచ్చరిస్తున్నారు. ఇంటి గడపపై కూర్చోవడం లేదా గడపను తొక్కడం వంటివి కూడా చేయరాదట.


