News August 21, 2024
లోకేశ్ టీ, బిస్కెట్ల ఖర్చులపై పోస్టులు.. ఖండించిన ఫ్యాక్ట్ చెక్

AP: మంత్రి నారా లోకేశ్ టీ, బిస్కెట్ల ఖర్చులపై జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇదంతా పూర్తి అసత్యమని, ప్రజలు నమ్మొద్దని కోరింది. ఇటువంటి ఫేక్ పోస్టులు పెట్టేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా అత్యంత ఖరీదైన టీ కోసం నారా లోకేశ్ నెలకు రూ.60 లక్షలు, బిస్కెట్లకు నెలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Similar News
News December 15, 2025
లంగ్స్కు ఇన్సూరెన్స్ ఉందా మెస్సీ?.. నెటిజన్ల ఫన్నీ కామెంట్లు

‘గోట్ టూర్’లో భాగంగా ఇవాళ ఢిల్లీలో ఫుట్బాల్ స్టార్ మెస్సీ పర్యటించనున్నారు. అయితే ఢిల్లీలో గాలి కాలుష్యం తీవ్రంగా ఉండటంపై నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా ఫన్నీగా స్పందిస్తున్నారు. ‘ఢిల్లీకి స్వాగతం మెస్సీ. మీ ఎడమ కాలికి $900M ఇన్సూరెన్స్ ఉందని విన్నా. మరి లంగ్స్కు ఉందా?’ అని ఓ యూజర్ ట్వీట్ చేశారు. మెస్సీ గోల్స్ రికార్డును ఢిల్లీ ఏక్యూఐ బ్రేక్ చేస్తుందని మరొకరు పోస్ట్ చేశారు.
News December 15, 2025
మోదీ, మెస్సీ మీటింగ్ క్యాన్సిల్!

ఢిల్లీలో తీవ్ర పొగమంచు కారణంగా విమాన రాకపోకలకు అంతరాయం ఏర్పడటంతో మెస్సీ టూర్ ఆలస్యమైంది. ఉదయం 11 గంటలకు ఢిల్లీకి చేరుకోవాల్సి ఉండగా మధ్యాహ్నం 2గంటలకు విమానం ల్యాండ్ అయింది. అక్కడి నుంచి హోటల్లో గ్రీట్ అండ్ మీట్లో పాల్గొని 4PMకు జైట్లీ స్టేడియానికి చేరుకుంటారు. సెలబ్రిటీ ఫుట్బాల్ మ్యాచ్తో సహా కోట్లాలో వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. కాగా ఫ్లైట్ ఆలస్యం కారణంగా మోదీతో భేటీ క్యాన్సిల్ అయింది.
News December 15, 2025
భారీ జీతంతో మేనేజర్ పోస్టులు

<


