News August 21, 2024
లోకేశ్ టీ, బిస్కెట్ల ఖర్చులపై పోస్టులు.. ఖండించిన ఫ్యాక్ట్ చెక్

AP: మంత్రి నారా లోకేశ్ టీ, బిస్కెట్ల ఖర్చులపై జరుగుతున్న ప్రచారాన్ని ఏపీ గవర్నమెంట్ ఫ్యాక్ట్ చెక్ ఖండించింది. ఇదంతా పూర్తి అసత్యమని, ప్రజలు నమ్మొద్దని కోరింది. ఇటువంటి ఫేక్ పోస్టులు పెట్టేవారిపై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. కాగా అత్యంత ఖరీదైన టీ కోసం నారా లోకేశ్ నెలకు రూ.60 లక్షలు, బిస్కెట్లకు నెలకు రూ.5 లక్షలు ఖర్చు చేస్తున్నారని పలువురు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు.
Similar News
News December 20, 2025
IRCTC వాలెట్తో బోలెడు ప్రయోజనాలు

IRCTC E-వాలెట్లో జమ చేసిన డబ్బులను నేరుగా విత్డ్రా చేసుకునే అవకాశం లేదని కేంద్రం స్పష్టం చేసింది. అయితే దీనివలన ప్రయాణికులకు చాలా ఉపయోగాలు ఉన్నాయి. తత్కాల్ టికెట్లు కేవలం సెకన్లలోనే బుక్ అవుతాయి. పేమెంట్ ఫెయిల్యూర్స్ అయ్యే అవకాశం తక్కువగా ఉంటుంది. ఒకవేళ టికెట్ క్యాన్సిల్ చేసినా, బుకింగ్ కాకపోయినా రిఫండ్ డబ్బులు వెంటనే వచ్చేస్తాయి. అదే సాధారణ బ్యాంక్ ట్రాన్సాక్షన్ అయితే రోజుల తరబడి వేచి చూడాలి.
News December 20, 2025
దేశంలో అతి తక్కువ ఫెర్టిలిటీ రేటు ఎక్కడంటే?

భారత్లో టోటల్ ఫెర్టిలిటీ రేటు అతి తక్కువగా ఉన్న రాష్ట్రంగా సిక్కిం (1.1) నిలిచింది. బిహార్లో(3.0) అత్యధిక ఫెర్టిలిటీ రేటు ఉంది. ఉత్తరాదితో పోలిస్తే దక్షిణాది రాష్ట్రాలు జనాభా నియంత్రణలో ముందున్నట్లు కేంద్రం ఇటీవల వెల్లడించింది. ఈ అంశంలో జాతీయ సగటు 2.0 కాగా అంతకంటే తక్కువగా TGలో 1.8, APలో 1.7గా ఉంది. అంటే ఒక మహిళ తన లైఫ్ టైమ్లో సగటున ఇద్దరి కంటే తక్కువ మందికి జన్మనిస్తోందని అర్థం.
News December 20, 2025
మల్లన్న భక్తులకు ఊరట

శ్రీశైల మల్లన్న స్పర్శ దర్శనాల సమయం పెంచుతున్నట్లు ప్రకటించడం భక్తులకు ఊరటనిచ్చే విషయం. జనవరి నుంచి వీకెండ్స్లో 6 స్లాట్లలో భక్తులకు లింగాన్ని తాకి దర్శనం చేసుకునే అవకాశం కల్పిస్తామని EO వెల్లడించారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆది, సోమవారాల్లో 7am-8:30am, 11:45am-2pm, 9pm-11pm స్లాట్లలో స్పర్శ దర్శనం ఉంటుంది. HYD, ఇతర ప్రాంతాల నుంచి ఉద్యోగులు, ఫ్యామిలీస్ వీకెండ్లో ఎక్కువగా వెళ్తున్నారు.


