News March 18, 2025
PPM: అంగన్వాడీ హెల్పర్స్కు ఇంటర్వ్యూలు చేసిన పీఓ

పీఎం జన్మన్ అంగన్వాడీ హెల్పర్స్ ఇంటర్వ్యూలను ఐటీడీఏ ప్రాజెక్ట్ అధికారి, సబ్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మంగళవారం తన ఛాంబరులో నిర్వహించారు. మొత్తం ఎనిమిది పోస్టులకు 13 మంది అభ్యర్థులు హాజరయ్యారు. ఒక్కొక్కరిని పిలిచి ఇంటర్వ్యూ చేశారు. ఈ ఎంపిక ప్రక్రియలో ప్రాజెక్ట్ అధికారితో పాటు ఐసీడీఎస్ పథక సంచాలకులు డా. టి.కనకదుర్గ, ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి, సీడీపీఓ తదితరులు ఉన్నారు.
Similar News
News November 25, 2025
తిరుమలలో పెరిగిన భక్తుల రద్దీ

తిరుమలలో భక్తుల రద్దీ పెరిగింది. శ్రీవారి సర్వదర్శనానికి టోకెన్లు లేని భక్తులకు 24 గంటల సమయం పడుతోంది. భక్తులు 31 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. నిన్న స్వామివారిని 68,615 మంది భక్తులు దర్శించుకోగా 27,722 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. హుండీ ఆదాయం రూ.4.23 కోట్లు సమకూరినట్లు టీటీడీ తెలిపింది.
News November 25, 2025
తిరుపతిలోని కాలేజీలకు నేడు సెలవు

తిరుచానూరు బ్రహ్మోత్సవాల్లో భాగంగా మరికాసేపట్లో పంచమితీర్థం జరగనుంది. ఇందులో భాగంగా శ్రీవేంకటేశ్వర యూనివర్సిటీ(SVU)కి మంగళవారం సెలవు ప్రకటించారు. ఈ మేరకు రిజిస్ట్రార్ భూపతి నాయుడు ఓ ప్రకటన విడుదల చేశారు. పంచమి తీర్థం సందర్భంగా లోకల్ హాలిడే ఇచ్చామని.. తిరుపతి సిటీలోని అన్ని డిగ్రీ కళాశాలలకు సెలవు ఉంటుందని చెప్పారు. విద్యార్థులు గమనించాలని కోరారు.
News November 25, 2025
మళ్లీ ప్రకాశంలోకి అద్దంకి నియోజకవర్గం?

బాపట్ల జిల్లాలోని అద్దంకి నియోజకవర్గం ప్రకాశంలోని కలవనున్నట్లు తెలుస్తోంది. గతంలో ప్రకాశం జిల్లాలో ఉన్న అద్దంకి పరిపాలన దృష్ట్యా బాపట్లలో చేర్చారు. ప్రస్తుతం జిల్లాల పునర్వవ్యవస్థీకరణలో భాగంగా అద్దంకిని ప్రకాశంలో కలిపి, రెవెన్యూ డివిజన్గా మార్చేందకు ఉపసంఘం ప్రతిపాదించింది. నిన్న అమరావతిలో జరిగిన సమీక్షలో ఈ నివేదికను సీఎం చంద్రబాబుకు అందించగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం


