News March 12, 2025

PPM: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 426 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు బుధవారం 426 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 8,598 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 8,172 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,660 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,465 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,938 ఒకేషనల్ విద్యార్థులకు 2,707 మంది పరీక్ష రాశారని చెప్పారు.

Similar News

News November 14, 2025

నస్పూర్: ఆరోగ్యకర అలవాట్లతో మధుమేహం నియంత్రణ

image

ఆరోగ్యకరమైన అలవాట్ల ద్వారా మధుమేహం, రక్తపోటును నియంత్రించవచ్చని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. ప్రపంచ మధుమేహ దినోత్సవం సందర్భంగా శుక్రవారం నస్పూర్‌లో అధికారులు, సిబ్బందికి నిర్వహించిన మధుమేహం, రక్తపోటు పరీక్షల కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటి వరకు 24,430 మందిలో మధుమేహాన్ని గుర్తించి చికిత్స అందిస్తున్నట్లు తెలిపారు.

News November 14, 2025

వాళ్లు ఏ వేషంలో వచ్చినా అవకాశం రాదు: అమిత్ షా

image

బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో NDA గెలుపుపై కేంద్ర హోం మంత్రి అమిత్ షా స్పందించారు. ఇది వికసిత్ బిహార్‌పై నమ్మకం పెట్టుకున్న ప్రతి ఒక్కరి విజయమని అన్నారు. జంగిల్ రాజ్, బుజ్జగింపు రాజకీయాలు చేసే వారు ఏ వేషంలో వచ్చినా దోచుకునేందుకు అవకాశం లభించదని ట్వీట్ చేశారు. పని తీరు ఆధారంగా ప్రజలు తీర్పు చెప్పారని పేర్కొన్నారు. బిహార్ ప్రజల ప్రతి ఓటు మోదీ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకానికి చిహ్నమని చెప్పారు.

News November 14, 2025

టెట్ నోటిఫికేషన్ విడుదల

image

తెలంగాణ <>TET<<>>-2026 నోటిఫికేషన్ విడుదలైంది. D.El Ed., D.Ed., B.Ed., Language Pandit రేపటి నుంచి ఈ నెల 29 వరకు అప్లై చేసుకోవచ్చు. జనవరి 3 నుంచి 31 వరకు పరీక్షలు నిర్వహిస్తారు. ప్రభుత్వ టీచర్లకు టెట్ అర్హత తప్పనిసరి. B.Ed విద్యార్హత కలిగిన SGTలు పేపర్ 1పరీక్ష రాయవచ్చు. దరఖాస్తు ఫీజు రూ.750. రెండు పేపర్లకు రూ.1000. వెబ్‌సైట్: https://tgtet.aptonline.in/tgtet/