News March 12, 2025

PPM: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 426 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు బుధవారం 426 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 8,598 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 8,172 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,660 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,465 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,938 ఒకేషనల్ విద్యార్థులకు 2,707 మంది పరీక్ష రాశారని చెప్పారు.

Similar News

News October 24, 2025

పుల్కల్: హత్య కేసులో ఇద్దరికీ జీవిత ఖైదు

image

హత్య కేసులో ఇద్దరు నిందితులకు జైలు శిక్ష విధిస్తూ రెండవ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి డాక్టర్ పీపీ కృష్ణ అర్జున్ గురువారం తీర్పు ఇచ్చారు. పుల్కల్ మండలం ఇసోజి పేట గ్రామానికి చెందిన ఓ గృహిణిని ఇద్దరూ కలిసి 2019లో హత్య చేశారు. నేరం రుజువు కావడంతో ఇద్దరికీ జైలు శిక్ష విధించినట్లు ఎస్పీ పారితోష్ పంకజ్ తెలిపారు.

News October 24, 2025

PKL: టాప్-4లో తెలుగు టైటాన్స్

image

ప్రోకబడ్డీ లీగ్ 12వ సీజన్‌లో ప్లే‌ఆఫ్(టాప్-8) జట్లు ఖరారయ్యాయి. టాప్-4లో పుణేరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, బెంగళూరు బుల్స్, తెలుగు టైటాన్స్ ఉన్నాయి. ఆ తర్వాతి స్థానాల్లో హరియాణా స్టీలర్స్, యూ ముంబా, పాట్నా పైరెట్స్, జైపూర్ పింక్ పాంథర్స్ ఉన్నాయి. రేపు జరిగే ప్లే ఆఫ్ మ్యాచుల్లో హరియాణా-జైపూర్, యూ ముంబా-పింక్ పాంథర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ నెల 26న బెంగళూరు బుల్స్‌తో తెలుగు టైటాన్స్ పోటీ పడనుంది.

News October 24, 2025

కృష్ణుడు దొంగిలించేది వెన్నను కాదు.. దోషాలను!

image

వెన్న దొంగతనం అనేది కృష్ణుడి లీల మాత్రమే కాదు. దీని వెనుక వేరే పరమార్థం ఉంది. వెన్న దాచిపెట్టే అత్తాకోడళ్ల ఇళ్లలో స్వార్థం, అహంకారం, అతిథి సత్కారం చేయకపోవడం వంటి దోషాలుండేవి. వాటిని భగ్నం చేయడానికి కోడలిపై నింద పడేలా చేసి, వారి మధ్య తగవులు పెట్టాడు. తద్వారా వారి మనస్సులు లౌకిక చింతల నుంచి తనపై కేంద్రీకృతమయ్యేలా చేశాడు. ఇలా వారిని భక్తి మార్గానికి మళ్లించి, మోక్షాన్ని ప్రసాదించాడు. <<-se>>#KRISHNALEELA<<>>