News March 12, 2025

PPM: ఇంటర్ సెకండ్ ఇయర్ పరీక్షలకు 426 మంది గైర్హాజరు

image

ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పరీక్షలకు బుధవారం 426 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 8,598 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 8,172 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,660 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,465 మంది విద్యార్థులు హాజరయ్యారు. 2,938 ఒకేషనల్ విద్యార్థులకు 2,707 మంది పరీక్ష రాశారని చెప్పారు.

Similar News

News November 27, 2025

బాధ్యతలకు విరుద్ధంగా గవర్నర్ కామెంట్స్: CM స్టాలిన్

image

తమిళనాడులో లా అండ్ ఆర్డర్ సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం ఉగ్రవాద ధోరణితో ఉందని గవర్నర్ ఆర్‌ఎన్ రవి కామెంట్స్‌ను సీఎం స్టాలిన్ తప్పుబట్టారు. ఉగ్ర దాడుల నుంచి ప్రజల ప్రాణాలు కాపాడలేని కేంద్రాన్ని అదే పనిగా ఆయన ప్రశంసిస్తున్నారని CM మండిపడ్డారు. శాంతికి నిలయమైన తమిళనాడును ఉగ్రవాద రాష్ట్రమంటున్న గవర్నర్‌ అహంకారాన్ని అణిచివేస్తామన్నారు. బాధ్యతలకు విరుద్ధంగా గవర్నర్ కామెంట్స్ ఉన్నాయని CM మండిపడ్డారు.

News November 27, 2025

మీ ఇంట్లో ‘దక్షిణామూర్తి’ చిత్రపటం ఉందా?

image

శివుడి జ్ఞాన స్వరూపమే దక్షిణామూర్తి. ఇంట్లో ఆయన చిత్రపటం ఉంటే అది సకల శుభాలు, అష్టైశ్వర్యాలకు మార్గమని పండితులు, వాస్తు నిపుణులు సూచిస్తున్నారు. అపమృత్యు దోషాలు, దీర్ఘకాలిక రోగాలతో బాధపడేవారు ఆయనను ఆరాధిస్తారు. దక్షిణామూర్తి దర్శనంతో పిల్లల్లో విద్యా బుద్ధులు వికసించి, జ్ఞానం, ఏకాగ్రత సిద్ధిస్తాయని నమ్మకం.
☞ దక్షిణామూర్తి విగ్రహాన్ని ఇంట్లో ఏ రోజున ప్రతిష్ఠించాలో తెలుసుకోవడానికి <<-se_10013>>భక్తి కేటగిరీ<<>>.

News November 27, 2025

TGTET-2026.. అప్లైకి ఎల్లుండే లాస్ట్ డేట్

image

TGTET-2026కు అప్లై చేయడానికి ఎల్లుండే ఆఖరు తేదీ. D.EL.Ed, B.EL.Ed, D.Ed, B.Ed, B.A.Ed / B.Sc.Ed కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 1-8వ తరగతి వరకు బోధించడానికి టెట్ అర్హత తప్పనిసరి. జనవరి 3 నుంచి జనవరి 31 వరకు CBT విధానంలో పరీక్ష నిర్వహించనున్నారు. ఒకసారి టెట్ ఉత్తీర్ణులైతే లైఫ్‌టైమ్ వాలిడిటీ ఉంటుంది. వెబ్‌సైట్: https://tgtet.aptonline.in/tgtet/