News March 19, 2025

PPM: ‘గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి’

image

పార్వతీపురం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గృహ నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక, మండలస్థాయి తదితర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్రా 2047 విజన్‌లో భాగంగా 2029 నాటికి అందరికీ సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

Similar News

News November 23, 2025

వన్డేలకు కొత్త కెప్టెన్‌ను ప్రకటించిన టీమ్ ఇండియా

image

దక్షిణాఫ్రికాతో జరిగే వన్డే సిరీస్‌కు భారత జట్టుకు కొత్త కెప్టెన్‌ను BCCI ప్రకటించింది. మూడు వన్డేల సిరీస్‌కు రాహుల్ సారథిగా వ్యవహరించనున్నట్లు వెల్లడించింది. బుమ్రా, సిరాజ్‌కు రెస్ట్ ఇవ్వగా గిల్, అయ్యర్ గాయాలతో దూరమయ్యారు.
జట్టు: రోహిత్, జైస్వాల్, కోహ్లీ, తిలక్ వర్మ, రాహుల్(C), పంత్(VC), సుందర్, జడేజా, కుల్దీప్, నితీశ్ కుమార్, హర్షిత్ రాణా, రుతురాజ్, ప్రసిద్ధ్, అర్షదీప్, ధ్రువ్ జురెల్.

News November 23, 2025

ఒకే వేదికపై కేటీఆర్, కవిత?

image

అన్నాచెల్లెళ్లు కేటీఆర్, కవిత ఒకే వేదికపై కనిపించే అవకాశముంది. ఈ నెల 25న చెన్నైలో ‘ABP నెట్‌వర్క్ సదరన్ రైజింగ్ సమ్మిట్’‌కు హాజరుకావాలని వీరికి ఆహ్వానం అందింది. ఇప్పటికే KTR వెళ్తానని ప్రకటించగా, కవిత కూడా వెళ్లేందుకు సిద్ధమైనట్లు సమాచారం. టైమింగ్స్ ఖరారు కావాల్సి ఉండగా వీరిద్దరూ ఒకే వేదికపై ఎదురుపడతారా అనేది ఆసక్తికరంగా మారింది. BRSను వీడాక కవిత, KTRను ఏ సందర్భంలోనూ కలుసుకోని సంగతి తెలిసిందే.

News November 23, 2025

వికారాబాద్: మార్వాడీల మాయాజాలం.. బంగారంతో మాయం.!

image

మార్వాడీల మాయాజాలం ప్రజల బంగారంతో మాయమైపోతున్నారు. స్థానిక నాయకుల అందండలతో మార్వాడీ వ్యాపారస్తులు తాకట్టు పెట్టిన బంగారం తీసుకొని పారిపోతున్నారని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కుల్కచర్ల మండలంలో ఇప్పటివరకు మార్వాడీలు ప్రజలను నమ్మించి బంగారంతో ఉడాయించారు. మార్వాడీలు ప్రజలను తరుచూ మోసం చేసి పారిపోతున్నారన్నారు. స్థానిక ప్రజా ప్రతినిధులు అండగా ఉండటంతో మార్వాడీలు దోచుకుంటున్నారన్నారు.