News March 19, 2025

PPM: ‘గృహ నిర్మాణాలు వేగవంతం కావాలి’

image

పార్వతీపురం జిల్లాలో అసంపూర్తిగా ఉన్న గృహ నిర్మాణాల పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం గృహ నిర్మాణ సంస్థ ఇంజినీరింగ్ అధికారులు, మండల ప్రత్యేక, మండలస్థాయి తదితర అధికారులతో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్వర్ణ ఆంధ్రా 2047 విజన్‌లో భాగంగా 2029 నాటికి అందరికీ సొంత ఇళ్లు ఉండాలనే లక్ష్యంతో ప్రభుత్వం చర్యలు చేపట్టిందన్నారు.

Similar News

News September 15, 2025

ఉల్లితో కూలిన ఆశలు!

image

కర్నూలు మార్కెట్ యార్డు ఉల్లి నిల్వలతో నిండిపోయింది. మరోవైపు ధరలు భారీగా పతనమయ్యాయి. ఆదివారం కిలో ఉల్లి ధర కేవలం 50 పైసలు. ఇక నాణ్యత లేదనే సాకుతో వ్యాపారులు క్వింటా రూ.50 నుంచి రూ.300 మించి కొనలేదు. ఉల్లి ధర ఇంతలా పతనం కావడం కర్నూలు చరిత్రలో ఇదే తొలిసారి. గతేడాది క్వింటా రూ.6వేల వరకు పలకడంతో ధర ఆశాజనకంగా ఉంటుందని రైతులు ఈ ఏడాది పెద్ద ఎత్తున సాగు చేశారు. ప్రస్తుత ధర వారికి కన్నీరు తెప్పిస్తోంది.

News September 15, 2025

నాగమల్లయ్య హత్యపై స్పందించిన ట్రంప్

image

అమెరికాలో భారతీయుడి <<17690207>>తల నరికివేసిన<<>> ఘటనపై ఆ దేశ అధ్యక్షుడు ట్రంప్ స్పందించారు. ‘క్యూబాకు చెందిన అక్రమ వలసదారు భార్యాబిడ్డల ముందే చంద్ర నాగమల్లయ్యను కిరాతకంగా చంపేశాడు. అతడు గతంలో నేరాలకు పాల్పడి జైలు శిక్ష అనుభవించాడు. అతడిని క్యూబా తమ దేశంలోకి తీసుకునేందుకు నిరాకరించింది. బైడెన్ అసమర్థతతో జైలు నుంచి బయటకు వచ్చాడు. నేరస్థుడిని కఠినంగా శిక్షిస్తాం. అక్రమ వలసదారులను వదలం’ అని హెచ్చరించారు.

News September 15, 2025

ADB: బాల్ బ్యాడ్మింటన్ రాష్ట్ర ఛాంపియన్ షిప్ మనదే!

image

రాష్ట్రస్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా జట్టు ఛాంపియన్ షిప్ సాధించిందని బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఆర్. నారాయణ రెడ్డి తెలిపారు. ఈనెల 13, 14వ తేదీల్లో జనగామ జిల్లాలో జరిగిన ఈ పోటీల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బాలుర జట్టు విజయం సాధించి రాష్ట్ర ఛాంపియన్ షిప్ కైవసం చేసుకుంది. ఈ విజయం పట్ల జిల్లా క్రీడాకారులంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు.