News March 6, 2025
PPM: ‘జిల్లాలో రూ.2.47 కోట్లు రాయితీపై వ్యవసాయ పరికరాలు’

రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి రైతులకు 50% వరకు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించుటకు నిర్ణయించడమైందని జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ తెలిపారు. మన్యం జిల్లాలో రూ.2.47 కోట్లు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించనుందన్నారు. బ్యాటరీ స్పెయర్లు, ఫుట్ స్పియర్స్, తైవాన్ స్పేయర్స్, ట్రాక్టర్ దుక్కి, దమ్ము సెట్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు,పవర్ టిల్లర్లు రాయితీపై అందించబడతాయని తెలిపారు.
Similar News
News December 6, 2025
ఆదిలాబాద్: మహిళల్లో ఆత్మవిశ్వాసం పెరగాలి: కలెక్టర్

ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ధైర్యంగా ఎదుర్కొనే ఆత్మవిశ్వాసం మహిళల్లో పెరగాలని కలెక్టర్ రాజర్షి షా అన్నారు. మహిళలపై హింసకు వ్యతిరేకంగా అంతర్జాతీయ ప్రచారోద్యమం నేపథ్యంలో, ఆదిలాబాద్లోని న్యూ అంబేద్కర్ భవన్లో సఖి కేంద్రం, జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి ఆయన హాజరయ్యారు. మహిళలపై హింస నిర్మూలనకు సమాజమంతా ముందుకు రావాల్సిన అవసరం ఉందని కలెక్టర్ పేర్కొన్నారు.
News December 6, 2025
iBOMMA కేసు.. BIG TWIST

TG: iBOMMA రవి కేసులో ట్విస్టులు కొనసాగుతున్నాయి. ఇవాళ అతడిని సైబర్ క్రైమ్ పోలీసులు కస్టడీకి తీసుకోలేదు. 3 కేసుల్లో 3 రోజుల కస్టడీకి నాంపల్లి కోర్టు నిన్న అనుమతివ్వగా పోలీసులు అప్పీల్ పిటిషన్ వేశారు. 3 రోజుల కస్టడీ సరిపోదని, మరింత గడువు ఇవ్వాలని కోరారు. దీనిపై సోమవారం విచారణ జరగనుంది. దీంతో అతను మరిన్ని రోజులు జైలులో గడపాల్సి ఉంటుంది. అలాగే రవి బెయిల్ పిటిషన్పైనా కోర్టు ఎల్లుండే వాదనలు విననుంది.
News December 6, 2025
వాస్తుతో తలరాతను మార్చుకోవచ్చా?

కార్యసాధన, పట్టుదలతో బ్రహ్మ రాసిన రాతను కూడా మార్చుకోవచ్చని పెద్దలు చెబుతుంటారు. ఈ ప్రయత్నానికి ఇంటి వాస్తు కూడా దోహదపడుతుందని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు పేర్కొంటున్నారు. ‘వాస్తు నియమాలు పాటిస్తే.. పంచభూతాల ఆధారంగా మన ఆలోచనలు, నడవడిక, శక్తి సానుకూలంగా మారుతాయి. దీనివల్ల సమయస్ఫూర్తి పెరుగుతుంది. తద్వారా మనకు వచ్చే అవకాశాలను సులభంగా అందిపుచ్చుకోగలుగుతాం’ అని చెబుతున్నారు. <<-se>>#Vasthu<<>>


