News March 6, 2025
PPM: ‘జిల్లాలో రూ.2.47 కోట్లు రాయితీపై వ్యవసాయ పరికరాలు’

రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి రైతులకు 50% వరకు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించుటకు నిర్ణయించడమైందని జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ తెలిపారు. మన్యం జిల్లాలో రూ.2.47 కోట్లు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించనుందన్నారు. బ్యాటరీ స్పెయర్లు, ఫుట్ స్పియర్స్, తైవాన్ స్పేయర్స్, ట్రాక్టర్ దుక్కి, దమ్ము సెట్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు,పవర్ టిల్లర్లు రాయితీపై అందించబడతాయని తెలిపారు.
Similar News
News November 28, 2025
వనపర్తి: నామినేషన్లలో పొరపాట్లు వద్దు: కలెక్టర్

వనపర్తి జిల్లాలో నామినేషన్ల ప్రక్రియలో ఏ చిన్న పొరపాటు జరగకుండా ఎన్నికల నిబంధనలను జాగ్రత్తగా అమలు చేయాలని రిటర్నింగ్ అధికారులకు కలెక్టర్ ఆదర్శ్ సురభి ఆదేశించారు. రెండో, మూడో దశ ఎన్నికల నామినేషన్ల స్వీకరణపై శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. నిబంధనలను తూచా తప్పకుండా పాటించాలని, ప్రతి ప్రక్రియను పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ సూచించారు.
News November 28, 2025
NABARDలో ఉద్యోగాలు.. అప్లై చేశారా?

<
News November 28, 2025
సీఎం రేవంత్ జిల్లాల పర్యటన

TG: కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా డిసెంబర్ 1 నుంచి సీఎం రేవంత్ రెడ్డి జిల్లాల్లో పర్యటించనున్నారు. డిసెంబర్ 1న మక్తల్, 2న కొత్తగూడెం, 3న హుస్నాబాద్, 4న ఆదిలాబాద్, 5న నర్సంపేట, 6న దేవరకొండలో పర్యటించనున్నారు.


