News March 6, 2025
PPM: ‘జిల్లాలో రూ.2.47 కోట్లు రాయితీపై వ్యవసాయ పరికరాలు’

రాష్ట్ర ప్రభుత్వం 2024-25 సంవత్సరానికి సంబంధించి రైతులకు 50% వరకు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించుటకు నిర్ణయించడమైందని జిల్లా వ్యవసాయ అధికారి రాబర్ట్ పాల్ తెలిపారు. మన్యం జిల్లాలో రూ.2.47 కోట్లు రాయితీపై వ్యవసాయ పరికరాలను అందించనుందన్నారు. బ్యాటరీ స్పెయర్లు, ఫుట్ స్పియర్స్, తైవాన్ స్పేయర్స్, ట్రాక్టర్ దుక్కి, దమ్ము సెట్లు, రోటోవేటర్లు, పవర్ వీడర్లు,పవర్ టిల్లర్లు రాయితీపై అందించబడతాయని తెలిపారు.
Similar News
News December 8, 2025
TVK సభకు పోలీసుల ఆంక్షలు.. 5వేల మందికే పర్మిషన్

TVK పార్టీ చీఫ్ విజయ్ రేపు పుదుచ్చేరిలో నిర్వహించే సభకు పోలీసులు కఠిన ఆంక్షలు విధించారు. TVK ఇష్యూ చేసిన QR కోడ్ పాసులున్న 5వేల మంది స్థానికులనే సభకు అనుమతిస్తామన్నారు. పిల్లలు, గర్భిణులు, వృద్ధులకు ఎంట్రీ లేదని చెప్పారు. సభ వద్ద తాగునీరు, మరుగుదొడ్లు, అంబులెన్సులు, ఎమర్జెన్సీ ఎగ్జిట్లు ఏర్పాటు చేసుకోవాలని పార్టీని ఆదేశించారు. కరూర్ లాంటి ఘటన మరోసారి జరగకుండా పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు.
News December 8, 2025
NSU లైంగిక వేధింపుల ఘటన.. ముందే తెలిసినా.!

తిరుపతి NSUలో లైంగిక వేధింపుల ఘటన వెలుగులోకి వచ్చినా వర్సిటీ వర్గాలు ఘటనపై ఫిర్యాదు చేసేందుకు వెనుకడుగు వేశాయని పోలీసుల వర్గాల సమాచారం. శనివారం సాయంత్రం వర్సిటీ సిబ్బంది స్టేషన్కు వెళ్లి ‘నిందితుల ఫోన్లు తెచ్చాము, పరిశీలించండి’ అనడంతో పోలీసులు అవాక్కయ్యారట. ఫిర్యాదు చేస్తేనే విచారణ చేపడతామని వారు తెగేసి చెప్పడంతో వేరే దారి లేక ఇన్ఛార్జ్ రిజిస్ట్రార్ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది.
News December 8, 2025
నేడు పార్లమెంటులో ‘వందేమాతరం’పై చర్చ

జాతీయ గేయం వందేమాతరం 150 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇవాళ పార్లమెంట్ ఉభయ సభల్లో ప్రత్యేక చర్చ జరగనుంది. లోక్సభలో మధ్యాహ్నం 12 గంటలకు ప్రధాని మోదీ చర్చను ప్రారంభించి సుదీర్ఘంగా ప్రసంగిస్తారు. ఈ గేయంపై 10 గంటలపాటు చర్చ సాగనుంది. రాజ్యసభలో అమిత్షా చర్చను మొదలుపెడతారు. స్వాతంత్ర్య పోరాటానికి స్ఫూర్తినిచ్చిన ‘వందేమాతరం’ చారిత్రక, సాంస్కృతిక ప్రాముఖ్యతపై పలువురు ఎంపీలు మాట్లాడతారు.


