News March 7, 2025

PPM: ‘జీడిపప్పు పరిశ్రమకు స్థల పరిశీలిన’

image

పార్వతీపురం పట్టణంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులోని మార్కెట్ గోదాంలో జీడి పరిశ్రమ స్థాపించేందుకు ఉన్న అనుకూలత, అవకాశాలను జిల్లా కలెక్టర్ ఎ.శ్యాం ప్రసాద్ గురువారం పరిశీలించారు. అధికారులతో కలిసి జీడి పరిశ్రమ స్థాపనకు సాధ్యాసాధ్యాలను నిశితంగా పరిశీలించారు. బాయిలర్ ఏర్పాటు, ముడి సరుకు నిల్వ, యంత్రాల ఏర్పాటుకు అవసరమైన వసతులు కల్పనకు జీడి పరిశ్రమ వ్యాపారులతో మాట్లాడారు.

Similar News

News March 7, 2026

మన పల్లె-మన నీరు పనుల నిర్వహణకు చర్యలు: కలెక్టర్

image

పుట్టపర్తి కలెక్టరేట్లో మన పల్లె-మన నీరు పనులపై కలెక్టర్ శ్యాంప్రసాద్ సంబంధిత అధికారులతో శనివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. మన పల్లె-మన నీరు పనులలో భాగంగా జల సంరక్షణ, భూగర్భ జలాల పెంపొందించేందుకు చెరువులు, సప్లై ఛానల్, చెరువులలో కంపచెట్లు తొలగింపు తదితర అంశాలపై అధికారులతో సమీక్షించారు. నీటి విలువ సంరక్షణకు పూడిక తీసే పనులు వర్షాకాలం కంటే ముందే చేపట్టాలని అధికారులను ఆదేశించారు.

News March 7, 2026

కడప: ‘10th పరీక్షలు పగడ్బందీగా నిర్వహించాలి’

image

కడప జిల్లాలో 10th పరీక్షలను నిష్పక్షపాతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జేసీ నిధిమీనా పరీక్షల నిర్వాహక అధికారులను ఆదేశించారు. శనివారం కలెక్టరేట్ సభా భవన్‌లో పది పబ్లిక్ పరీక్షల నిర్వహణపై సంబంధిత అధికారులకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు 169 సెంటర్లలో 28,158 మంది విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఆర్జేడీ శామ్యూల్, ఏసీ , డీఈఓ శంషుద్దీన్ హాజరయ్యారు.

News March 7, 2026

మహబూబాబాద్: ప్రతి మనిషి అభివృద్ధిలో మహిళల పాత్రే కీలకం: జిల్లా జడ్జి

image

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహబూబాబాద్ జిల్లా కోర్టు సముదాయంలో శనివారం వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ప్రధాన న్యాయమూర్తి మహమ్మద్ అబ్దుల్ రఫీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రతి వ్యక్తి ఎదుగుదలలో, సమాజ అభివృద్ధిలో మహిళల పాత్ర ఎంతో కీలకమైందన్నారు. గృహ హింస, వరకట్న వేధింపులకు గురవుతున్న బాధితులకు అండగా నిలుస్తున్న జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ప్యానెల్ న్యాయవాదులను అభినందించారు.