News March 1, 2025
PPM: టి.బి. రోగులకు నిక్షయ్ మిత్రలుగా సహకరించాలి

ప్రధాన మంత్రి టి.బి. ముక్త్ భారత్ అభియాన్ (PMTBMBA) పథకం కింద టి.బి. రోగులకు పోషకాహార సహకారం అందించనున్నారు. ఈ షౌష్టికాహారాన్ని పొందేందుకు నిక్షయ్ మిత్రలుగా నమోదు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ ఎ. శ్యామ్ ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. ఇందులో నమోదు చేసుకున్న టి.బి. రోగులకు నెలకు రూ. 700 చొప్పున గరిష్టంగా 6 నెలల వరకు, మొత్తం రూ. 4200 ఆర్థిక సహాయం అందుతుందని శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు.
Similar News
News December 22, 2025
మిడిల్ క్లాస్కు సొంతింటి ముప్పు.. HPI రేషియో తెలుసా?

సొంతిళ్లనే ధీమా కోసం ‘మిడిల్ క్లాస్’ రెక్కలు ముక్కలు చేసుకోవాల్సిందే. ఇప్పుడది జీవితకాల కష్టానికి పెరిగింది. దీన్ని HPI(House Price to Income) రేషియోతో కొలుస్తారు. 3-6ఏళ్ల జీతంతో ఇళ్లు కొనగలిగితే సేఫ్. కానీ ముంబైలో ఓ వ్యక్తి 34Y జీతం వెచ్చించాల్సిందే. ఇది బెంగళూరులో 22, ఢిల్లీలో 20, పుణేలో 18Yగా ఉంది. హాంకాంగ్ 21, లండన్ 13, సింగపూర్ 11, న్యూయార్క్ 9Yగా ఉంది. మీ ప్రాంతంలో ఈ రేషియో ఎలా ఉంది?
News December 22, 2025
H-1B Visa: ‘వీలైనంత త్వరగా అప్లై చేసుకోండి’

H-1B, H-4 వీసాలకు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలని భారత్లోని అమెరికా ఎంబసీ కోరింది. ఆన్లైన్ నిఘాను కఠినతరం చేసిన నేపథ్యంలో ప్రాసెసింగ్కు ఎక్కువ సమయం పట్టే అవకాశం ఉందని తెలిపింది. US ఎంబసీలు, కాన్సులేట్లు వీసా దరఖాస్తులను యథావిధిగా స్వీకరిస్తున్నాయని వెల్లడించింది. వెట్టింగ్గా పిలుస్తున్న కొత్త నిబంధన కారణంగా అమెరికా నుంచి వచ్చిన వేలాదిమంది ఇండియన్స్ ఇక్కడే చిక్కుకుపోయారు.
News December 22, 2025
గంగాధర: సర్పంచ్ మొదటి తీర్మానం.. రూపాయికే అంత్యక్రియలు!

బాధ్యతలు చేపట్టిన తొలిరోజే కరీంనగర్(D) గంగాధర(M) బూరుగుపల్లి గ్రామ సర్పంచ్ దూలం కళ్యాణ్ కుమార్ చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్నారు. గ్రామంలో ఎవరైనా మరణిస్తే కేవలం ఒక్క రూపాయికే దహన సంస్కారాలు నిర్వహించేలా తొలి పాలకవర్గ సమావేశంలో తీర్మానం చేశారు. ఈ వినూత్న పథకం బూరుగుపల్లి జిల్లాలోనే ప్రత్యేకంగా నిలిచింది. పరిమిత వనరులున్నా పేదలకు అండగా నిలవాలనే సర్పంచ్ సంకల్పంపై సర్వత్రా ప్రశంసలు కురుస్తున్నాయి.


