News February 19, 2025

PPM: డీఐఈఓకు ఆచార్య దేవోభవ అవార్డు

image

పార్వతీపురం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారి డి.మంజుల వీణ‌కు ఆచార్య దేవోభవ అవార్డు లభించింది. గణిత శాస్త్ర అధ్యాపకురాలుగా, ఉమ్మడి జిల్లాల ఆర్‌ఐ‌ఓగా, పార్వతీపురం జిల్లా ఇంటర్మీడియట్ విద్యా శాఖ అధికారిగా సేవలు అందించారు. ఈ మేరకు ప్రియదర్శిని సోషల్ వెల్ఫేర్ ఆర్గనైజేషన్  2025 ఏడాదికి ఈ అవార్డును అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్ మంజుల వీణను బుధవారం అభినందించారు.

Similar News

News November 15, 2025

అమరావతిలో ఆలిండియా ఫుట్ బాల్ ఫెడరేషన్ స్టేడియం

image

రాష్ట్రంలో క్రీడా వసతుల అభివృద్ధిపై మంత్రి నారా లోకేశ్‌తో AIFF ఛైర్మన్ కళ్యాణ్ చౌబే భేటీ అయ్యారు. అమరావతిలో 12 ఎకరాల్లో AIFF ఫుట్‌బాల్ స్టేడియం నిర్మాణం ప్రారంభించనున్నట్టు చౌబే వెల్లడించారు. గ్రాస్‌రూట్స్ ఫుట్‌బాల్‌ కోసం పీఈటీ‌లకు శిక్షణ, కోచ్‌ల గ్రేడింగ్‌లో APతో భాగస్వామ్యం కొనసాగుతుందని తెలిపారు.
ఏపీలో క్రీడాకారులను ప్రోత్సహించేందుకు డీఎస్సీలో 3% రిజర్వేషన్ ఇచ్చామని లోకేశ్ ఆయనకు తెలిపారు.

News November 15, 2025

ఎల్లుండి క్యాబినెట్ భేటీ.. స్థానిక ఎన్నికలపై చర్చ

image

TG: రాష్ట్ర మంత్రివర్గం ఎల్లుండి సమావేశం కానుంది. ఇందులో స్థానిక సంస్థల ఎన్నికలపై చర్చించనుంది. జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో విజయంతో జోష్‌లో ఉన్న హస్తం పార్టీ.. త్వరలోనే స్థానిక ఎన్నికలకు వెళ్లేందుకు రెడీగా ఉంది. న్యాయస్థానాల ఆదేశాల మేరకు 50 శాతం లోపు రిజర్వేషన్లతోనే ఎన్నికలకు వెళ్లనుంది. మంత్రివర్గ సమావేశంలో దీనిపైనే చర్చిస్తామని ఇటీవల సీఎం రేవంత్ చెప్పిన విషయం తెలిసిందే.

News November 15, 2025

భీమేశ్వరాలయంలో ఏర్పాట్ల పరిశీలన

image

వేములవాడ శ్రీ భీమేశ్వరాలయంలో భక్తులకు అవసరమైన ఏర్పాట్లను ఆలయ ఈవో ఎల్ రమాదేవి శుక్రవారం పరిశీలించారు. పట్టణ సీఐ వీరప్రసాద్‌తో కలిసి టికెట్ బుకింగ్ కౌంటర్, సర్వదర్శనం, ప్రత్యేక దర్శనం క్యూ లైన్లు, లడ్డు తయారీ విభాగం వంటివి పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు చేశారు. భక్తుల రద్దీ సందర్భంగా ఎలాంటి ఇబ్బందులు ఎదురు కాకుండా తీసుకోవాల్సిన చర్యలపై సీఐ వీరప్రసాద్ ఆలయ సిబ్బందికి సూచనలు చేశారు.