News February 6, 2025

PPM: నిర్ణిత కాల వ్యవధిలోగా మ్యూటేషన్లు పరిష్కరించాలి

image

రీసర్వే, రెవెన్యూ సదస్సులు, మీ సేవా పోర్టల్ ద్వారా వచ్చే మ్యూటేషన్లను నిర్ణిత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తహశీల్దార్లకు సూచించారు. 30 రోజులు దాటి ఒక్క రోజు ఆలస్యమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు, రెవిన్యూ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు.

Similar News

News March 22, 2025

IPL: ఈసారైనా వీరికి టైటిల్ దక్కేనా?

image

ఐపీఎల్‌లో కొన్ని జట్లు ఒక్కసారి కూడా ట్రోఫీని ముద్దాడలేకపోయాయి. వాటిలో పంజాబ్ కింగ్స్, ఢిల్లీ క్యాపిటల్స్, RCB, LSG ఉన్నాయి. ఈ సారైనా తమ ఫేవరెట్ జట్లు కప్పు కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు. కాగా ఐపీఎల్ 18వ సీజన్ నేటి నుంచి మే 25 వరకు కొనసాగనుంది. 64 రోజులపాటు 74 మ్యాచులు జరగనున్నాయి. ప్రస్తుతం టైటిల్ కోసం 10 జట్లు బరిలోకి దిగుతున్నాయి. మీ ఫేవరెట్ టీమ్ ఏదో కామెంట్ చేయండి.

News March 22, 2025

ALERT: రేపు రాష్ట్రంలో పిడుగులతో కూడిన వర్షం

image

AP: రేపు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, పిడుగులతో కూడిన వర్షం పడుతుందని APSDMA తెలిపింది. మరోవైపు ఎండ తీవ్రత కూడా కొనసాగుతుందని పేర్కొంది. కూలీలు, రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. బహిరంగ ప్రదేశాల్లో ఉండొద్దని విజ్ఞప్తి చేసింది. అలాగే ఇవాళ అత్యధికంగా కర్నూలు జిల్లా ఆస్పరి, సత్యసాయి జిల్లా తొగరకుంటలో 40.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు వెల్లడించింది.

News March 22, 2025

సంగారెడ్డి: చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్: కలెక్టర్

image

ఎల్ఆర్ఎస్ ఫీజు చెల్లించిన వారికి వెంటనే ప్రొసీడింగ్ ఇవ్వాలని కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి నుంచి మండల స్థాయి అధికారులతో టెలికాన్ఫరెన్స్ శనివారం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 31వ తేదీ వరకు ఎల్ఆర్ఎస్ ఫీజు 100% చెల్లించిన ప్రజలకు అవగాహన కల్పించాలని చెప్పారు. 25% డిస్కౌంట్ లభిస్తుందని పేర్కొన్నారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

error: Content is protected !!