News March 17, 2025
PPM: పదో తరగతి పరీక్షలను పరిశీలించిన కలెక్టర్

పార్వతీపురం జిల్లాలో సోమవారం పదో తరగతి పరీక్షలు ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ పార్వతీపురం ఆర్.సి.యం. సెయింట్ పీటర్స్ (ఇ.యం) హై స్కూల్లో నిర్వహిస్తున్న పదో తరగతి పరీక్షలను పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో ఏర్పాటు చేసిన మౌలిక వసతులను, పరీక్షా నిర్వహణ తీరును అడిగి తెలుసుకున్నారు.
Similar News
News October 14, 2025
MHBD: లిక్కర్ షాపులకు 113 దరఖాస్తులు

మహబూబాబాద్ జిల్లాలో లిక్కర్ షాపులకు మొత్తం 113 దరఖాస్తులు వచ్చినట్లు మహబూబాబాద్ ఎక్సైజ్ సీఐ చిరంజీవి తెలిపారు. సోమవారం ఒక్క రోజే 56 దరఖాస్తులు వచ్చాయన్నారు. మహబూబాబాద్ ఎక్సైజ్ స్టేషన్ లిమిట్స్లో ఆదివారం 25 దరఖాస్తు రాగ మొత్తం 59 దరఖాస్తులు వచ్చాయని సీఐ తెలిపారు. లిక్కర్ షాపులకు దరఖాస్తులకు ఈనెల 18న గడువు ముగుస్తుందన్నారు.
News October 14, 2025
వచ్చే నెల నుంచి ముఖ ఆధారిత హాజరు: కలెక్టర్

అనకాపల్లి జిల్లాలో వచ్చే నెల నుంచి ముఖ ఆధారిత హాజరు అమల్లోకి వస్తున్నట్లు కలెక్టర్ విజయకృష్ణన్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ నుంచి మండల స్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందుకు అవసరమైన ఈకేవైసీని వెంటనే పూర్తి చేయాలని ఆదేశించారు. ఉపాధి కూలీలకు కనీస వేతనం గిట్టుబాటు అయ్యే విధంగా పనులు కల్పించాలన్నారు. ప్రతి మండలంలో ఒక మ్యాజిక్ డ్రైన్ పూర్తి చేయాలన్నారు.
News October 14, 2025
ఈ రోజు నమాజ్ వేళలు (అక్టోబర్ 14, మంగళవారం)

✒ ఫజర్: తెల్లవారుజామున 4.57 గంటలకు
✒ సూర్యోదయం: ఉదయం 6.09 గంటలకు
✒ దుహర్: మధ్యాహ్నం 12.02 గంటలకు
✒ అసర్: సాయంత్రం 4.17 గంటలకు
✒ మఘ్రిబ్: సాయంత్రం 5.55 గంటలకు
✒ ఇష: రాత్రి 7.07 గంటలకు
✒ NOTE: ప్రాంతాన్ని బట్టి నమాజ్ వేళల్లో స్వల్ప తేడాలుండొచ్చు.