News February 19, 2025

PPM: పాలకొండ నగర పంచాయతీ చైర్‌పర్సన్ ఎన్నిక మరోసారి వాయిదా

image

పాలకొండ నగర పంచాయతీలో చైర్‌పర్సన్ ఎన్నికకు తగినంత కోరం లేకపోవడంతో ఎన్నిక నిలిచినట్లు సబ్ కలెక్టర్లు సి.యశ్వంత్ కుమార్ రెడ్డి, ఎస్.ఎస్ సోభిత మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. మంగళవారం నాల్గో సారి మున్సిపల్ చైర్‌పర్సన్ పదవికి ఎన్నిక నిర్వహించగా మళ్లీ వాయిదా పడినట్లు వారు వివరించారు. ఈ ఘటనపై ఎలక్షన్ కమిషనర్‌కు నివేదిక ఇవ్వనున్నట్లు సబ్ కలెక్టర్లతో పాటు మున్సిపల్ కమిషనర్ ఎస్.సర్వేశ్వరరావు చెప్పారు.

Similar News

News September 18, 2025

నేడు రాహుల్ గాంధీ ‘స్పెషల్’ ప్రెస్ మీట్

image

ఇవాళ రాహుల్ గాంధీ ఓ స్పెషల్ ప్రెస్ మీట్ నిర్వహిస్తారని కాంగ్రెస్ పార్టీ ప్రకటించింది. ఢిల్లీలోని ఇందిరా భవన్ ఆడిటోరియంలో ఉ.10 గంటలకు ఆయన మీడియాతో మాట్లాడతారని తెలిపింది. అయితే ఏ అంశాలపై ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. కొత్తగా రెండు రాష్ట్రాల్లోని రెండు నియోజకవర్గాలు, హై ప్రొఫైల్ లోక్‌సభ స్థానంపై ఓట్ చోరీ ఆరోపణలు చేస్తారని రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.

News September 18, 2025

2030 నాటికి 1.14 లక్షల మందికి ఉపాధి: భట్టి

image

TG: గ్రీన్ ఎనర్జీ పాలసీ ద్వారా రూ.1.98 లక్షల కోట్ల పెట్టుబడితో 20 వేల మెగావాట్ల రీ యూజబుల్ ఎనర్జీ ఉత్పత్తి చేస్తామని Dy.CM భట్టి విక్రమార్క తెలిపారు. ‘2030 నాటికి ఈ పాలసీతో 1.14 లక్షల మందికి ఉపాధి లభిస్తుంది. మహిళా సంఘాల ద్వారా 2 వేల మెగావాట్ల సోలార్ ఎనర్జీ ఉత్పత్తికి రంగం సిద్ధమైంది. అర్హులైన వారందరికీ రేషన్ కార్డులు ఇచ్చాం. ప్రతి వ్యక్తికి 6 కిలోల సన్నబియ్యం పంపిణీ చేస్తున్నాం’ అని తెలిపారు.

News September 18, 2025

VKB: అత్త శ్రద్ధాంజలి బ్యానర్ తీసుకెళ్తూ అల్లుడు మృతి

image

VKB జిల్లా పుల్‌మద్ది గ్రామంలో వ్యక్తి మృతి చెందిన విషయం తెలిసిందే. గ్రామానికి చెందిన లక్ష్మి మరణించడంతో ఆమె శ్రద్ధాంజలి బ్యానర్‌ని అల్లుడు శ్రీనివాస్ పట్టణంలో ప్రింట్ చేసుకొని తిరిగి వస్తున్నాడు. ఈ క్రమంలో రోడ్డు గుంతలో బైక్ పడి కింద పడడంతో వెనుక నుంచి వేగంగా వచ్చిన డీసీఎం వాహనం శ్రీనివాస్‌పై నుంచి వెళ్లింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అత్త, అల్లుడు మరణంతో కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది.