News February 4, 2025

PPM: ప్రతికూల వార్తలపై అధికారులు తక్షణమే స్పందించాలి

image

జిల్లాలో సంస్థాగతంగా ప్రజలకు సేవలు అందించడంలో లోపాలు పట్ల వివిధ పత్రికల్లో వస్తున్న ప్రతికూల వార్తలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అధికారి పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.

Similar News

News February 23, 2026

వెంటనే ఇరాన్ వదిలివెళ్లిపోండి: భారత్ ఎంబసీ

image

USతో ఉద్రిక్తతల నేపథ్యంలో వెంటనే ఇరాన్ విడిచివెళ్లిపోవాలని అక్కడి భారతీయులను ఇండియన్ ఎంబసీ హెచ్చరించింది. ఇది విద్యార్థులు, వ్యాపారులు, పర్యాటకులు, యాత్రికులకు వర్తిస్తుందని తెలిపింది. భారతీయులు తమ ట్రావెల్ డాక్యుమెంట్స్ సిద్ధంగా ఉంచుకోవాలని తెలిపింది. నిరసన ప్రాంతాలకు దూరంగా ఉండాలంది. ఎంబసీని సంప్రదించేందుకు హెల్ప్‌లైన్ వివరాలు +989128109115, +989128109109, cons.tehran@mea.gov.in షేర్ చేసింది.

News February 23, 2026

ఏలూరు: ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షకు 1,014 మంది గైర్హాజరు

image

ఏలూరు జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ తెలుగు పబ్లిక్ పరీక్షలకు 17,864 మంది హాజరు కావలసి ఉండగా 16,850 మంది హాజరయ్యారని ఆర్ఐవో యోహాన్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 1,014 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరు అయ్యారని వివరించారు. మొదటిరోజు పరీక్ష ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు లేకుండా ప్రశాంతంగా జరిగాయన్నారు. రేపటి పరీక్షకు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి సమయంలోపు రావాలన్నారు.

News February 23, 2026

ప్రశాంతంగా ఇంటర్ పరీక్షలు.. 888 మంది గైర్హాజరు: ఆర్ఐవో

image

నెల్లూరు జిల్లాలో మొదటి రోజు ఇంటర్ పరీక్ష‌ ఎక్కడ మాల్ ప్రాక్టీస్‌కు తావు లేకుండా ప్రశాంతంగా ముగిసినట్లు ఆర్‌ఐవో వరప్రసాదరావు వెల్లడించారు. జిల్లావ్యాప్తంగా 81 కేంద్రాలలో 27,613 మంది విద్యార్థులకు గాను 888 మంది విద్యార్థులు పరీక్షలకు గైర్హాజరు అయినట్లు తెలిపారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బందులకు కలగకుండా పరీక్షా కేంద్రాల వద్ద గట్టి బందోబస్తు, అన్ని మౌలిక వసతులు కల్పించామన్నారు.