News January 25, 2025
PPM: ‘ప్రపంచాన్నే మార్చకలిగే శక్తిమంతులు బాలికలు’

బాలికల హక్కులను పరిరక్షిస్తూ, వారి అవసరాలను తీర్చగలిగితే సమాజంతో పాటు, ప్రపంచాన్ని మార్చకలిగే శక్తిమంతులు బాలికలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళలు, బాలికల కొరకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడమే సమాజంలో మహిళలకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు.
Similar News
News December 12, 2025
మద్యం దుకాణాలను మూసివేయాలి: ఆదర్శ్ సురభి

వనపర్తి జిల్లాలో ఈనెల 14న 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికల పోలింగ్ నేపథ్యంలో ఆయా మండలాల్లో శుక్రవారం 5PM తర్వాత ఎటువంటి ప్రచారం నిర్వహించడానికి అనుమతి లేదని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి తెలిపారు. వనపర్తి, కొత్తకోట, మదనాపూర్, ఆత్మకూరు, అమరచింత మండలాలలో నిషేధాజ్ఞలు 5గంటల నుంచి అమలులోకి వస్తాయన్నారు. అన్ని మద్యం దుకాణాలను మూసివేయాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల పరిధిలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు.
News December 12, 2025
కొండాపూర్: యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్

ఆర్డినెన్స్ ఫ్యాక్టరీలో తయారైన యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ కార్యక్రమం కొండాపూర్ మండలం మల్కాపూర్ పెద్ద చెరువులో శుక్రవారం నిర్వహించారు. చెరువులో విద్య ట్యాంకర్ల విన్యాసాలు ప్రత్యేకంగా ఆకట్టుకున్నాయి. యుద్ధ ట్యాంకర్ల ట్రయల్ రన్ కార్యక్రమాన్ని వీక్షించేందుకు గ్రామస్థులతో పాటు చుట్టు పక్కల ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చారు.
News December 12, 2025
ప్రచారానికి తెర.. కరీంనగర్ పల్లెలు సైలెంట్.!

కరీంనగర్ జిల్లాలో రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల ప్రచారం గడువు శుక్రవారం సాయంత్రం 5 గంటలకు ముగియడంతో పల్లెల్లో ఎన్నికల సందడికి తెరపడింది. పాటలు, కరపత్రాలతో ఓటర్లను ఆకర్షించిన అభ్యర్థులు మౌనం వహించారు. ఎల్లుండి పోలింగ్ జరగనున్న నేపథ్యంలో, అధికారులు ఓటింగ్కు సంబంధించిన అన్ని ఏర్పాట్లను పూర్తి చేసే పనిలో నిమగ్నమయ్యారు.


