News January 25, 2025
PPM: ‘ప్రపంచాన్నే మార్చకలిగే శక్తిమంతులు బాలికలు’

బాలికల హక్కులను పరిరక్షిస్తూ, వారి అవసరాలను తీర్చగలిగితే సమాజంతో పాటు, ప్రపంచాన్ని మార్చకలిగే శక్తిమంతులు బాలికలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళలు, బాలికల కొరకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడమే సమాజంలో మహిళలకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు.
Similar News
News December 15, 2025
విజయ్ హజారే ట్రోఫీ అందరూ ఆడాల్సిందే: BCCI

డిసెంబరు 24 నుంచి ప్రారంభంకానున్న విజయ్ హజారే ట్రోఫీలో జాతీయ జట్టులో ఉన్న ఆటగాళ్లందరూ తప్పనిసరిగా పాల్గొనాలని BCCI స్పష్టం చేసింది. కనీసం రెండు మ్యాచ్లు ఆడాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ నిర్ణయం కోహ్లీ, రోహిత్లకి మాత్రమే కాకుండా అందరికీ వర్తిస్తుందని తెలిపింది. దేశవాళీ క్రికెట్కు ప్రాధాన్యత ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ నిర్ణయం తీసుకుంది. గాయాలతో బాధపడుతున్న శ్రేయాస్ అయ్యర్కు మినహాయింపు ఉంది.
News December 15, 2025
పేరుపాలెంబీచ్లో న్యూఇయర్ వేడుకలు అభినందనీయం: డిప్యూటీ స్పీకర్

పేరుపాలెం బీచ్లో ఈనెల 31న సాగర తీరంలో న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ నిర్వహించడం అభినందనీయమని డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణంరాజు అన్నారు. సోమవారం పెదఅమిరంలోని తన కార్యాలయంలో ఆయన సెలబ్రేషన్స్కు సంబంధించిన కరపత్రాన్ని ఆవిష్కరించారు. పేరుపాలెం బీచ్ను అభివృద్ధి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ప్రత్యేక కార్యక్రమాలను చేపడుతుందని, వినోదాత్మకమైన కార్యక్రమాలను నిర్వహించడం మంచిదని ఆయన పేర్కొన్నారు.
News December 15, 2025
154 సర్పంచ్, ఉప సర్పంచ్ ఎన్నిక పూర్తి

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి. అన్నపురెడ్డిపల్లి, అశ్వారావుపేట, చండ్రుగొండ, చుంచుపల్లి, దమ్మపేట, ములకలపల్లి, పాల్వంచ 7 మండలాల్లో 138 సర్పంచ్, 1123 వార్డు మెంబర్లు ఈ ఎన్నికల్లో గెలిచారు. రెండవ విడతలో 16 మంది సర్పంచ్, 248 వార్డు మెంబర్లు ఏకగ్రీవం అయ్యారు. అలాగే 154 పంచాయతీలకు ఉపసర్పంచ్ ఎన్నిక పూర్తయింది. 20న ప్రమాణ స్వీకారం చేయనున్నారని జిల్లా ఎన్నికల అధికారి తెలిపారు.


