News January 25, 2025
PPM: ‘ప్రపంచాన్నే మార్చకలిగే శక్తిమంతులు బాలికలు’

బాలికల హక్కులను పరిరక్షిస్తూ, వారి అవసరాలను తీర్చగలిగితే సమాజంతో పాటు, ప్రపంచాన్ని మార్చకలిగే శక్తిమంతులు బాలికలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళలు, బాలికల కొరకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడమే సమాజంలో మహిళలకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు.
Similar News
News December 13, 2025
పోచారంలో పదవుల పరేషానీ.!

GHMC పునర్విభజనలో భాగంగా పోచారం మున్సిపాలిటీని కేవలం ఒకే డివిజన్గా కుదించడంపై నాయకుల నుంచి అసంతృప్తి వ్యక్తమవుతోంది. సుమారు 90 పదవులు కనుమరుగు కానుండడంతో, స్థానిక రాజకీయ సమీకరణాలను తారుమారు చేస్తోంది. రాజకీయంగా ఎదగాలనుకున్న ఆశావహుల్లో తీవ్ర నిరాశను నింపుతోంది. దాదాపు లక్షకు పైగా ఓట్లున్న ఈ ప్రాంతాన్ని 2-3 డివిజన్లుగా చేయాలని, ఇప్పటి వరకు 65 అభ్యంతరాలు వచ్చాయని Way2Newsకు DC నిత్యానంద్ తెలిపారు.
News December 13, 2025
NGKL: పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా సాగాలి: కలెక్టర్

జిల్లాలో రెండో విడత జరగనున్న పంచాయతీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్తో పాటు కౌంటింగ్ ప్రక్రియ సజావుగా కొనసాగాలని జిల్లా కలెక్టర్ బదావత్ సంతోష్ సూచించారు. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభించి మధ్యాహ్నం ఒంటిగంటకు నిలిపివేయాలని, భోజన విరామం అనంతరం రెండు గంటలకు కౌంటింగ్ ప్రక్రియ చేపట్టాలని సూచించారు. 151 గ్రామపంచాయతీలకు గాను 147 గ్రామాలలో పోలింగ్ నిర్వహణకు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.
News December 13, 2025
NGKL: 147 గ్రామాలలో 473 మంది సర్పంచ్ అభ్యర్థులు

జిల్లాలో ఈనెల 14న జరగనున్న రెండో విడత పంచాయతీ ఎన్నికలకు సంబంధించి 147 గ్రామ పంచాయతీల్లో 473 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 151 గ్రామాలకు గాను 4 గ్రామాలు ఏకగ్రీవం అయ్యాయి. 1412 వార్డులకు గాను 143 వార్డులు ఏకగ్రీవం కాగా 1269 వార్డులలో 3228 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. జిల్లాలోని బిజినేపల్లి, నాగర్కర్నూల్, పెద్దకొత్తపల్లి, పెంట్లవెల్లి, కొల్లాపూర్, కోడేరు, తిమ్మాజీపేటలలో ఎన్నికలు జరగనున్నాయి.


