News January 25, 2025
PPM: ‘ప్రపంచాన్నే మార్చకలిగే శక్తిమంతులు బాలికలు’

బాలికల హక్కులను పరిరక్షిస్తూ, వారి అవసరాలను తీర్చగలిగితే సమాజంతో పాటు, ప్రపంచాన్ని మార్చకలిగే శక్తిమంతులు బాలికలని మంత్రి గుమ్మిడి సంధ్యారాణి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళలు, బాలికల కొరకు ప్రత్యేకంగా ఒక రోజును కేటాయించడమే సమాజంలో మహిళలకున్న గౌరవాన్ని ప్రతిబింబిస్తుందని తెలిపారు. మహిళలు ఆర్థికంగా సాధికారత సాధించేందుకు కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపడుతున్నాయని అన్నారు.
Similar News
News February 14, 2025
రామగుండం: BRS వాళ్లు ఓర్వడం లేదు: MLA

దేశం మొత్తం గర్వపడేలా తెలంగాణను అద్భుతంగా అభివృద్ధి చేయబోతున్నామని రామగుండం MLA మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్ అన్నారు. రామగుండంలో గురువారం ఆయన మాట్లాడుతూ.. ఇటు రాష్ట్రంలో BRS.. అటు దేశంలో BJPబీసీలను, బహుజనులను హీనంగా చూసిన చరిత్ర ప్రజలందరికీ తెలుసని మండిపడ్డారు. సామాజిక న్యాయం కోసం కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుంటే BRSవాళ్లు ఓర్వడం లేదని, అందుకే గగ్గోలు పెడుతూ కపట ప్రేమను కురిపిస్తున్నారని ఫైర్ అయ్యారు.
News February 14, 2025
MNCL: బురద గుంటలో పడి వ్యక్తి మృతి

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని తిలక్ నగర్లో గురువారం బురద గుంటలో పడి గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడని సీఐ ప్రమోద్ రావు తెలిపారు. మృతుని వయస్సు 60 ఏళ్లు ఉంటుందన్నారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రిలోని మార్చురీ గదికి తరలించారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 8712656534 నంబర్కు సమాచారం ఇవ్వాలని సూచించారు.
News February 14, 2025
చిన్నారెడ్డి పుదుచ్చేరి సెంటిమెంట్.!

రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్ ఛైర్మన్ చిన్నారెడ్డి గతంలో పుదుచ్చేరి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా ఉన్న సమయంలో ఎన్నికలలో పార్టీ గెలుపొంది అధికారం చేపట్టింది. దీంతో ఆ రాష్ట్ర కాంగ్రెస్ వర్గాలు చిన్నారెడ్డిని సెంటిమెంట్గా భావిస్తారు. పుదుచ్చేరిలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో HYDలోని ప్రజాభవన్లో ఆ రాష్ట్ర మాజీ హోంశాఖ మంత్రి కందస్వామి చిన్నారెడ్డితో భేటీ అయ్యారు.