News March 14, 2025
PPM: ఫస్ట్ ఇయర్ పరీక్షలకు 365 గైర్హాజరు

ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ పరీక్షలకు గురువారం 365 గైర్హాజరైనట్లు DVEO మంజులా వీణ తెలిపారు. పార్వతీపురం జిల్లావ్యాప్తంగా 34 పరీక్షా కేంద్రాల్లో 7,278 మంది విద్యార్థులు పరీక్షలు రాయవలసి ఉండగా 6,912 మంది విద్యార్థులు హాజరయ్యారని తెలిపారు. 5,665 మంది జనరల్ విద్యార్థులకు గాను 5,493 మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,613 ఒకేషనల్ విద్యార్థులకు 1,419 మంది పరీక్ష రాశారని చెప్పారు.
Similar News
News February 12, 2026
‘ఆయుష్’లో త్వరలో 358 పోస్టుల భర్తీ: మంత్రి సత్యకుమార్

AP: ఆయుష్ శాఖలో వివిధ కేటగిరీల్లో నేషనల్ ఆయుష్ మిషన్ ద్వారా 358 పోస్టుల భర్తీకి చర్యలు చేపట్టామని మంత్రి సత్యకుమార్ తెలిపారు. ‘వీటిలో డాక్టర్, సైకియాట్రిస్ట్, ఫిజియోథెరపిస్ట్, పంచకర్మ థెరపిస్ట్, యోగా ఇన్స్ట్రక్టర్, మల్టీపర్పస్ వర్కర్, స్వీపర్ వంటి పోస్టులు ఉన్నాయి. అలాగే 1 ఆయుర్వేద, 3 హోమియో కాలేజీల్లోని 140 టీచింగ్, నాన్-టీచింగ్ పోస్టులు కాంట్రాక్టు పద్ధతిలో భర్తీ చేస్తాం’ అని వివరించారు.
News February 12, 2026
KNR: ‘నగర’ ఫలితం: లెక్కింపునకు సర్వం సిద్ధం

కరీంనగర్ నగరపాలక సంస్థ 66 డివిజన్ల ఓట్ల లెక్కింపునకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు కమిషనర్ ప్రఫుల్ దేశాయ్ తెలిపారు. ఎస్ఆర్ఆర్ కళాశాలలో సిబ్బందికి నిర్వహించిన శిక్షణలో సీపీ గౌస్ ఆలం పాల్గొని దిశానిర్దేశం చేశారు. 300 మంది సిబ్బందితో శుక్రవారం ఉదయం 8 గంటలకు లెక్కింపు ప్రారంభం కానుంది. మొత్తం 66 టేబుళ్లు ఏర్పాటు చేయగా, తొలుత పోస్టల్ బ్యాలెట్లు, అనంతరం సాధారణ ఓట్లను లెక్కిస్తారు.
News February 12, 2026
శాతవాహన విశ్వవిద్యాలయం డైరీ ఆవిష్కరణ

శాతవాహన విశ్వవిద్యాలయంలోని పరిపాలన భవనంలో VC యు.ఉమేష్ కుమార్, రిజిస్ట్రార్ పి.సతీష్ కుమార్, ఓఎస్డీ టు వీసీ డా.హరికాంత్, కళాశాలల ప్రిన్సిపల్స్, ఇతర పరిపాలన అధికారులతో కలిసి డైరీని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా VC మాట్లాడుతూ.. విశ్వ విద్యాలయాన్ని విస్తరించేందుకు, ఉత్తర తెలంగాణలో మేలైన విద్యను అందించడంలో శాతవాహన విశ్వవిద్యాలయాన్ని ముందు వరుసలో నిలపడానికి ప్రయత్నం చేస్తున్నామని అన్నారు.


