News December 17, 2024
PPM: మార్చి 17 నుంచి 31 వరకు పదవ తరగతి పరీక్షలు

వచ్చే ఏడాది మార్చి 17 వ తేదీ నుంచి 31 వ తేదీ వరకు పదవ తరగతి పరీక్షలు జరుగుతాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎన్.తిరుపతి నాయుడు సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..పరీక్షలు ఉదయం 9:30గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు జరుగుతాయన్నారు. జిల్లాలోని అన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయులు టైం టేబుల్ను విద్యార్థులకు తెలియజేయాలని కోరారు. విద్యార్థులకు ఇప్పటి నుంచే పరీక్షలకు సన్నద్ధం చేయాలన్నారు.
Similar News
News December 3, 2025
VZM: ఈ నెల 14తో తీరనున్న గడువు

అర్హులందరికీ ఇళ్ల స్థలాలు అందేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ రాంసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. బుధవారం అధికారులతో వీసీ నిర్వహించారు. ఇళ్ల స్థలాల కోసం పేర్లు నమోదు చేసుకునేందుకు ప్రభుత్వం ఈ నెల 14 వరకు గడువు ఇచ్చిందని, ఈ విషయాన్ని ప్రజలకు తెలియజేసి తప్పనిసరిగా నమోదు చేయించాలని సూచించారు. గ్రామ స్థాయిలో ఇళ్ల స్థలాల కోసం వివరాలు, అవసరమైన భూమి వంటి ప్రణాళికలను సిద్ధం చేయాలన్నారు.
News December 3, 2025
ఎర్త్ సమ్మిట్ గ్రామీణాభివృద్ధికి ఉపయోగకరం: డీసీసీబీ ఛైర్మన్

గ్రామాలును అభివృద్ధి చేయటానికి ఎర్త్ సమ్మిట్ దోహదపడుతుందని విజయనగరం జిల్లా డీసీసీబీ ఛైర్మన్ కిమిడి నాగార్జున బుధవారం తెలిపారు. గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ సాంకేతికత, ఆర్థిక నూతన పరిష్కారాలపై దృష్టి సారిస్తూ, NABARD, (IAMAI)లతో కలిసి డిసెంబర్ 5,6 తేదీల్లో గుజరాత్ గాంధీనగర్లో నిర్వహిస్తున్న ఎర్త్ సమ్మిట్ 2025 జరుగుతుందన్నారు. బ్యాంక్ రైతులకు, మహిళా సంఘాలకు సేవలకు ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు.
News December 3, 2025
VZM: ‘64 మందికి జరిమానాలు, ఇద్దరికి జైలు’

విజయనగరం పట్టణంలో జరిగిన డ్రంకెన్ డ్రైవ్ తనిఖీల్లో 66 మంది వాహనదారులు పట్టుబడ్డారు. కోర్టు విచారణలో 64 మందికి రూ.10,000 చొప్పున జరిమానా.. ఇద్దరికి వరుసగా 2 రోజులు, 5 రోజుల జైలు శిక్ష విధించామని ఎస్పీ దామోదర్ మంగళవారం తెలిపారు. రహదారి ప్రమాదాల నివారణకు మద్యం తాగి వాహనం నడపకూడదని, భద్రతా నియమాలు తప్పనిసరిగా పాటించాలని ఆయన సూచించారు.


