News March 15, 2025

PPM: మూడు అంబులెన్స్‌లను అందించిన NPCI

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులన్స్‌లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.

Similar News

News October 23, 2025

రేపే కటారి దంపతుల హత్య కేసు ఫైనల్ జడ్జిమెంట్

image

చిత్తూరు జిల్లాలో సంచలనం రేపిన మాజీ మేయర్ కటారి అనురాధ, ఆమె భర్త మోహన్‌ <<18079030>>హత్య కేసు<<>>లో శుక్రవారం తీర్పు వెలువడనుంది. 10 ఏళ్ళ పాటు ఈ కేసుపై విచారణ సాగింది. తీర్పు నేపథ్యంలో ఎలాంటి అలర్లు జరగకుండా పోలీసులు కోర్టు వద్ద పోలీస్ 30 యాక్ట్ అమలులో ఉంచారు. గుంపులుగా చేరడం, తిరగడంపై నిషేధం ఉన్నట్లు తెలిపారు. కోర్టు పరిసరాల్లో సిబ్బందికి తప్ప మరెవరికి అనునతి లేదని వారు స్పష్టం చేశారు.

News October 23, 2025

ఇంటర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్‌ఫండ్ ఫీజు వసూలు

image

TG: ఇంటర్ ఫస్టియర్ విద్యార్థుల నుంచి రికగ్నిషన్, గ్రీన్ ఫండ్ ఫీజు వసూలు చేయాలని ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. రికగ్నిషన్ ఫీజు రూ.220, గ్రీన్ ఫండ్ ఫీజు రూ.15 చొప్పున మొత్తం రూ.235 కలెక్ట్ చేయాలని ప్రిన్సిపల్స్‌ను ఆదేశించింది. ఇందుకు ప్రభుత్వ జూనియర్ కాలేజీలకు మినహాయింపు ఇచ్చింది. వసూలు చేసిన మొత్తాన్ని ఈనెల 24 నుంచి 31లోపు ఇంటర్ బోర్డుకు ఆన్‌లైన్ ద్వారా ట్రాన్స్‌ఫర్ చేయాలని సూచించింది.

News October 23, 2025

కామారెడ్డి: రైలులో నుంచి జారిపడి వ్యక్తి మృతి

image

రైలులో నుంచి జారి పడి వ్యక్తి మృతి చెందినట్లు కామారెడ్డి రైల్వే ఎస్ఐ లింబాద్రి తెలిపారు. మృతుడి జేబులో ఖమ్మం నుంచి లక్నో వరకు టికెట్ తీసుకున్నట్లు గుర్తించామన్నారు. మృతుడి వయస్సు సుమారు 30 ఏళ్లు ఉంటుందని పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు ఆయన వెల్లడించారు.