News March 15, 2025

PPM: మూడు అంబులెన్స్‌లను అందించిన NPCI

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులన్స్‌లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.

Similar News

News December 10, 2025

VJA: భవానీ భక్తులకు ప్రత్యేక క్యూలైన్‌ల ఏర్పాటు

image

ఇంద్రకీలాద్రిపై భవానీ దీక్ష విరమణ సందర్భంగా తరలివచ్చే భక్తులకు అసౌకర్యం తలెత్తకుండా ఆలయ అధికారులు ఏర్పాట్లు చేశారు. వినాయకుడి గుడి నుంచి టోల్‌గేట్ మీదుగా కొండపై ఓం టర్నింగ్ వరకు 3 క్యూలైన్లు, ఓం టర్నింగ్ వద్ద అదనపు లైన్‌లతో కలిపి 5 క్యూలైన్లు ఏర్పాటు చేశారు. దీక్షల విరమణ రోజుల్లో టికెట్ దర్శనాలకు అనుమతి లేదు. దర్శనానంతరం భక్తులు శివాలయం మెట్ల మార్గం ద్వారా దిగివెళ్లేలా ప్రత్యేక ఏర్పాట్లు చేశారు.

News December 10, 2025

కామారెడ్డి: చట్టాలపై అవగాహన కలిగి ఉండాలి: జడ్జి

image

ప్రపంచ మానవ హక్కుల దినోత్సవాన్ని పురస్కరించుకొని హ్యూమన్ రైట్స్ హెల్త్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం కామారెడ్డిలో చట్టాలపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిథిగా జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ కార్యదర్శి, సివిల్ జడ్జి నాగరాణి హజరయ్యారు. ఆమె మాట్లాడుతూ.. ప్రతి పౌరుడు తమ హక్కులు, బాధ్యతల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. న్యాయ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

News December 10, 2025

మోప్మ వార్షిక సంచికను విడుదల చేసిన కలెక్టర్

image

జిల్లా కలెక్టర్ కార్యాలయంలో మెప్మా 2024-2025 వార్షిక సంచికను కలెక్టర్ వెట్రి సెల్వి బుధవారం ఆవిష్కరించారు. పట్టణ ప్రాంతాల్లోని నిరుపేదల జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ అనేక కార్యక్రమాలను అమలు చేస్తుందని, ముఖ్యంగా మహిళల ఆర్థిక సాధికారికకు కృషి చేస్తుందన్నారు. మహిళలు నిరుపేదలు ప్రభుత్వం అందించే కార్యక్రమాలను సద్వినియోగం చేసుకుని ఆర్థిక అభివృద్ధి సాధించాలన్నారు.