News April 2, 2025

PPM: రెవెన్యూ సదస్సుల్లో 99.34 శాతం పూర్తి

image

జిల్లాలో 6,246 రెవెన్యూ సదస్సులకు గాను 6,205 సదస్సులను చేపట్టి 99.34 శాతం మేర పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అడిషనల్ సీసీఎల్ఎకు వివరించారు. రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్, రెగ్యులరైజేషన్, నీటి పన్ను తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో అడిషనల్ సీసీఎల్ఎ, సెక్రటరీ డా. ఎన్.ప్రభాకరరెడ్ది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News February 25, 2026

జర్మనీలో ఉద్యోగ అవకాశాలు

image

తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్‌పవర్ కంపెనీ లిమిటెడ్ (TOMCOM) ద్వారా జర్మనీలో ఎలక్ట్రీషియన్ విభాగంలో ఉద్యోగాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పన అధికారి బి.సాత్విక తెలిపారు. ఐటీఐ విద్యార్హతతో పాటు రెండేళ్ల అనుభవం ఉన్న 19-30 ఏళ్ల యువకులు దీనికి అర్హులు అని అన్నారు. ఈనెల 27వ తేదీన హనుమకొండలోని ప్రభుత్వ ఐటీఐ ప్రాంగణంలో జరిగే అవగాహన సదస్సుకు హాజరై పూర్తి వివరాలు తెలుసుకోవాలని ఆమె కోరారు.

News February 25, 2026

రష్యా-ఉక్రెయిన్ ‘కాల్పుల విరమణ’పై ఓటింగ్‌కు భారత్ దూరం

image

రష్యా-ఉక్రెయిన్ యుద్ధానికి నాలుగేళ్లు పూర్తైన వేళ కాల్పుల విరమణ తీర్మానాన్ని ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలో ప్రవేశపెట్టారు. దీనిపై ఓటింగ్‌కు భారత్ దూరంగా ఉంది. ఉక్రెయిన్ ప్రతిపాదించిన ఈ తీర్మానానికి 107 దేశాలు మద్దతు తెలపగా, భారత్, చైనా సహా 51 దేశాలు ఓటింగ్‌లో పాల్గొనలేదు. అంతర్జాతీయ చట్టాలకు లోబడి శాంతిని నెలకొల్పాలని, యుద్ధ ఖైదీలను విడుదల చేయాలని ఈ తీర్మానం కోరింది.

News February 25, 2026

సంగారెడ్డిలో ఈనెల 27న జాబ్ మేళా

image

సంగారెడ్డి పట్టణం బైపాస్ రోడ్డులోని పాత డీఆర్డీఏ ఉపాధి కార్యాలయంలో ఈనెల 27న ఉదయం 10:30 గంటలకు జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా అధికారి నిర్మల తెలిపారు. అపోలో ఫార్మసీలో ఖాళీల భర్తీకి 18 నుంచి 35 ఏళ్లలోపు పురుష అభ్యర్థులు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల వారు మరిన్ని వివరాల కోసం 08455-271010 నంబర్‌కు సంప్రదించాలని కోరారు. నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.