News April 2, 2025

PPM: రెవెన్యూ సదస్సుల్లో 99.34 శాతం పూర్తి

image

జిల్లాలో 6,246 రెవెన్యూ సదస్సులకు గాను 6,205 సదస్సులను చేపట్టి 99.34 శాతం మేర పూర్తి చేసినట్లు జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ అడిషనల్ సీసీఎల్ఎకు వివరించారు. రెవెన్యూ సదస్సులు, పీజీఆర్ఎస్, రెగ్యులరైజేషన్, నీటి పన్ను తదితర అంశాలపై జిల్లా కలెక్టర్లతో అడిషనల్ సీసీఎల్ఎ, సెక్రటరీ డా. ఎన్.ప్రభాకరరెడ్ది బుధవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాల వారీగా ప్రగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు.

Similar News

News November 14, 2025

అప్పినపల్లి వాసులకు పవన్ ప్రశంస

image

పెద్దపంజాణి(M) <<18282463>>అప్పినపల్లి<<>> వద్ద గ్రామస్థులు ఎర్రచందనం వాహనాన్ని అధికారులకు పట్టించిన సంగతి తెలిసిందే. దీనిపై Dy.CM పవన్ X వేదికగా స్పందించారు. ఎర్రచందనం అక్రమ రవాణా అడ్డుకట్టకు తీసుకుంటున్న చర్చలు ఫలిస్తున్నాయన్న ఆయన ఇందుకు సహకరించిన గ్రామస్థులను ఎక్స్ వేదికగా అభినందించారు. వారి చొరవ, ధైర్యాన్ని పవన్ మెచ్చుకున్నారు.

News November 14, 2025

ఇందిరా మహిళా శక్తి చీరల లక్ష్యాన్ని చేరాలి: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

సిరిసిల్ల: మహిళా సంఘాల సభ్యులకు రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో అందిస్తున్న ఇందిరా మహిళా శక్తి యూనిఫాం చీరల క్లాత్ ఆర్డర్ లక్ష్యాన్ని తప్పక చేరాలని ఇన్‌ఛార్జి కలెక్టర్‌ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల వస్త్ర పరిశ్రమపై కలెక్టరేట్‌లో చేనేత జౌళి శాఖ అధికారులు, వస్త్ర పరిశ్రమ కార్మికులు, ఆసాములు, యజమానులతో శుక్రవారం ఆమె సమీక్ష సమావేశం నిర్వహించారు. చీరల తయారీలో నాణ్యత పాటించాలని సూచించారు.

News November 14, 2025

PG పీజీ రీవాల్యుయేషన్ ఫలితాలు విడుదల

image

నాగార్జున యూనివర్సిటీ పరిధిలో ఏప్రిల్ లో జరిగిన పలు పీజీ కోర్సుల పరీక్షల రీవాల్యుయేషన్ ఫలితాలను పరీక్షల నిర్వహణ అధికారి ఆలపాటి శివప్రసాదరావు ప్రకటించారు. ఎమ్మెస్సీ బోటనీ, కెమిస్ట్రీ, కంప్యూటర్ సైన్స్, మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ నాలుగో సెమిస్టర్ ఫలితాలు ప్రకటించామన్నారు. ఫలితాలను వర్సిటీ వెబ్సైట్ www.anu.ac.in నుంచి పొందవచ్చని చెప్పారు.