News February 6, 2025
PPM: వీడీవీకెలను బలోపేతం చేయాలి- కలెక్టర్

మన్యం జిల్లాలో ప్రధానమంత్రి వన్ ధన్ వికాస కేంద్రాల (వీడీవీకే) కార్యకలాపాలను మెరుగుపరిచేందుకు అన్ని చర్యలు చేపట్టాలని నిర్ణయించారు. ఈ సందర్భంగా గురువారం జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్, గిరిజన సహకార కార్పొరేషన్ (జీసీసీ) మేనేజింగ్ డైరెక్టర్ కల్పనా కుమారి పార్వతీపురం కలెక్టరేట్లో సమావేశం నిర్వహించారు. పార్వతీపురం ఐటీడీఏ పరిధిలో 68, సీతంపేట ఐటీడీఏ పరిధిలో దాదాపు 54 వీడీవీకెలు ఉన్నాయి.
Similar News
News September 17, 2025
S.కొండ: ఫోక్సో కేసుపై DEO కార్యాలయంలో చర్చ

ఒంగోలు DEO కార్యాలయంలో సింగరాయకొండలో జరిగిన ఫోక్సో కేసు అంశంపై మంగళవారం చర్చ జరిగింది. ఈ సమావేశంలో డీఈఓ కిరణ్ కుమార్, డిప్యూటీ ఈవో చంద్రమౌళీశ్వరు పాల్గొన్నారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా పాఠశాలల్లో జరిగిన లైంగిక వేధింపుల కేసులను 164 స్టేట్మెంట్ ఆధారంగా తప్పుడు రీతిలో రిఫర్ చేస్తున్న పరిస్థితిపై చర్చ సాగింది. దీనిపై తగిన చర్యలు తీసుకునేలా జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్తానని డీఈఓ తెలిపారు.
News September 17, 2025
HYD: SEP 17.. పేర్లు మార్చిన పార్టీలు!

ఆపరేషన్ పోలోలో భాగంగా 1948, SEP 17న HYD సంస్థానం భారత్లో విలీనమైంది. ఇది జరిగి 77 ఏళ్లు పూర్తయినా ఏటా కొత్త చర్చనే. తెలంగాణ ప్రజా పాలన దినోత్సవం అని INC, విమోచనమని BJP అధికారికంగా వేడుకలు చేస్తోంది. ఇక సాయుధ పోరాటమని కమ్యూనిస్టులు, జాతీయ సమైక్యత అని BRS-MIM నేతలు వాదిస్తున్నారు. ఇటువంటి భిన్నాభిప్రాయాల మధ్య ‘SEP 17’ రాజకీయ బల ప్రదర్శనకు వేదికవుతోంది. తీరొక్క పేరుతో ఒకే కార్యక్రమం చేయడం గమనార్హం.
News September 17, 2025
చైతన్యానికి చెలిమై.. ఉద్యమానికి ఊపిరైంది మన పాలమూరు!

నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా తెలంగాణ మరిగిన వేళ.. పాలమూరు ముఖ్య భూమిక పోషించింది. సురవరం ప్రతాపరెడ్డి గోల్కొండ పత్రిక, గడియారం రామకృష్ణశర్మ రేడియో ప్రసారాల ద్వారా ప్రజల్లో చైతన్యం నింపి.. ఉద్యమ జ్వాలలు పుట్టించారు. బూర్గుల రామకృష్ణరావు, అనంతలక్ష్మి మందుముల నర్సింగరావు లాంటి నేతలు ఉద్యమానికి ఊపిరిగా నిలిచారు. నిజాం పాలనను తుడిచిపెట్టిన ప్రజాస్వామ్య జెండాకు ఈ జిల్లా గొప్ప మద్దతుగా నిలిచింది.