News March 28, 2025

PPM: ‘శ్రీ విశ్వావ‌సు ఉగాది వేడుక‌ల‌ను ఘ‌నంగా నిర్వహించాలి’

image

జిల్లాలో శ్రీ విశ్వావ‌సు నామ సంవత్సర ఉగాది వేడుక‌ల‌ను సంప్రదాయ రీతిలో ఘనంగా నిర్వహించాల‌ని జిల్లా కలెక్టర్ శ్యామ్ ప్రసాద్ జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం ఉగాది వేడుక‌ల ఏర్పాట్లపై సంబంధిత శాఖాధికారుల‌తో స‌మీక్షా స‌మావేశాన్ని కలెక్టర్ నిర్వ‌హించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లా కేంద్రంలో స్థానిక లయన్స్ కళ్యాణ మండపం వేదికగా ఈనెల 30వ తేదీన ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించాలన్నారు.

Similar News

News September 17, 2025

నిర్మల్: ఆకాశం ఎందుకో ఎర్రబడ్డది..!

image

సూర్యాస్తమయ సమయంలో ప్రకృతి సంతరించుకునే రంగులు ముచ్చట గొలుపుతాయి.. మరికొన్ని ఆశ్చర్యం కలిగిస్తాయి. బుధవారం సంధ్య వేళ సూర్యుడు అస్తమిస్తుండగా ఏర్పడిన అరుణవర్ణం చూపరులకు ఆహ్లాదం పంచింది. నిర్మల్ జిల్లా దిలావర్‌పూర్ మండలం గుండంపల్లి ప్రధాన రోడ్డు పక్కన నుంచి వెళ్తుండగా టెంబుర్ని పెద్ద చెరువు మీదుగా కనిపించిన ఈ దృశ్యం చూసే వారికి ఆహ్లాదం పంచింది.

News September 17, 2025

నిజాంసాగర్: మంజీర నదిలో వ్యక్తి గల్లంతు

image

నిజాంసాగర్ మండలం అచ్చంపేట్ సమీపంలోని నాగమడుగు వద్ద మంజీర నదిలో ఓ వ్యక్తి గల్లంతైన ఘటన బుధవారం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాలిలా.. బంజపల్లికి చెందిన వడ్ల రవి(42) నాగమడుగు ప్రాంతంలో కాలకృత్యాల కోసం వెళ్లాడు. అయితే, వరద నీటి ప్రవాహంలో గల్లంతయ్యాడు. స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రస్తుతం అతని ఆచూకీ కోసం గాలిస్తున్నారు.

News September 17, 2025

హీరోయిన్ ఇంటిపై కాల్పులు.. నిందితుల ఎన్‌కౌంటర్

image

హీరోయిన్ దిశా పటానీ <<17692512>>ఇంటిపై<<>> కాల్పుల కేసులో నిందితులు పోలీసుల ఎన్‌కౌంటర్‌లో మరణించారు. UPలోని ఘజియాబాద్‌లో వారిని పట్టుకునే క్రమంలో ఎదురుకాల్పులు చోటు చేసుకున్నాయి. ఈ కాల్పుల్లో నిందితులు అరుణ్, రవీంద్ర మరణించారని పోలీసులు తెలిపారు. నిందితులు గోల్డీ బ్రార్ గ్యాంగ్ సభ్యులని పేర్కొన్నారు. సనాతన ధర్మాన్ని అగౌరవపరిచినందుకు హీరోయిన్ ఇంటిపై కాల్పులు జరిపినట్లు వారు వెల్లడించిన సంగతి తెలిసిందే.