News March 21, 2025
PPM: సీపీహెచ్సీలకు సూచనలు చేసిన డీఎంహెచ్ఓ

సమగ్ర ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ (CPHC) శిక్షణ ద్వారా నేర్చుకున్న నైపుణ్యంతో గ్రామీణ స్థాయిలో మెరుగైన వైద్య సేవలు అందజేయాలని జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారి డాక్టర్ ఎస్. భాస్కరరావు సూచించారు. స్టాఫ్ నర్స్,ఏఎన్ఎం లకు సిపిహెచ్సి శిక్షణా కార్యక్రమాన్ని బ్యాచ్ల వారీగా నిర్వహించారు. ఈ మేరకు ఎన్జీఓ హోమ్లో శుక్రవారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో డీఎంహెచ్ఓ మాట్లాడారు.
Similar News
News December 5, 2025
ఖమ్మం మార్కెట్కు రేపు, ఎల్లుండి సెలవు

ఖమ్మం వ్యవసాయ మార్కెట్కు శని, ఆదివారాలు (డిసెంబర్ 6, 7) వారంతపు సెలవుల కారణంగా మార్కెట్ శాఖ అధికారులు సెలవు ప్రకటించారు. ఈ రెండు రోజుల్లో మార్కెట్లో క్రయవిక్రయాలు జరగవని తెలిపారు. తిరిగి ఈ నెల8వ తేదీ (సోమవారం) నుంచి క్రయవిక్రయాలు యథావిధిగా జరుగుతాయని అన్నారు. ఈ విషయాన్ని రైతులు గమనించాలని కోరారు.
News December 5, 2025
తిరుపతి: ఆయిల్ ఫామ్తో ప్రయోజనాలివే.!

ఆయిల్ ఫాం ప్రపంచంలోనే అత్యధికంగా నూనె ఉత్పత్తి చేసే పంటని తిరుపతి జిల్లా ఉద్యానవన శాఖ అధికారి తెలిపారు. ప్రతి ఎకరాకు సుమారు 4 మెట్రిక్ టన్నుల క్రూడ్ ఫామ్ ఆయిల్ అందిస్తుందని, ఇది ఇతర నూనె గుంజల పంటలతో పోలిస్తే 4నుంచి 10రెట్లు అధికంగా ఉంటుందని అన్నారు. ఒకసారి నాటిన తర్వాత ఆయిల్ ఫామ్ పంట 25 సంవత్సరాల వరకు రైతులకు నిరంతరం ఆదాయం ఇస్తుందన్నారు.
News December 5, 2025
చిత్తూరు: ‘తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలి’

పిల్లలకు సంబంధించిన ప్రతి విషయంలోనూ తల్లిదండ్రులు భాగస్వామ్యం కావాలని కలెక్టర్ సుమిత్ కుమార్ సూచించారు. చిత్తూరు మండలంలోని తుమ్మింద జడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్తో కలిసి ఆయన హాజరయ్యారు. ప్రస్తుతం పోటీ తత్వం ఎక్కువగా ఉందని విద్యార్థులు రాణించాలంటే క్రమశిక్షణతో కూడిన పట్టుదల, కృషి అవసరమన్నారు.


