News January 26, 2025

PPM: స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం

image

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు పాలూరు సాంబమూర్తి కుమార్తె పాలూరు భారతిని కలెక్టర్ సన్మానించారు.

Similar News

News November 22, 2025

వనపర్తి: ఉడెన్ షటిల్ కోర్ట్ ,జిమ్ ప్రారంభానికి సిద్ధం

image

వనపర్తి ఇండోర్ స్టేడియంలో సుమారు రూ.20 లక్షలతో నిర్మించిన వుడెన్ షటిల్ కోర్ట్, జిమ్ ఈరోజు మంత్రి వాకిటి శ్రీహరి, ఎమ్మెల్యే తూడి మెగారెడ్డి ప్రారంభించనున్నారు. రూ.12 లక్షలతో ఉడెన్కోట్ రూ.7 లక్షలతో జిమ్, సుమారు లక్షన్నరతో స్టేడియం డయాస్‌పై టాప్ నిర్మించేందుకు ప్రభుత్వం ఖర్చు చేసిందని సంబంధిత అధికారి తెలిపారు. క్రీడాకారులకు వ్యాయామ చేసేవారికి ఎంతో ఉపయోగమన్నారు.

News November 22, 2025

జల, వాయు మార్గాల ద్వారా భారత్-అఫ్గాన్ ట్రేడ్

image

భారత్-అఫ్గాన్ మధ్య సంబంధాలు బలోపేతమవుతున్నాయి. పాక్ రోడ్డు మార్గం మూసేయడంతో జల, వాయు మార్గాల ద్వారా ద్వైపాక్షిక వాణిజ్యాన్ని విస్తరించేందుకు సిద్ధమవుతున్నాయి. ఇందుకోసం ఇరాన్‌లోని చాబహార్ ఓడరేవుతోపాటు రెండు ప్రత్యేక కార్గో విమానాలను ఉపయోగించుకోనున్నట్లు ఇరు దేశాలు ప్రకటించాయి. ప్రస్తుతం IND-AFG మధ్య బిలియన్ డాలర్ల వాణిజ్యం జరుగుతుండగా, భవిష్యత్తులో మరింత పెంచనున్నాయి.

News November 22, 2025

రాష్ట్రస్థాయి ఖోఖో పోటీలకు జగిత్యాల విద్యార్థిని

image

ZPHS వెల్లుల్లలో జరిగిన ఉమ్మడి కరీంనగర్ జిల్లా స్థాయి ఖోఖో పోటీలలో బి.శ్రీవర్షిణి జగిత్యాల జిల్లా తరఫున అత్యంత ప్రతిభ కనబరిచి ఉమ్మడి కరీంనగర్ జిల్లాకు ఎంపికయింది. ఈ జట్టు రేపటి నుంచి 25వ తేదీ వరకు యాదాద్రి భువనగిరిలో జరగబోయే రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో పాల్గొననుంది. శ్రీవర్షిణి ఎంపిక పట్ల ప్రధానోపాధ్యాయులు రాజయ్య, ఉపాధ్యాయ బృందం ఆనందం వ్యక్తం చేసింది.