News January 26, 2025
PPM: స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు పాలూరు సాంబమూర్తి కుమార్తె పాలూరు భారతిని కలెక్టర్ సన్మానించారు.
Similar News
News November 20, 2025
HYD: రాజమౌళిపై PSలో ఫిర్యాదు

HYD రామోజీ ఫిల్మ్ సిటీలో హీరో మహేశ్ బాబు నటించిన వారణాసి సినిమా టైటిల్ రిలీజ్ ఈవెంట్లో హనుమంతుడిపై సినీ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి అనుచిత వ్యాఖ్యలు చేశారని యుగ తులసి పార్టీ అధ్యక్షుడు, టీటీడీ పాలకమండలి మాజీ సభ్యుడు కె.శివ కుమార్ అన్నారు. ఈ మేరకు అతడిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేయాలని కోరుతూ న్యాయవాది వినోద్తో కలిసి అబ్దుల్లాపూర్మెట్ PSలో ఫిర్యాదు చేశారు.
News November 20, 2025
భద్రకాళి అమ్మవారిని దర్శించుకున్న సినీ నటుడు ఆది సాయికుమార్

వరంగల్ భద్రకాళి అమ్మవారిని గురువారం ప్రముఖ సినీ నటుడు ఆది సాయికుమార్ దర్శించుకున్నారు. అనంతరం అర్చకులు శేషు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి అమ్మవారి శేష వస్త్రాన్ని అందించారు. ఈ కార్యక్రమంలో దేవస్థానం ధర్మకర్త వీరన్న, అధికారులు క్రాంతి కుమార్, సీనియర్ అసిస్టెంట్ హరినాథ్ తదితరులు పాల్గొన్నారు.
News November 20, 2025
వరంగల్: ‘స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించాలి’

స్థానిక సంస్థల ఎన్నికలను ప్రశాంతంగా, సమర్థవంతంగా నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని అధికారులకు ఆదేశించారు. గురువారం వీడియో కాన్ఫరెన్స్లో సర్పంచ్ ఎన్నికల ఏర్పాట్లు, రిజర్వేషన్లు, ఓటరు జాబితాలపై ఆమె సమీక్షించారు. ఈ సమావేశంలో వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద, డీసీపీ అంకిత్ కుమార్, అదనపు కలెక్టర్ సంధ్య రాణి తదితరులు పాల్గొన్నారు.


