News January 26, 2025
PPM: స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు పాలూరు సాంబమూర్తి కుమార్తె పాలూరు భారతిని కలెక్టర్ సన్మానించారు.
Similar News
News November 7, 2025
వైబోపేతంగా భద్రాద్రి రామయ్య నిత్య కళ్యాణం

భద్రాచలం శ్రీ సీతారామచంద్ర స్వామి వారి నిత్య కళ్యాణ వేడుక శుక్రవారం అత్యంత వైభవోపేతంగా నిర్వహించారు. తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం పల్లకి సేవగా చిత్రకూట మండపంలో కొలువు తీర్చి విష్వక్సేన, పూజ పుణ్యవచనం చేశారు. స్వామివారికి కంకణ ధారణ, అమ్మవారికి కంకణ ధారణ గావించి నిత్య కళ్యాణాన్ని ఆలయ అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు.
News November 7, 2025
కేంద్ర విద్యుత్ సవరణ బిల్లుపై TG డైలమా

TG: కేంద్ర విద్యుత్ సవరణ బిల్లు ముసాయిదాపై రాష్ట్ర ప్రభుత్వం డైలమాలో పడింది. దీనికి మద్దతివ్వాలా? లేదా అనే దానిపై ఇంకా డెసిషన్ తీసుకోలేదని అధికారులు తెలిపారు. BILLలోని డిస్కామ్ల ప్రైవేటీకరణ, అగ్రి ఇతర రంగాలకు సబ్సిడీల తగ్గింపు తదితరాలను ఉద్యోగ సంఘాలు వ్యతిరేకిస్తున్నాయి. అయితే నిధుల కేటాయింపు వంటి అంశాలూ ఉండడంతో తర్జనభర్జన పడుతున్నారు. NOV 8లోగా అభిప్రాయాలు పంపాలని కేంద్రం రాష్ట్రాలను కోరింది.
News November 7, 2025
వెలిగొండను ఎలా అంకితం చేశావు జగన్: నిమ్మల

వెలిగొండ ప్రాజెక్టు పనులు ఎక్కడివి అక్కడే ఉండిపోయాయని మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. అయినప్పటికీ ప్రాజెక్ట్ పూర్తి చేశానంటూ ఎన్నికల సమయంలో జగన్ జాతికి అంకితం ఎలా చేశారని ప్రశ్నించారు. దోర్నాల మండలంలో ప్రాజెక్టు కెనాల్, సొరంగం, తదితర అంశాలను పరిశీలించి అధికారులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. ఆయన వెంట మార్కాపురం ఎమ్మెల్యే కందుల, ఎర్రగొండపాలెం ఇన్ఛార్జ్ ఎరిక్షన్ బాబు ఉన్నారు.


