News January 26, 2025
PPM: స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు పాలూరు సాంబమూర్తి కుమార్తె పాలూరు భారతిని కలెక్టర్ సన్మానించారు.
Similar News
News February 23, 2026
పెద్దపల్లి: ‘కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో ఎంఓయూ’

జిల్లాలో సి.ఎస్.ఆర్ (CSR) నిధులతో గ్రామీణ, విద్యాభివృద్ధి పనులు చేపట్టేందుకు హిందుస్థాన్ కోకా కోలా కంపెనీ ప్రతినిధులతో కలెక్టర్ శ్రీహర్ష ఎం.ఓ.యు (MoU) కుదుర్చుకున్నారు. ఈ భాగస్వామ్యం ద్వారా నీటి భద్రత, విద్య, మహిళా సాధికారత వంటి కార్యక్రమాలను ప్రాధాన్యతగా అమలు చేయనున్నారు. సమీకృత కలెక్టరేట్లో జరిగిన ఈ సమావేశంలో అభివృద్ధి పనులపై ప్రత్యేక చర్యలు చేపట్టాలని నిర్ణయించారు.
News February 23, 2026
KMR: జిల్లాస్థాయి భౌతిక-రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్

భౌతిక రసాయ శాస్త్ర ఫోరం ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఓ కళాశాలలో జిల్లాస్థాయి భౌతిక-రసాయన శాస్త్ర టాలెంట్ టెస్ట్ నిర్వహించారు. DEO రాజు మాట్లాడుతూ.. విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం పెంపొందించేందుకు టాలెంట్ టెస్ట్లు ఉపయోగపడతాయన్నారు. టాలెంట్ పరీక్షలో ఆరాధ్య (ZPHS, రాజంపేట), శ్రేయాస్ (తెలంగాణ మైనార్టీ స్కూల్, మేనూర్) ప్రథమ స్థానంలో నిలిచారని ఫోరం అధ్యక్షులు తెలిపారు.
News February 23, 2026
తిరుపతి జిల్లాలో విషాదం

తిరుపతి జిల్లా బాలాయపల్లె మండలం వాక్యం గ్రామానికి చెందిన రైతు కొమ్ము గరిటయ్య (57) విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందాడు. తన పొలంలో విద్యుత్ మోటారు అమర్చే క్రమంలో స్టార్టర్ వద్ద విద్యుత్ షాక్ తగలడంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా స్థలాన్ని పరిశీలించిన బాలాయపల్లె పోలీసులు, అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


