News January 26, 2025

PPM: స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం

image

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు పాలూరు సాంబమూర్తి కుమార్తె పాలూరు భారతిని కలెక్టర్ సన్మానించారు.

Similar News

News December 9, 2025

NGKL: జిల్లాలో విపరీతంగా పెరిగిన చలి తీవ్రత

image

నాగర్‌కర్నూల్ జిల్లాలో గత ఐదు రోజుల నుంచి చలి తీవ్రత విపరీతంగా పెరిగింది. గడిచిన 24 గంటలో అత్యల్పంగా కల్వకుర్తి మండలం తోటపల్లిలో 9.6 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. బిజినేపల్లిలో 10.6, తెలకపల్లి 11.0, తాడూర్ మండలం యంగంపల్లిలో 11.1, అమ్రాబాద్‌లో 11.2, ఊర్కొండ 11.5, వెల్దండ 11.6, బల్మూరు మండలం కొండారెడ్డిపల్లిలో 11.8 డిగ్రీల కనిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదు అయ్యాయి.

News December 9, 2025

పుట్టగూడెం, మల్లన్నగూడెం మరోసారి ఏకగ్రీవం

image

గ్రామాభివృద్ధి లక్ష్యంగా రాజాపేట మండలంలోని పుట్టగూడెం, మల్లన్నగూడెం గ్రామ పంచాయతీలు ఈసారి కూడా ఏకగ్రీవమయ్యాయి. పుట్టగూడెంలో 332 మంది ఓటర్లు, మల్లన్నగూడెంలో 759 మంది ఓటర్లు ఉన్నారు. ఈ రెండు గ్రామాల్లో గ్రామ పెద్దలు, నాయకుల సమన్వయంతో శాంతియుతంగా ఏకగ్రీవం సాధించారు. ప్రజల ఐక్యతతో ఎన్నికలు లేకుండా ఏకగ్రీవంగా పాలకవర్గాన్ని ఎన్నుకున్న ఈ గ్రామాలు ఆదర్శంగా నిలిచాయి.

News December 9, 2025

వరంగల్‌లో ఉద్యోగులకు ఏసీబీ వణుకు

image

ఉమ్మడి వరంగల్‌లో ACB దాడులు పెరిగాయి. గతేడాది 16 కేసులు నమోదవగా ఈ ఏడాది ఇప్పటి వరకు 19 కేసులు నమోదు చేశారు. రవాణా శాఖ తిమింగళం, తొర్రూర్ CI, పెద్ద వంగర తహశీల్దార్, తాజాగా HNK అడిషనల్ కలెక్టర్‌ను లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. DSP సాంబయ్య నేతృత్వంలో విద్యాశాఖలో 3, పోలీసు2, రవాణా2, రిజిస్ట్రేషన్2, రెవెన్యూ3, రోడ్లు1, వ్యవసాయం1, ట్రాన్స్ కో1, భగీరత1, పంచాయతీ రాజ్2, మత్స్యశాఖలో ఒకరు ACBకి చిక్కారు.