News January 26, 2025

PPM: స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు సన్మానం

image

పార్వతీపురం మన్యం జిల్లా కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. గణతంత్ర దినోత్సవ సందర్భంగా స్వాతంత్ర సమరయోధుల కుటుంబ సభ్యులకు కలెక్టర్ ఏ. శ్యామ్ ప్రసాద్ చేతుల మీదుగా ఘన సన్మానం జరిగింది. ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులు పాలూరు సాంబమూర్తి కుమార్తె పాలూరు భారతిని కలెక్టర్ సన్మానించారు.

Similar News

News January 10, 2026

తిరుపతిలో ఉదయాన్నే రోడ్డు ప్రమాదం.. ఒకరి మృతి

image

తిరుపతి రూరల్ తనపల్లి జంక్షన్ దగ్గర ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. విజయవాడ నుంచి బెంగళూరు వెళ్తున్న ఓ ట్రావెల్స్ బస్సు రోడ్డు దాటుతున్న ఓ వ్యక్తిని బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలైన సుమారు 45 ఏళ్ల గుర్తుతెలియని వ్యక్తిని రుయా ఆసుపత్రికి తరలించగా, అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందారు. ​డ్రైవర్ అతివేగంగా, అజాగ్రత్తగా బస్సును నడపడం వల్లే ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News January 10, 2026

WPL: ఇవాళ డబుల్ ధమాకా

image

ఉమెన్స్ ప్రీమియర్స్ లీగ్‌లో నేడు రెండు మ్యాచులు జరగనున్నాయి. టోర్నీలో 5 జట్లే పాల్గొంటుండటంతో టీమ్‌లు వరుస రోజుల్లో మ్యాచులు ఆడే పరిస్థితి ఏర్పడింది. నిన్న తొలి మ్యాచులో RCB చేతిలో <<18814463>>ఓడిన<<>> ముంబై ఇవాళ రాత్రి 7.30 గంటలకు ఢిల్లీ క్యాపిటల్స్‌ను ఎదుర్కోనుంది. మధ్యాహ్నం 3.30 గంటలకు జరిగే మ్యాచులో గుజరాత్-యూపీ వారియర్స్ తలపడతాయి. హాట్‌స్టార్, స్టార్ స్పోర్ట్స్‌లో లైవ్ చూడవచ్చు.

News January 10, 2026

MBNR: ఈ నెల 12న ఉద్యోగమేళా

image

మహబూబ్ నగర్ మహిళా సమైక్య కార్యాలయంలో ఈ నెల 12న మహేంద్ర ఆటోమేటిక్ డిజైన్ కంపెనీలో ఉద్యోగాల భర్తీకి మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి తెలిపారు. సుమారు 200 ఖాళీలు ఉన్నాయని, పదో తరగతి, ఇంటర్, ఐటీఐ ఉత్తీర్ణులైన వారు అర్హులని పేర్కొన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ ధ్రువపత్రాలతో ఆ రోజు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని సూచించారు.