News February 24, 2025
PPM: ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లది కీలకపాత్ర

స్వేచ్ఛాయుత, నిష్పక్షపాత ఎన్నికల నిర్వహణలో మైక్రో అబ్జర్వర్లు కీలకపాత్ర అని DRO కె.హేమలత స్పష్టం చేశారు. జవాబుదారీతనం కలిగి సాధారణ పరిశీలకుల నియంత్రణ, పర్యవేక్షణలో సూక్ష్మ పరిశీలకులు పనిచేయాల్సి ఉంటుందన్నారు. సూక్ష్మ పరిశీలకులు గుర్తించిన అంశాలను సాధారణ పరిశీకులకి సీల్డ్ కవర్లో అందించాలని ఆమె పేర్కొన్నారు. సోమవారం ఎమ్మెల్సీ ఎన్నికలపై కలెక్టర్ కార్యాలయంలో శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశారు.
Similar News
News February 24, 2025
3 రోజుల పోలీస్ కస్టడీకి వల్లభనేని వంశీ

AP: వైసీపీ నేత వల్లభనేని వంశీని ఎస్సీ, ఎస్టీ కోర్టు 3 రోజుల పోలీస్ కస్టడీకి అనుమతించింది. మూడు రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు విచారించాలని పేర్కొంది. న్యాయవాది సమక్షంలోనే ఆయనను విచారించాలని ఆదేశించింది. ఉదయం, సాయంత్రం మెడికల్ టెస్టులు చేయాలని సూచించింది. వంశీకి వెస్ట్రన్ టాయిలెట్, బెడ్ సౌకర్యాలు కల్పించాలని జైలు అధికారులను న్యాయస్థానం ఆదేశించింది.
News February 24, 2025
జగిత్యాల: యూరియా కోసం రైతుల ఇబ్బందులు

జగిత్యాల జిల్లా వ్యాప్తంగా యూరియా దొరకక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వరి పంటకు చివరి దశలో యూరియా చల్లడానికి రైతులకు బస్తాల కోసం ఎదురుచూపులు తప్పడం లేదు. అరకొరగా వస్తున్న యూరియా కోసం వందల సంఖ్యలో రైతులు సహకార సంఘాలు, ప్రైవేట్ డీలర్ల వద్ద కాపలా కాస్తున్నారు. సోమవారం జగిత్యాల, మల్లాపూర్కు యూరియా రాగా రైతులు అధికసంఖ్యలో రావడంతో పోలీసు బందోబస్తు మధ్య పంపిణీ చేశారు.
News February 24, 2025
ఓటీటీలోకి కొత్త సినిమా

అజిత్, త్రిష ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన చిత్రం ‘విదాముయార్చి’(పట్టుదల) మార్చి 3 నుంచి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమింగ్ కానుంది. తమిళ్, హిందీ, తెలుగు, కన్నడ, మలయాళం భాషల్లో ఈ మూవీ స్ట్రీమింగ్ కానున్నట్లు నెట్ ఫ్లిక్స్ ఇండియా సౌత్ ట్వీట్ చేసింది. మగిజ్ తిరుమేని తెరకెక్కించిన ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. విడుదలైన నాలుగు వారాల్లోనే ఓటీటీలోకి రానుంది.