News February 6, 2025
PPM: నిర్ణిత కాల వ్యవధిలోగా మ్యూటేషన్లు పరిష్కరించాలి

రీసర్వే, రెవెన్యూ సదస్సులు, మీ సేవా పోర్టల్ ద్వారా వచ్చే మ్యూటేషన్లను నిర్ణిత కాల వ్యవధిలోగా పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ తహశీల్దార్లకు సూచించారు. 30 రోజులు దాటి ఒక్క రోజు ఆలస్యమైన సంబంధిత అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రెవెన్యూ సమస్యలపై సబ్ కలెక్టర్లు, తహశీల్దార్లు, రెవిన్యూ అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమీక్షించారు.
Similar News
News September 16, 2025
ఎల్లారెడ్డిపేట: యాదవ హక్కుల పోరాట సమితి యూత్ జిల్లా అధ్యక్షుడిగా నాగరాజ్

యాదవ హక్కుల పోరాట సమితి యూత్ జిల్లా అధ్యక్షుడిగా ఎల్లారెడ్డిపేట మండలం కేంద్రానికి చెందిన మానుక నాగరాజ్ నియమితులయ్యారు. ఈ సందర్భంగా రాష్ట్ర యాదవ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షులు కొక్కు దేవేందర్, మంగళవారం ఆయనకు నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా నాగరాజ్ మాట్లాడుతూ.. యాదవుల సమస్యలపై పోరాటం చేస్తానని హామీ ఇచ్చారు. తన నియామకానికి సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు.
News September 16, 2025
ప్రజాపాలన దినోత్సవానికి ముఖ్యఅతిథిగా బీర్ల ఐలయ్య

జనగామ కలెక్టరేట్లో బుధవారం జరగనున్న ప్రజాపాలన దినోత్సవం ముఖ్యఅతిథిగా ఆలేరు ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య హాజరు కానున్నారు. ఉదయం 9.58 గంటలకు జనగామ కలెక్టరేట్కు చేరుకొని ఉదయం 10 గంటలకు జాతీయ జెండాను ఆవిష్కరించనున్నారు. ప్రజాపాలన దినోత్సవాలకు కలెక్టరేట్ లో సభా ప్రాంగణం, తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు.
News September 16, 2025
SRCL: ‘ఓటర్ జాబితా స్పెషల్ రివిజన్ కట్టుదిట్టంగా చేపట్టాలి’

రాజన్న సిరిసిల్ల జిల్లాలో ఓటర్ జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్.ఐ.ఆర్) కట్టుదిట్టంగా నిర్వహించాలని కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అధికారులను ఆదేశించారు. 2022 సం. ఓటర్ల జాబితాతో తాజా జాబితాను పోల్చి, డూప్లికేట్, దొంగ ఓట్లను తొలగించాలని సూచించారు. ప్రతి బూత్ పరిధిలో ధృవీకరణ చేసి, సెప్టెంబర్ 22లోపు జాబితా సమర్పించాలని ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా అధికారులు, ఆర్డీవోలు, తహశీల్దార్లు పాల్గొన్నారు.