News February 4, 2025
PPM: ప్రతికూల వార్తలపై అధికారులు తక్షణమే స్పందించాలి

జిల్లాలో సంస్థాగతంగా ప్రజలకు సేవలు అందించడంలో లోపాలు పట్ల వివిధ పత్రికల్లో వస్తున్న ప్రతికూల వార్తలపై జిల్లా అధికారులు తక్షణమే స్పందించి చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ ఎ.శ్యామ్ ప్రసాద్ ఆదేశించారు. సోమవారం కలెక్టర్ కార్యాలయ సమావేశ మందిరంలో జిల్లా, మండల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ప్రతి అధికారి పూర్తిస్థాయిలో ప్రజలకు సేవలు అందించాలని కోరారు.
Similar News
News January 10, 2026
గండికోట ఉత్సవాలు.. హెలికాఫ్టర్ రైడ్ ధర తగ్గింపు

గండికోట ఉత్సవాలలో హెలికాఫ్టర్ రైడింగ్లో ధరల తగ్గించినట్లు కలెక్టర్ తెలిపారు. ముందుగా ఒక వ్యక్తికి రూ. 5 వేలుగా నిర్ణయించగా.. దానిని రూ.3 వేలకు తగ్గిస్తున్నట్లు కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. 6 నిమిషాలు రైడింగ్ ఉంటుందన్నారు. గండికోట చుట్టు పక్క ప్రాంతాలు, గండికోట ప్రాజెక్టు, మైలవరం జలాశయాన్ని హెలికాఫ్టర్ ద్వారా వీక్షించే అవకాశం ఉంటుందన్నారు.
News January 10, 2026
టికెట్ ధరల పెంపు మీకు ఓకేనా?

సినిమా టికెట్ ధరల వ్యవహారం ఇప్పుడు ఒక అంతుచిక్కని ప్రశ్న. ఒకవైపు ‘భారీ బడ్జెట్ సినిమాలకు పెంపు తప్పదు’ అని మేకర్స్ అంటుంటే, ‘సామాన్యుడు వినోదానికి దూరం కావాలా?’ అని ప్రేక్షకులు ప్రశ్నిస్తున్నారు. నిజానికి సినిమా బాగుంటే ఎంతైనా ఖర్చు పెడతాం అనుకునే వారు కొందరైతే, కుటుంబంతో కలిసి చూడాలంటే ఈ ధరలు భారమేనని మెజారిటీ జనం అభిప్రాయపడుతున్నారు. ఓ సామాన్యుడిగా టికెట్ ధరల పెంపుపై మీ అభిప్రాయం ఏంటి? COMMENT
News January 10, 2026
అమరావతిపై జగన్ అడిగింది అదే: సజ్జల

AP: CM CBN చెబుతున్న అమరావతి మదర్ ఆఫ్ ఆల్ స్కామ్స్ అని YCP స్టేట్ కోఆర్డినేటర్ సజ్జల ఆరోపించారు. ‘పెద్ద భవనాల పేరుతో బడ్జెట్ పెంచుతున్నారు. అంత డబ్బు అవసరమా? అని మాత్రమే జగన్ అడిగారు. అమరావతిపై ఆయన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదు. రాజధాని పేరుతో జగన్ను దూషిస్తున్నారు. అమరావతి టెండర్లలో కొన్ని కంపెనీలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ గురించి సమాధానం చెప్పట్లేదు’ అని విమర్శించారు.


