News March 15, 2025
PPM: మూడు అంబులెన్స్లను అందించిన NPCI

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్లను అందించారు. ఈ అంబులన్స్లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.
Similar News
News March 16, 2025
నిజాంసాగర్ ప్రాజెక్టు నీటి విడుదల

నిజాంసాగర్ ఆయకట్టు కింద సాగుచేస్తున్న యాసంగి పంటల కోసం ప్రాజెక్టు నుంచి 5వ విడత నీటిని విడుదల చేశారు. ఆయకట్టు కింద సాగవుతున్న పంటల సాగు కోసం ఇప్పటి వరకు 4విడతల్లో సుమారు 8టీఎంసీల నీటిని ఆయకట్టుకు అందించారు. ప్రస్తుతం ప్రధాన కాలువ ద్వారా ఐదో విడత నీటిని 1,213 క్యూసెక్కుల చొప్పున నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టులో 1405.00 అడుగులకు 1396.75 అడుగుల, నీరు నిల్వ ఉన్నట్లు ఈఈ సొలోమన్ తెలిపారు.
News March 16, 2025
విద్యార్థుల భవిష్యత్తు తీర్చిదిద్దేది ఉపాధ్యాయులే: కలెక్టర్

మెదక్ పట్టణంలో గిరిజన మినీ గురుకులాన్ని కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా కలెక్టర్ ఇక్కడ పరిశుభ్రతా చర్యలు, పారిశుద్ధ్య నిర్వహణ, విద్యార్థుల శ్రేయస్సు, బోధనా సామర్థ్యాలు, ఆహార భద్రత, తదితరాల వంటి వాటిని పరిశీలించారు. మెనూ ప్రకారం ఆహారం అందించాలని తెలిపారు. తరగతి గదుల్లో విద్యార్థులతో మమేకమై వారి విద్యా ప్రతిభను పరీక్షించి పలు సూచనలు చేశారు.
News March 16, 2025
కమెడియన్లతో నటించేందుకు ఇష్టపడరు: సప్తగిరి

కమెడియన్లతో నటించేందుకు హీరోయిన్లు ఇష్టపడరని నటుడు సప్తగిరి అన్నారు. తాను ప్రధాన పాత్రలో నటించిన ‘పెళ్లి కాని ప్రసాద్’ మూవీ ప్రమోషన్లలో ఆయన మాట్లాడారు. ‘కమెడియన్ల పక్కన హీరోయిన్లు దొరకడం కష్టం. చాలా మంది కమెడియన్ పక్కనా? అంటారు. తన పక్కన నటించడానికి ఒప్పుకున్న ప్రియాంక శర్మకు ధన్యవాదాలు’ అని తెలిపారు. అలాగే, సినిమా వాళ్లకు ఎంత పేరొచ్చినా, మంచి అలవాట్లు ఉన్నా పిల్లను ఇవ్వరని తెలిపారు.