News March 15, 2025

PPM: మూడు అంబులెన్స్‌లను అందించిన NPCI

image

న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (NPCI) పార్వతీపురం మన్యం జిల్లాకు మూడు అంబులెన్స్‌లను అందించారు. ఈ అంబులన్స్‌లను సాలూరులో రాష్ట్ర మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి మరియు గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ప్రారంభించగా, పార్వతీపురంలో జిల్లా కలెక్టర్ ఏ శ్యామ్ ప్రసాద్, స్థానిక శాసన సభ్యులు బోనెల విజయ చంద్రతో కలసి శనివారం ప్రారంభించారు.

Similar News

News March 16, 2025

కన్నప్ప స్వగ్రామానికి మంచు విష్ణు

image

సినీ నటుడు మంచు విష్ణు శివభక్తుడు కన్నప్ప స్వగ్రామాన్ని సందర్శించారు. తన మూవీ టీమ్‌తో కలిసి అన్నమయ్య జిల్లాలోని రాజంపేట మండలం ఊటుకూరుకు వెళ్లారు. అక్కడి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయాన్ని అభివృద్ధి చేస్తానని హామీ ఇచ్చారు. అయితే విష్ణు హీరోగా తెరకెక్కిన కన్నప్ప చిత్రం ఏప్రిల్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ చిత్రంలో ప్రభాస్, అక్షయ్‌కుమార్‌తో పాటు ఇతర స్టార్‌లు నటించారు.

News March 16, 2025

సంగారెడ్డి: ఈనెల 17న ప్రజావాణి

image

సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని సమీకృత కలెక్టరేట్ కార్యాలయంలో ఈనెల 17న ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ వల్లూరి క్రాంతి తెలిపారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు జరుగుతుందన్నారు. అధికారులు అందరూ అందుబాటులో ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు.

News March 16, 2025

మానసికంగా ధైర్యం కోల్పోయా: మంత్రి సీతక్క

image

TG:సోషల్ మీడియాలో తనపై పెట్టిన పోస్టులకు మానసికంగా ధైర్యం, కోల్పోయానని మంత్రి సీతక్క ఆవేదన వ్యక్తం చేశారు. నిజాయితీగా పనిచేసే మహిళల ధైర్యాన్ని సోషల్ మీడియా, పోస్టులు దెబ్బ తీస్తాయన్నారు. బీఆర్ఎస్ రాజకీయంగా ఎదుర్కొవాలి గానీ, సామాజిక మాధ్యమాలతో తప్పుడు ప్రచారం చేయడమేంటని ప్రశ్నించారు. సీఎం రేవంత్ చేసిన మార్చురీ వ్యాఖ్యలు వ్యక్తిని కాదు పార్టీని ఉద్దేశించనవని మంత్రి స్పష్టం చేశారు.

error: Content is protected !!